ఎయిరిండియా క‌ష్ట‌న‌ష్టాల ప‌రంప‌ర ఇంకా ఆగ‌లేదా?

Publish Date:Jun 17, 2025

Advertisement

యువ‌ర్ అటెన్ష‌న్ ప్లీజ్. హాంకాంగ్ టూ ఢిల్లీ ఫ్లైట్ నెంబ‌ర్ ఏ1- 315 బోయింగ్ 787-8 డ్రీమ్ లైన‌ర్ చిన్న సాంకేతిక స‌మ‌స్య త‌లెత్త‌డంతో తిరిగి హాంకాంగ్ లో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేయ‌బోతున్నామ‌ని ప్ర‌కటించ‌డంతో ఒక్క‌సారిగా ప్ర‌యాణికుల గుండెలు అర‌చేతిలోకి వ‌చ్చేశాయి. ఎవ‌రి ఇష్ట దైవాన్ని వారు త‌లుచుకోవడం మొద‌లు పెట్టారు.తిరిగి హాంకాంగ్ లో ఈ ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక బ‌తుకు జీవుడా! అంటూ ఎటు వాళ్లు అటు పారిపోయారు. ఇంతా చేస్తే ఎయిరిండియా అధికార ప్ర‌తినిథి చెప్పిందేంటంటే.. వారి ప్ర‌యాణాన్ని రీషెడ్యూల్ చేస్తాం. లేదంటే టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో దాదాపు అంద‌రు ప్ర‌యాణికుల నుంచి వ‌చ్చిన మెసేజ్ రీఫండ్ చేయ‌మ‌ని.  యూపీలోని ఘ‌జియాబాద్ నుంచి కోల్ క‌తా వెళ్లే ఫ్ల‌యిట్ సిట్యువేష‌న్ ఇంకో ర‌కం. గంట సేపు సాంకేతిక లోపం కార‌ణంగా ఆగిపోయిందీ ఫ్లైట్ నెంబ‌ర్ ఐఎక్స్- 1511, ఆ గంట సేపు ప్రయాణికులు ఊపిరి బిగ‌బ‌ట్టి అలాగే కాలం గ‌డిపారంటే వారి ప‌రిస్థితేమిటో ఊహించుకోవ‌చ్చు.

మ‌రో భ‌యంక‌ర‌మైన ప్ర‌యాణ అనుభ‌వం విష‌యానికి వ‌స్తే.. ఆరోజు స‌రిగ్గా జూన్ 12వ తేదీ. ఆ టైంలో అహ్మ‌దాబాద్ లో ఘోర విమాన ప్ర‌మాదం జ‌రిగింది. దుబాయ్ నుంచి జైపూర్ రావ‌ల్సిన ఐఎక్స్- 196 దుబాయ్ లో రాత్రి 7. 44కి బ‌య‌లు దేరాల్సింది మ‌రునాటి వేకువ జాము 12. 44కి బ‌య‌లు దేరింది. అంటే ఏకంగా ఐదు గంట‌లు.  ఈ ఐదుగంట‌లూ ఆ ఫ్లైట్ లో న‌ర‌కం చూశారు ప్ర‌యాణికులు. ఏసీ లేదు. నీళ్లు, ఆహారం అందివ్వ‌లేదు. పిల్ల‌లుంటే వారు ఆ ఉక్క‌పోత‌లో ఆక‌లిద‌ప్పుల‌తో అల‌మ‌టించినా ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. ప‌క్క రోజు వేకువ జాము 2. 44కి ఈ ఫ్లైట్ జైపూర్ లో ల్యాండ‌య్యింది. ఆ స‌మ‌యంలో  ఈ ఎయిరిండియా ప్ర‌యాణికుల ఫీలింగ్ ఏంటో తెలుసా? హ‌మ్మ‌య్యా మ‌నం  కూడా కాలి బూడిద‌వకుండానే నేల‌పై అడుగు పెట్టాం. గంటో అర‌గంట‌లో ప్రాణాల‌తో ఇంటికెళ్తాం. బాప్ రే బ‌చ్ గ‌యా.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు. 

కాళ‌రాత్రులంటారే స‌రిగ్గా అలాంటి ప్ర‌యాణ అనుభ‌వాన్నిస్తోంది ఎయిర్ ఇండియా. దాని టైం బ్యాడో.. లేక దాన్నెక్కే ప్ర‌యాణికుల టైం స‌రిగా లేదో తెలీదు గానీ.. ఎయిర్ ఇండియా అంటేనే హ‌డ‌లి చ‌స్తున్నారొక్క‌క్క‌రూ. ఇండిగో త‌ర్వాత సెకండ్ బెస్ట్ ఎయిర్ లైన‌ర్ ఎయిర్ ఇండియా.  మొత్తం 102 దేశ విదేశీ తీరాల‌కు ప్ర‌యాణికుల‌ను చేర్చే ఎయిర్ ఇండియా చ‌రిత్ర ఈ నాటిది కాదు. ఇది 1932 నాటిది. దీని ఆప‌రేష‌న‌ల్ హెడ్డాఫీస్ ఢిల్లీ. బెంగ‌ళూరు, ముంబై వంటి ప్రాంతాల్లోనూ నెట్ వ‌ర్క్ విస్త‌రించి ఉంది. ఇక హ‌ర్యానాలోని గుర్గాంలో మెయిన్ ఆఫీసుంది. ప్ర‌స్తుతం ఎయిరిండియాలో డెబ్భై ఐదు శాతం వాటా టాటాల‌ది కాగా మిగిలిన ఇర‌వై ఐదు శాతం సింగ‌పూర్ ఎయిర్ లైన్స్ ది. 

ఎయిరిండియా మ‌ధ్య‌లో చేతులు మారినా ఇటీవ‌లే తిరిగి  టాటాల ప‌ర‌మైంది. ఆనాటి నుంచి 14 శాతం మేర లాభాల‌ను అర్జించింది. ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్- 24 కంటే, 25లో మెరుగైన‌ ట‌ర్నోవ‌ర్ర సాధించింది. ప్ర‌స్తుతం కూడా 11 శాతం  పెరుగుద‌ల‌తో 7 బిలియ‌న్ డాల‌ర్ల మేర ట‌ర్నోవ‌ర్ సాధిస్తోంది. అంతా బాగుంద‌నుకునే లోపు ఇదిగో ఈ వ‌రుస న‌ష్టాలు. అహ్మాదాబాద్ లో ఏమని అనుమానాస్ప‌ద ఘోర విమాన ప్ర‌మాదం జ‌రిగిందో అప్ప‌టి నుంచీ ఈ ఎయిర్ లైన‌ర్ టైం పూర్తిగా తిర‌బ‌డిన‌ట్టుంది. ప్ర‌యాణికుల‌కు మెరుగైన ప్ర‌యాణ  సౌక‌ర్యం అందిస్తామంటోన్న  ఎయిర్ ఇండియా.. వారి పాలిటి య‌మ‌పాశ‌మై.. దారుణంగా దెబ్బ తీస్తోంది.

ఇప్పుడెంత‌టి న‌ష్ట‌మంటే కేవ‌లం అహ్మ‌దాబాద్ డ్రీమ్ లైన‌ర్ కుప్ప‌కూల‌డంతో దాని విలువ 120 మిలియ‌న్ డాల‌ర్లు. అంటే దాదాపు వెయ్యి కోట్లు. అత్య‌వ‌స‌ర నిధి కింద పాతిక‌ల‌క్ష‌ల మేర ఈ ప్ర‌యాణ బాధితుల‌కు ఆర్ధిక సాయం ప్ర‌క‌టించింది ఎయిరిండియా. ఆల్రెడీ కోటి రూపాయ‌లు ఒక్కొక్క‌రికీ న‌ష్ట‌ప‌రిహారం ఇస్తామ‌ని చెప్పింది. ఈ మొత్తం విలువ సుమారు 300 కోట్లు. ఇక ప్ర‌మాదం జ‌రిగిన రోజు బోయింగ్ తో స‌హా ఇండిగో త‌దిత‌ర విమాన యాన షేర్ల‌న్నీ కుప్ప‌కూల‌డంతో ఈ మొత్తం న‌ష్టం విలువ సుమారు 6 ల‌క్ష‌ల కోట్లు. దీంతో ఇటు తామే కాకుండా అటు బోయింగ్ సంస్థ ఆర్డ‌ర్ల‌ను కూడా ఎయిరిండియా ప్ర‌భావితం చేస్తోన్న మాట వినిపిస్తోంది. 

మ‌రి ఈ న‌ష్టాల నుంచి ఎయిరిండియాను గ‌ట్టెక్కించేవారేరీ. ఈ విష‌యాలు తెలిసిన ప్ర‌యాణికులు ఎయిర్ ఇండియా అంటేనే హ‌డ‌లి పోతున్నారు. కార‌ణం టేకాఫ్ అయిన 45 సెక‌న్ల‌కే కుప్ప‌కూలిపోయే విమానాలున్న ఈ సంస్థ మెయిన్ టైన్స్ స‌రిగా లేద‌న్న పేరు రావ‌డంతో వారంతా ఈ ఫ్ల‌యిట్ బుకింగ్స్ కి ఒక‌టికి ప‌ది సార్లు ఆలోచిస్తున్నారు. ఫ‌స్ట్ మీ ద‌గ్గ‌రున్న అన్ని ర‌కాల  విమానాలు, వాటి ఫిట్నెస్ ని ఒక‌సారి  థార్డ్ పార్టీ చెకింగ్ చేసి మీ అధికారిక వెబ్ సైట్ల‌లో వాటిని పోస్ట్ చేస్తే త‌ప్ప‌.. ప్ర‌యాణికుల్లో న‌మ్మ‌కం రాద‌న్న మాట వినిపిస్తోంది విమాన‌యాన రంగ నిపుణుల నుంచి. 

తాజా వార్త ఏంటంటే మంగ‌ళ‌వారం ఉద‌యం శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్న ఫ్ల‌యిట్ నెంబ‌ర్ ఏఐ- 180 విమానం ఇంజిన్లో సాంకేతిక లోపం క‌నిపించ‌డంతో ప్ర‌యాణికుల‌ను కోల్ క‌త‌లో దింపేసింది. దీన్నిబ‌ట్టీ ఎయిర్ ఇండియాకేదో దుర‌దృష్టం వెంటాడుతోంది. ఇది ప్ర‌యాణికుల‌కు చుక్క‌లు చూపిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

By
en-us Political News

  
ఏపీ మద్యం కుంభ కోణం కేసులో అరెస్ట్‌యిన వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రత్యేక వసతులు కల్పించడానికి విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది.
హైదరాబాద్ వనస్థలిపురంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బోనాల పండుగకు తెచ్చుకున్న చికెన్, మటన్ బొటిని ఫ్రిజ్‌లో పెట్టుకుని తిని ఓకే కుటుంబానికి చెందిన 8 మంది అస్వస్థతకు గురుయ్యారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన రిటైర్డ్‌ ఐఏఎస్‌ ధనుంజయ్‌ రెడ్డి ఏసీబీ కోర్టు ఎదుట తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జైల్లో ఉన్న తన గురించి, బయట ఉన్న తన ఫ్యామిలీ గురించి తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ జడ్జి ముందు ఇవాళ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ వ్యాప్తంగా సంచలన సృష్టించిన వైసీపీ నేత అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు తదుపరి విచారణకు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు అనుమతి ఇచ్చింది.
వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డిని ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పేర్లు మార్పుపై ఏడుగురు మంత్రులతో ప్రభుత్వం కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేసింది.
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ప్రముఖ సినీనటి మంచు లక్ష్మి సందడి చేశారు. పట్టణంలోని రాజగోపాలపురంలో టీచ్‌ ఫర్‌ చేంజ్‌ఫౌండేషన్‌ ద్వారా ఏర్పాటు చేసిన డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ను మంచు లక్ష్మి ప్రారంభించారు.
తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన జరిగింది.
జ‌గ‌న్ స్టైలే వేర‌బ్బా. చాలా మంది చంద్ర‌బాబే సంప‌ద సృష్టిలో టాప్ అంటారుగానీ అదంతా ఉట్టిది. ఇది కేవ‌లం రాష్ట్రానికి సంబంధించిన వ్య‌వ‌హారం. అదే సొంతంగా సంపాదించ‌డంలో జ‌గ‌న్ త‌ర్వాతే ఎవ‌రైనా.
భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావానికి కొంచెం అటూ ఇటుగా, జన్మించిన కురువృద్ద కమ్యూనిస్ట్ నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ మృతితో భారత కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది.
ర్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా రెండవరోజు ఎలాంటి చర్చ లేకుండా వాయిదా పడ్డాయి.
తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా వైకుంఘం క్యూ కాంప్లెక్స-3 నిర్మాణానికి సాధ్యాసాధ్యాల పరిశీలనకు నిపుణుల కమిటీని వేయాలని తరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం నిర్ణయించింది.
మ‌ద్య‌పాన నిషేధం అమలు చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో ఏకంగా మద్యం కుంభకోణం చేసి 3500 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని సిట్ అంటోంది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ వేసిన 305 పేజీల‌ ఛార్జ్ షీట్ లో ఈ స్కామ్ లో కీల‌క పాత్ర పోషించినది ఏ 1 రాజ్ కేసిరెడ్డి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.