ఎయిరిండియా క‌ష్ట‌న‌ష్టాల ప‌రంప‌ర ఇంకా ఆగ‌లేదా?

Publish Date:Jun 17, 2025

Advertisement

యువ‌ర్ అటెన్ష‌న్ ప్లీజ్. హాంకాంగ్ టూ ఢిల్లీ ఫ్లైట్ నెంబ‌ర్ ఏ1- 315 బోయింగ్ 787-8 డ్రీమ్ లైన‌ర్ చిన్న సాంకేతిక స‌మ‌స్య త‌లెత్త‌డంతో తిరిగి హాంకాంగ్ లో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేయ‌బోతున్నామ‌ని ప్ర‌కటించ‌డంతో ఒక్క‌సారిగా ప్ర‌యాణికుల గుండెలు అర‌చేతిలోకి వ‌చ్చేశాయి. ఎవ‌రి ఇష్ట దైవాన్ని వారు త‌లుచుకోవడం మొద‌లు పెట్టారు.తిరిగి హాంకాంగ్ లో ఈ ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక బ‌తుకు జీవుడా! అంటూ ఎటు వాళ్లు అటు పారిపోయారు. ఇంతా చేస్తే ఎయిరిండియా అధికార ప్ర‌తినిథి చెప్పిందేంటంటే.. వారి ప్ర‌యాణాన్ని రీషెడ్యూల్ చేస్తాం. లేదంటే టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో దాదాపు అంద‌రు ప్ర‌యాణికుల నుంచి వ‌చ్చిన మెసేజ్ రీఫండ్ చేయ‌మ‌ని.  యూపీలోని ఘ‌జియాబాద్ నుంచి కోల్ క‌తా వెళ్లే ఫ్ల‌యిట్ సిట్యువేష‌న్ ఇంకో ర‌కం. గంట సేపు సాంకేతిక లోపం కార‌ణంగా ఆగిపోయిందీ ఫ్లైట్ నెంబ‌ర్ ఐఎక్స్- 1511, ఆ గంట సేపు ప్రయాణికులు ఊపిరి బిగ‌బ‌ట్టి అలాగే కాలం గ‌డిపారంటే వారి ప‌రిస్థితేమిటో ఊహించుకోవ‌చ్చు.

మ‌రో భ‌యంక‌ర‌మైన ప్ర‌యాణ అనుభ‌వం విష‌యానికి వ‌స్తే.. ఆరోజు స‌రిగ్గా జూన్ 12వ తేదీ. ఆ టైంలో అహ్మ‌దాబాద్ లో ఘోర విమాన ప్ర‌మాదం జ‌రిగింది. దుబాయ్ నుంచి జైపూర్ రావ‌ల్సిన ఐఎక్స్- 196 దుబాయ్ లో రాత్రి 7. 44కి బ‌య‌లు దేరాల్సింది మ‌రునాటి వేకువ జాము 12. 44కి బ‌య‌లు దేరింది. అంటే ఏకంగా ఐదు గంట‌లు.  ఈ ఐదుగంట‌లూ ఆ ఫ్లైట్ లో న‌ర‌కం చూశారు ప్ర‌యాణికులు. ఏసీ లేదు. నీళ్లు, ఆహారం అందివ్వ‌లేదు. పిల్ల‌లుంటే వారు ఆ ఉక్క‌పోత‌లో ఆక‌లిద‌ప్పుల‌తో అల‌మ‌టించినా ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. ప‌క్క రోజు వేకువ జాము 2. 44కి ఈ ఫ్లైట్ జైపూర్ లో ల్యాండ‌య్యింది. ఆ స‌మ‌యంలో  ఈ ఎయిరిండియా ప్ర‌యాణికుల ఫీలింగ్ ఏంటో తెలుసా? హ‌మ్మ‌య్యా మ‌నం  కూడా కాలి బూడిద‌వకుండానే నేల‌పై అడుగు పెట్టాం. గంటో అర‌గంట‌లో ప్రాణాల‌తో ఇంటికెళ్తాం. బాప్ రే బ‌చ్ గ‌యా.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు. 

కాళ‌రాత్రులంటారే స‌రిగ్గా అలాంటి ప్ర‌యాణ అనుభ‌వాన్నిస్తోంది ఎయిర్ ఇండియా. దాని టైం బ్యాడో.. లేక దాన్నెక్కే ప్ర‌యాణికుల టైం స‌రిగా లేదో తెలీదు గానీ.. ఎయిర్ ఇండియా అంటేనే హ‌డ‌లి చ‌స్తున్నారొక్క‌క్క‌రూ. ఇండిగో త‌ర్వాత సెకండ్ బెస్ట్ ఎయిర్ లైన‌ర్ ఎయిర్ ఇండియా.  మొత్తం 102 దేశ విదేశీ తీరాల‌కు ప్ర‌యాణికుల‌ను చేర్చే ఎయిర్ ఇండియా చ‌రిత్ర ఈ నాటిది కాదు. ఇది 1932 నాటిది. దీని ఆప‌రేష‌న‌ల్ హెడ్డాఫీస్ ఢిల్లీ. బెంగ‌ళూరు, ముంబై వంటి ప్రాంతాల్లోనూ నెట్ వ‌ర్క్ విస్త‌రించి ఉంది. ఇక హ‌ర్యానాలోని గుర్గాంలో మెయిన్ ఆఫీసుంది. ప్ర‌స్తుతం ఎయిరిండియాలో డెబ్భై ఐదు శాతం వాటా టాటాల‌ది కాగా మిగిలిన ఇర‌వై ఐదు శాతం సింగ‌పూర్ ఎయిర్ లైన్స్ ది. 

ఎయిరిండియా మ‌ధ్య‌లో చేతులు మారినా ఇటీవ‌లే తిరిగి  టాటాల ప‌ర‌మైంది. ఆనాటి నుంచి 14 శాతం మేర లాభాల‌ను అర్జించింది. ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్- 24 కంటే, 25లో మెరుగైన‌ ట‌ర్నోవ‌ర్ర సాధించింది. ప్ర‌స్తుతం కూడా 11 శాతం  పెరుగుద‌ల‌తో 7 బిలియ‌న్ డాల‌ర్ల మేర ట‌ర్నోవ‌ర్ సాధిస్తోంది. అంతా బాగుంద‌నుకునే లోపు ఇదిగో ఈ వ‌రుస న‌ష్టాలు. అహ్మాదాబాద్ లో ఏమని అనుమానాస్ప‌ద ఘోర విమాన ప్ర‌మాదం జ‌రిగిందో అప్ప‌టి నుంచీ ఈ ఎయిర్ లైన‌ర్ టైం పూర్తిగా తిర‌బ‌డిన‌ట్టుంది. ప్ర‌యాణికుల‌కు మెరుగైన ప్ర‌యాణ  సౌక‌ర్యం అందిస్తామంటోన్న  ఎయిర్ ఇండియా.. వారి పాలిటి య‌మ‌పాశ‌మై.. దారుణంగా దెబ్బ తీస్తోంది.

ఇప్పుడెంత‌టి న‌ష్ట‌మంటే కేవ‌లం అహ్మ‌దాబాద్ డ్రీమ్ లైన‌ర్ కుప్ప‌కూల‌డంతో దాని విలువ 120 మిలియ‌న్ డాల‌ర్లు. అంటే దాదాపు వెయ్యి కోట్లు. అత్య‌వ‌స‌ర నిధి కింద పాతిక‌ల‌క్ష‌ల మేర ఈ ప్ర‌యాణ బాధితుల‌కు ఆర్ధిక సాయం ప్ర‌క‌టించింది ఎయిరిండియా. ఆల్రెడీ కోటి రూపాయ‌లు ఒక్కొక్క‌రికీ న‌ష్ట‌ప‌రిహారం ఇస్తామ‌ని చెప్పింది. ఈ మొత్తం విలువ సుమారు 300 కోట్లు. ఇక ప్ర‌మాదం జ‌రిగిన రోజు బోయింగ్ తో స‌హా ఇండిగో త‌దిత‌ర విమాన యాన షేర్ల‌న్నీ కుప్ప‌కూల‌డంతో ఈ మొత్తం న‌ష్టం విలువ సుమారు 6 ల‌క్ష‌ల కోట్లు. దీంతో ఇటు తామే కాకుండా అటు బోయింగ్ సంస్థ ఆర్డ‌ర్ల‌ను కూడా ఎయిరిండియా ప్ర‌భావితం చేస్తోన్న మాట వినిపిస్తోంది. 

మ‌రి ఈ న‌ష్టాల నుంచి ఎయిరిండియాను గ‌ట్టెక్కించేవారేరీ. ఈ విష‌యాలు తెలిసిన ప్ర‌యాణికులు ఎయిర్ ఇండియా అంటేనే హ‌డ‌లి పోతున్నారు. కార‌ణం టేకాఫ్ అయిన 45 సెక‌న్ల‌కే కుప్ప‌కూలిపోయే విమానాలున్న ఈ సంస్థ మెయిన్ టైన్స్ స‌రిగా లేద‌న్న పేరు రావ‌డంతో వారంతా ఈ ఫ్ల‌యిట్ బుకింగ్స్ కి ఒక‌టికి ప‌ది సార్లు ఆలోచిస్తున్నారు. ఫ‌స్ట్ మీ ద‌గ్గ‌రున్న అన్ని ర‌కాల  విమానాలు, వాటి ఫిట్నెస్ ని ఒక‌సారి  థార్డ్ పార్టీ చెకింగ్ చేసి మీ అధికారిక వెబ్ సైట్ల‌లో వాటిని పోస్ట్ చేస్తే త‌ప్ప‌.. ప్ర‌యాణికుల్లో న‌మ్మ‌కం రాద‌న్న మాట వినిపిస్తోంది విమాన‌యాన రంగ నిపుణుల నుంచి. 

తాజా వార్త ఏంటంటే మంగ‌ళ‌వారం ఉద‌యం శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్న ఫ్ల‌యిట్ నెంబ‌ర్ ఏఐ- 180 విమానం ఇంజిన్లో సాంకేతిక లోపం క‌నిపించ‌డంతో ప్ర‌యాణికుల‌ను కోల్ క‌త‌లో దింపేసింది. దీన్నిబ‌ట్టీ ఎయిర్ ఇండియాకేదో దుర‌దృష్టం వెంటాడుతోంది. ఇది ప్ర‌యాణికుల‌కు చుక్క‌లు చూపిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

By
en-us Political News

  
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.