అఘోరీలు సాధారణంగా జనబాహుళ్యంలో ఉండరు.సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయంలో జరిగిన ఘటన నేపథ్యంలో నగరవాసులకు అఘోరీ పరిచయమయ్యారు. తాను ఏడేళ్ల ప్రాయం నుంచే కాశీలోనే ఉంటున్నానని చెప్పుకున్న మంచిర్యాలకు చెందిన వివాదాస్పద అఘోరీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారారు. తెలం గాణ పోలీసులు తరిమి వేయడంతో అఘోరీ కొత్త మార్గాన్ని వెతుకున్నారు. ట్రాన్స్ జెండర్ నుంచి అఘోరీగా మారిన శ్రీనివాస్ అలియాస్ పింకి ఇప్పుడు ఎపిలో ఎంటర్ అయ్యారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో అమ్మవారిని ధ్వంసం చేసినందున జనారణ్యంలో అడుగు పెట్టానని చెప్పుకున్న అఘోరీ కొద్ది రోజుల్లోనే సనాతన ధర్మం స్టాండ్ ను తీసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సనాతన ధర్మం పరిరక్షించడం లేదని అఘోరీ ఆరోపిస్తుంది.ముఖ్యమంత్రి పదవి ఊడగొడతానని ఢాంబికాలు చెప్పుకున్న అఘోరీ ఎపిలో ప్రవేశించడం చర్చనీయాంశమైంది. తెలంగాణలో అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే బోనాల పండుగ సందర్బంగా రంగం కార్యక్రమం ఉంటుంది. రంగం చెప్పే వారిని అత్యత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. రంగంలో రాజకీయాలు, ఆర్థికపర విషయాలను జోస్యం చెబుతారు. కానీ అఘోరీ విషయంలో తెలంగాణ ప్రజలు పెద్దగా ఓన్ చేసుకోలేదని తెలుస్తోంది. ముత్యాలమ్మ గుడి వివాదం పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ అఘోరీని తెలంగాణ ప్రజలు పట్టించుకోలేదు. హిందువులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినప్పటికీ హిందుత్వ వాదులు ఆమెను పట్టించుకోలేదు. ఏ రాజకీయ పార్టీ కూడా పెద్దగా స్పందించలేదు. దీంతో అఘోరీ గత నెలలో కేదార్ నాథ్ బయలు దేరి వెళ్లారు. నవంబర్ ఒకటో తేదీన సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద ఆత్మార్పణం చేసుకుంటానని చెప్పిన అఘోరీ తెలంగాణ పోలీసులను ముచ్చెమటలు పట్టించారు. తన కారులో పెట్రోల్ క్యాన్ లతో అఘోరీ కనిపించడంతో అరెస్ట్ చేసి మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన వాంకిడిలో వదిలేసారు. అఘోరీ నాగ్ పూర్ హైవే మీదుగా కేదార్ నాథ్ వెళతారని పలువురు ఊహించారు. కానీ ఆమె అనూహ్యంగా ఎపి బాట పట్టారు. ఎపిలోని అనేక శై వ క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. అఘోరీ రోజు రోజుకు తన అటైర్ మార్చేసుకుంటున్నారు. తెలంగాణలో నగ్నంగా విభూతితో కనిపించిన అఘోరీ ఎపిలో మాత్రం అర్ధనగ్నంగా కనిపిస్తున్నారు. చేతిలో త్రిశూలం, కమండలంతో కనిపిస్తున్నారు. అఘెరీని చూడటానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది.సనాతన ధర్మం కాపాడుకుందాం అని నినదిస్తున్నారు. గోమాతను రక్షించుకుందాం అని ఆమె పదే పదే అంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో సనాతన ధర్మ ప్రచారం చేయాలని అఘోరీ ఆలోచిస్తున్నట్టు కనబడుతోంది. సనాతన ధర్మ పరిరక్షణకు ఉద్యమిస్తున్న డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ కు కలవడానికి ఆమె ఎపికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అఘోరీకి ట్రాన్స్ జెండర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. అనేక ప్రజా సంఘాలు అఘోరీ ని వ్యతిరేకించాయి. కొన్ని యూట్యూబ్ చానెల్స్ అఘోరీకి హైప్ తీసుకొచ్చాయి. వ్యూస్ కోసమే అఘోరీ వెంట పడ్డారన్న అపవాదు సోషల్ మీడియా మూఠ గట్టుకుంది. తెలంగాణ నుంచి తరిమివేయబడ్డ అఘోరీ మహరాష్ట్ర నుంచి సరాసరి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రవేశించారు. సనాతన ధర్మ పరిరక్షణకు కమిటీ వేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. తిరుమలలో కల్తీ లడ్డు వెలుగులోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షచేపట్టిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా తరచూ మాట్లాడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఈ అఘోరీని ఎంటర్ టైన్ చేయకపోవచ్చని పరిశీలకులు అంటున్నారు. అఘోరీ వెనక కొందరు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వ్యాపార ప్రయోజనాల కోసమే తెరమీదరకు వచ్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అఘోరీ మెయిన్ టైన్ చేసే విలువైన ఐ ఫోన్లు, ఐ 20 కారు అంతా వారే చూసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/aghori-in-ap-to-meet-pawan-kalyan-39-188008.html
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.