ప్రమాదం జరిగిన ప్రతి సారీ రైల్వే చెప్పే మాట ఇదే!

Publish Date:Jun 6, 2023

Advertisement

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం రైల్వేల చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదాలలో ఒకటి అన్నది నిస్సందేహం. అయితే ఈ ప్రమాదం వెనుక కుట్ర ఉందంటూ సాక్షాత్తూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పడం సంచలనం సృష్టిస్తోంది. ప్రమాద కోణంపై దర్యాప్తునకు సీబీఐ విచారణకు ఆదేశించడమూ తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

 రైల్వే శాఖ, కేంద్ర ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు కుట్ర కోణాన్ని తెరపైకి తీసుకు వచ్చారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఏదైనా ప్రమాదం జరిగిన ప్రతి సారీ రైల్వే శాఖ  కుట్ర కోణం ఉందని చెప్పడం పరిపాటిగా మారిపోయిందని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఆ కుట్ర కోణానికి మతపరమైన మసాలా జోడించి దేశంలో విద్వేషాలు రగిలేలా సామాజిక మాధ్యమంలో పోస్టుల వెనుకే నిజమైన కుట్ర ఉందని ఆయన సామాజిక మాధ్యమం వేదికగా చేసిన ప్రకటన ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

రెండు రైల్వే పోలీసు డిస్ట్రిక్ట్స్ కు ఎస్పీగా, ఒడిశా రైల్వే పోలీసు అదనపు డీజీపీగా పని చేసిన అనుభవం ఉన్న నాగేశ్వరరావు మరో ట్వీట్ లో ఎప్పుడు రైలు ప్రమాదం జరిగినా.. ఆ ప్రమాదం వెనుక ఉన్నరైల్వే వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరలచ్చడానికి, తమ అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి రైల్వే అధికారులు వ్యూహాత్మకంగా ‘కుట్ర’ జరిగిందంటూ ప్రకటనలు గుప్పించడం పరిపాటేనని పేర్కొన్నారు.  తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇంత కాలంగా విజయవంతంగా రైల్వే శాఖ ఉన్నతాధికారులు అనుసరిస్తున్న ఎత్తుగడగా ఆయన అభివర్ణించారు.  ప్రస్తతం కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంపై సామాజిక మాధ్యమంలో  విద్వేషం పెచ్చరిల్లేలా వస్తున్న వార్తల నేపథ్యంలో సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  

ఆయన వ్యాఖ్యలు రైల్వే శాఖనే కాకుండా నేరుగా  కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తున్నట్లుగా ఉండటంతో ఇప్పుడు కేంద్రం ఎలా స్పందిస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తును తప్పుపడుతూ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ప్రమాదానికి కారకులపై తక్షణ చర్యలు తీసుకోవాలని, అంతే కానీ దర్యాప్తుల పేరుతో కాలయాపన జరపడం తగదని ఖర్గే ఆ లేఖలో పేర్కొన్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం వెనుక కుట్ర కోణాన్ని దర్యాప్తు చేయాలంటూ సీబీఐకి కేసును అప్పగించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమౌతోంది. అలాగే మల్లికార్జున్ ఖర్గు ప్రధానికి రాసిన బహిరంగ లేఖలో భద్రతా ప్రమాణాలను గాలికొదిలేసి.. దర్యాప్తునకు ఆదేశించి చేతులు దులుపుకోవడం వల్ల ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. సిబ్బంది కొరత, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో వైఫల్యం వంటి వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు.  

By
en-us Political News

  
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదోవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సన్మానించారు. ఉండవల్లిలో ఆయన విద్యార్థులతో ముఖముఖి నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌లో జూన్‌ ఒకటో తేదీ నుంచి చౌకధర దకాణాల ద్వారానే రేషన్‌ సరఫరా చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు దివ్యాంగులకు మాత్రం డోర్‌ డెలివరీ చేస్తాని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు.
రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయ పునరుద్ధరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థాన మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమ‌ల కొండ‌ల్లో ఉన్న ప‌చ్చ‌ద‌నాన్ని అట‌వీశాఖ ద్వారా 68.14 శాతం నుండి 80 శాతానికి పెంచేందుకు నిర్ణ‌యించారు. ప‌చ్చ‌ద‌నాన్ని పెంచేందుకు రూ.4 కోట్ల కేటాయించింది. స్విమ్స్ ఆసుపత్రిలో 597 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు రేపు చిత్తూరు జిల్లా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా బుధవారం మధ్యాహ్నం అమ్మవారిని కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి దర్శించుకుంటారు.
జగన్ అడ్డా కడపలో తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు అంటే మే 19 వరకూ జరిగే పసుపు పండుగ మహానాడు నిర్వహణ కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు 19 కమిటీలను ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత ఆపరేషన్ సిందూర్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు మళ్లీ ఆందోళన రేపుతున్నాయి. మే 19 నాటికి దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కొవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపధ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు, వ్యాధి వ్యాప్తి తీరుతెన్నులపై నిశితంగా దృష్టి సారించారు.
బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో వంశీని రెండు రోజుల కస్టడీకి ఇవ్వాలని హనుమాన్ జంక్షన్ పోలీసులు కోర్టుకు కోరారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ కుమారుడు ఆదిత్య అమెరికాలోని ఓక్ ఫారెస్ట్ యూనివ‌ర్సిటీ నుంచి గ్రాడ్యుయేష‌న్ ప‌ట్టాను అందుకున్నారు. యూనివర్శిటీలో జ‌రిగిన గ్రాడ్యుయేష‌న్ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్సీ క‌విత‌, అనీల్ కుమార్ దంప‌తులు హాజ‌ర‌య్యారు.
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల పెంచిన ప్రయాణ ఛార్జీలను సవరించింది. ఇటీవల పెంచిన మెట్రో ఛార్జీలను సవరిస్తూ, వాటిని 10 శాతం మేర తగ్గిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం పేర్కొన్నాది.
నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో బుధ, గురువారాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.