కష్టాల్లో ఎయిర్ ఇండియా.. మూకుమ్మడి రాజీనామాకు సిద్దమైన పైలెట్లు

Publish Date:Oct 16, 2019

Advertisement

 

ఎయిరిండియా పీకల్లోతు సంక్షోభంలో మునిగింది. ఓ పక్క ఇంధన కస్టాలు వెంటాడుతుంటే మరోపక్క పైలెట్లు  సహాయ నిరాకరణ మొదలుపెట్టారు. మూకుమ్మడి రాజీనామాలకు దిగారు, మొన్నటి జట్టు సంక్షోభం మరిచిపోకముందే ఎయిరిండియా క్రైసిస్ దేశీయ విమానయాన రంగంలో సంక్షోభానికి కారణం అవుతోంది.కష్టాల్లో ఎయిరిండియా ఉంది. మూకుమ్మడి రాజీనామాకు రెడీ అయిన పైలెట్లు, ఆర్ధిక సంక్షోభంలో ఎయిరిండియా.ఎయిర్ ఇండియా భారంగా ఎగురుతోంది. ఇప్పటికే ఓ పక్క ఇంధన కష్టాలు వెంటాడుతున్నాయి. మరోపక్క పైలెట్లు మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమయ్యారు.వేతనాల పెంపు ప్రమోషన్లపై ప్రభుత్వ వైఖరే ఇందుకు కారణమంటున్నారు. 

ఇప్పటికే జెట్ ఎయిర్ వేస్ మూతతో కష్టాల్లో ఉన్న విమానయాన రంగానికి ఇప్పుడు ఎయిరిండియా సంక్షోభం తలనొప్పిగా మారింది .తమ డిమాండ్ల సాధన కోసం ఎయిర్ బస్ ఎ త్రీ ట్వంటీ పైలెట్లు నూట ఇరవై మంది ఇప్పటికే రాజీనామా చేశారు. అయితే పైలెట్ల మూకుమ్మడి రాజీనామా వల్ల విమాన సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగదంటోంది ప్రభుత్వం. పైలెట్లు సరిపడా ఉన్నారంటోంది. మొన్నటికి మొన్న జెట్ ఎయిర్ వేస్ మూతపడగా తాజాగా ఎయిరిండియాను నష్టాలతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది .అయితే అరవై వేల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎయిరిండియా విక్రయాన్ని కచ్చితంగా పూర్తి చేయాలని భావిస్తోంది కేంద్రం.ఇందులో భాగంగా ఇన్వెస్టర్లకు అభ్యంతరకరంగా ఉన్న నిబంధనలను సవరించడం పై కసరత్తు చేస్తోంది. దీని ప్రకారం ఎయిర్ ఇండియా నుంచి కేంద్రం పూర్తిగా నిష్క్రమించే అవకాశముండగా దాదాపు తొంభై ఐదు శాతాన్ని విక్రయించాలని కేంద్రం భావిస్తోంది. కొనుగోలుదారులపై భారీ రుణభారం పడకుండా చూడటం ప్రైవేటీకరణ ప్రక్రియ నిబంధనల సడలింపు గట్టి చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. 

ఎయిరిండియా ప్రైవేటీకరణ తర్వాత కూడా ప్రభుత్వం ఇరవై నాలుగు శాతం వాటాలను తనదగ్గరే ఉంచుకుంటుందన్న నిబంధన కారణంగా ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదు. వాటాలు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు కంపెనీ నిర్వహణకు అవసరమైన నిధులను సమీకరించుకునేందుకు లాకిన్ వ్యవధిలేకుండా కొన్ని వాటాలను తక్షణం విక్రయించుకునే వెసులుబాటు కూడా కల్పించనుంది.అసలే నష్టాలతో కుదేలైన ఎయిరిండియాను నడిపించడానికి అవసరమైన నిధులను సమీకరించడానికి ఈ నిబంధన సమస్యగా మారుతుందని పరిశ్రమ వర్గాలు భావించాయి. ఎయిరిండియాకు రుణాలివ్వడానికి బ్యాంకులు ముందుకు రావు కాబట్టి కొత్త యజమాని తాను కోరుకున్న వాటాలను విక్రయించుకుంటే గానీ నిధులు సమకూర్చుకోవడం కుదరదు.అందుకోసం లాకింగ్ నిబంధనను పక్కన పెట్టి ఆలోచనలో ఉన్నారు. నిజానికి ఎయిరిండియాను విక్రయించేందుకు గతంలో రెండు సార్లు ప్రయత్నాలూ జరిగాయి ,రెండు వేల ఒకటిలో ఒకసారి మళ్లీ రెండు వేల పధ్ధెనిమిదిలో మరోసారి కేంద్రం ప్రయత్నించింది. కానీ ఈ రెండూ విఫలం కావడంతో ముచ్చటగా మూడో సారి ప్రయత్నిస్తూ ఆర్ధిక సంక్షోభంలో ఉన్న ఎయిరిండియాను గట్టెక్కించేందుకు కేంద్రం రెండు వేల పదహారు, పదిహెడు ఆర్థిక సంవత్సరంలో రెండు వేల నాలుగు వందల అరవై ఐదు కోట్లు, రెండు వేల పదిహెడు ,పధ్ధెనిమిదిలో పధ్ధెనిమిది  వందల కోట్లు, రెండు వేల పధ్ధెనిమిది, పంతొమ్మిదిలో మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్ల మేర నిధులు సమకూర్చింది.

By
en-us Political News

  
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ కార్తీక దీపం పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.