Publish Date:Nov 24, 2024
వరంగల్ స్మశాన వాటిక నుంచి గుజరాత్ వెళ్లిపోతానని ప్రకటించిన వివాదాస్పద అఘోరీ మళ్లీ ఎపిలో ఆదివారం ప్రత్యక్షమైంది. తాజాగా నవంబర్ 24 కర్నూలు జిల్లాలో పెట్టుడు మీసం, గడ్డంతో కనిపించి అందరినీ ఆశ్యర్యపరిచింది. వరంగల్ స్మశాన వాటికలో చితా భస్మం పూసుకుని గుమ్మడికాయ పగలగొట్టి క్షుద్ర పూజలు చేసింది. అఘోరీ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో భయానక పరిస్థితిని క్రియేట్ చేసింది. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో నాగసాధుగా పరిచయమైన ట్రాన్స్ జెండర్ శ్రీనివాస్ అలియాస్ పింకి తనకు తాను అఘోరీగా ప్రకటించుకుంది. తాను కేదార్ నాథ్ వెళ్లి గురువు ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పి తిరిగి తెలంగాణలో ఎంటరైంది, తన కారులో పెట్రోల్ క్యాన్ కనిపించడంతో అఘోరీ ఆత్మార్పణం చేసుకుంటుందేమోనన్న భయంతో సిద్దిపేట పోలీసులు అదుపులోకి తీసుకుని అఘోరీ స్వస్థలమైన మంచిర్యాలలో వదిలేశారు. అఘోరీకి కౌన్సిలింగ్ ఇచ్చి తెలంగాణ పోలీసులు మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన వాంకిడిలో వదిలేశారు. అక్కడ్నుంచి ఎపిలో ఎంటరైన అఘోరీ శ్రీకాళహస్తిలో పెట్రోలు పోసుకుని ఆత్మార్పణం చేసుకునే ప్రయత్నం చేసింది. శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న అఘోరీ అక్కడ్నుంచి విజయవాడ కనకదుర్గను దర్శించుకుంది. ఇక్కడితో రెండు తెలుగు రాష్ట్రాల పర్యటన పూర్తయ్యిందని అందరూ ఊహించారు. అనూహ్యంగా మంగళగిరి రోడ్డులో కనిపించి నానా రచ్చచేసింది. ఎపి పోలీసుల మీద భౌతికదాడి చేసి అరెస్టు అయ్యింది. వ్యక్తిగత బెయిల్ మీద ఎపి పోలీసులు వదిలేయడంతో అఘోరీ మళ్లీ తెలంగాణలో ఎంటరైంది. ఈ సారి వరంగల్ స్మశాన వాటికలో తాంత్రిక పూజలు చేయడంతో అందరి దృష్టినాకర్షించింది. కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో నిమ్మకాయలతో పూజలు చేయడంతో స్థానికులు అఘోరీని తరిమివేశారు. ఇన్ని రోజులు తాను అమ్మవారి అవతారం అని చెప్పి సడెన్ గా గడ్డం, మీసంతో కనిపించడంతో స్థానికుల అగ్రహానికి గురైంది. ఇప్పుడు మళ్లీ ఎక్కడ ప్రత్యక్షమౌతుందోనని తెలుగు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. రెండు రాష్ట్రాల పోలీసులు అఘెరీని ఇంత వరకు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపకపోవడం చర్చనీయాంశమైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/aghori-spotted-in-kurnool-with-beard-and-moustache-car-reverses-gear-as-locals-object-25-188886.html
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు.
ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం లాంటి అంశాలపై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.