అమ‌రావ‌తి రైతుల ఉద్య‌మానికి కొండంత అండ అడ్వ‌కేట్‌ ముర‌ళీధ‌ర్‌రావు

Publish Date:Aug 2, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది? అన్నది 2019 సంవ‌త్స‌రం నుంచి నిన్న‌మొన్నటి వ‌ర‌కు స్పష్టమైన సమాధానం లేని ప్రశ్న ఇది. కానీ ఇప్పుడు ఆ ప్ర‌శ్న‌కు సమాధానం దొరికింది. అమ‌రావ‌తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా ప్ర‌స్తుతం ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. ఇటీవ‌ల‌ బ‌డ్జెట్ లో అమ‌రావ‌తి రాజ‌ధానికి రూ. 15000 కోట్ల నిధుల‌ను  కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దీంతో అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, వీరి సంతోషం వెన‌క ఐదేళ్ల‌లో ఎన్నో పోరాటాలు ఉన్నాయి. క‌న్నీటి గాధ‌లు ఉన్నాయి. కంటి నిండా స‌రిగా నిద్ర‌పోయిన రోజులు త‌క్క‌ువ‌నే చెప్పొచ్చు. ఇందుకు కార‌ణం మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. 2019లో వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి కాద‌ని.. మూడు రాజ‌ధానుల‌ను తెర‌పైకి తీసుకొచ్చాడు. అప్ప‌టి నుంచి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని దాదాపు నాలుగున్నరేళ్లుగా అమరావతి పరిరక్షణ సమితి పేరుతో ఆ ప్రాంత రైతులు ఉద్యమించారు. ఈ క్ర‌మంలో రైతులు పోలీసుల లాఠీ దెబ్బ‌లు తిన్నారు.. వైసీపీ మూకల రాళ్ల దెబ్బ‌లు తిన్నారు. అయినా వెన‌క్కు త‌గ్గ‌లేదు. మ‌రోవైపు అమ‌రావ‌తి రాజ‌ధానిని కాపాడుకునేందుకు రైతులు కోర్టుల‌ను   ఆశ్ర‌యించారు. రైతుల త‌రుపున కోర్టుల్లో వాద‌న‌లు వినిపించి వారికి అండ‌గా నిలిచారు హైకోర్ట్ సీనియ‌ర్ అడ్వ‌కేట్ ఉన్నం ముర‌ళీధ‌ర్ రావు. కోర్టుల్లో వైసీపీ ప్ర‌భుత్వ మూడు రాజధానుల నిర్ణ‌యంపై ఆయ‌న సాగించిన పోరాటం అమ‌రావ‌తి ఉద్య‌మ ఘ‌ట్టంలో చిర‌స్థాయిగా నిలిచిపోతుంద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.

 తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరున్న న్యాయ‌వాది ఉన్నం ముర‌ళీధ‌ర్ రావు. హైకోర్టులో కేసులు వాదించ‌డంకోసం రోజుకు ల‌క్ష‌ల్లో ఫీజు వ‌సూళ్లు చేయ‌గ‌ల సామ‌ర్థ్యం క‌లిగిన లాయ‌ర్ ఆయ‌న‌. అయితే, అమ‌రావ‌తి రైతులు చేస్తున్న న్యాయ‌మైన పోరాటంలో ముర‌ళీధ‌ర్ రావు వారికి అండ‌గా నిల‌బ‌డ్డారు. అమ‌రావ‌తే ఏపీకి ఏకైక రాజ‌ధాని అంటూ రైతుల త‌ర‌పున‌ హైకోర్టులో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వాదించారు. హైకోర్టులో రైతుల త‌ర‌పున వాద‌న‌లు వినిపించినందుకు ఆయ‌న ఒక్క‌రూపాయి కూడా తీసుకోలేదు. కోర్టుల్లో ప్ర‌భుత్వం కుట్ర‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తిప్పికొడుతూ రైతులు త‌మ‌ పోరాటంలో విజ‌యం సాధించ‌డంలో త‌న‌వంతు పాత్ర‌ను ముర‌ళీధ‌ర్ రావు స‌మ‌ర్థ‌వంతంగా పోషించారు. స‌త్యం, న్యాయం, ధ‌ర్మం రైతుల వైపు ఉన్నాయి.. చివ‌రికి అవే గెలుస్తాయ‌ని ముర‌ళీధ‌ర్ రావు మొద‌టి నుంచి చెబుతూనే ఉన్నారు. ఐదేళ్ల వైసీపీ హ‌యాంలో విశాఖ ప‌ట్ట‌ణానికి రాజ‌ధాని త‌ర‌లిపోకుండా ఎప్ప‌టిక‌ప్పుడు కోర్టుల ద్వారా స్టేలు తీసుకొస్తూ ప్ర‌భుత్వం దూకుడుకు ముర‌ళీధ‌ర్‌రావు బ్రేక్ లు వేశారు.

అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణానికి భూములిచ్చిన‌ రైతుల‌కు అప్ప‌టి టీడీపీ ప్ర‌భుత్వం  ప్ర‌తీయేటా కౌలు చెల్లించేలా ఏర్పాట్లు చేసింది. వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో ఆ కౌలును కూడా చెల్లించ‌లేదు. దీంతో  రైతు పరిరక్షణ సమితి, రైతు సమాఖ్య తరపున దాఖ‌లైన పిటీష‌న్ల‌పై హైకోర్టులో విచార‌ణ జ‌రిగిన సంద‌ర్భంలో.. ఈ పిటీషన్‌లకు విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాదుల అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వ వాదనలపై రైతుల తరపు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీంతో రైతులకు కౌలు చెల్లించాలని వేసిన పిటీషన్‌లకు విచారణ అర్హత ఉందని కోర్టు స్ప‌ష్టం చేయ‌డంతో ప్ర‌భ‌త్వానికి ఎదురు దెబ్బ త‌గిలింది. ఇటీవ‌ల కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో.. సీఎం చంద్ర‌బాబు రైతులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ ఏటా ఇస్తున్న కౌలును అంతే మొత్తం వచ్చే ఐదేళ్ల పాటు కొనసాగించాలని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. ఎలాగూ వచ్చే ఐదేళ్ల పాటు రాజధాని నిర్మాణం కొనసాగడం ఖాయం కాబట్టి ఈ ఐదేళ్లలో వారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కౌలు గడువును మరో ఐదేళ్ల పాటు ప్ర‌భుత్వం పెంచ‌నుంది. 

అమ‌రావ‌తి రాజ‌ధానిని కాపాడుకునేందుకు రైతులు పాద‌యాత్ర ద్వారా పోలీసుల లాఠీల‌కు ఎదురెళ్లి  వైసీపీ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తే.. అడ్వ‌కేట్ ఉన్నం ముర‌ళీద‌ర్‌రావు ఎప్ప‌టిక‌ప్పుడు కోర్టుల ద్వారా ప్ర‌భుత్వం కుట్ర‌ల‌ను అడ్డుకుంటూ  రైతుల పోరాటానికి కొండంత అండ‌గా నిలిచారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం కుట్ర‌ల నుంచి అమ‌రావ‌తి రాజ‌ధానిని కాపాడుకోవ‌టంలో రైతుల పోరాటాన్ని ప్ర‌జ‌లు ఏ విధంగా గుర్తుచేసుకుంటున్నారో.. కోర్టుల ద్వారా ముర‌ళీధ‌ర్ రావు పోరాటంపైనా అదేస్థాయిలో ప్ర‌జ‌లు ప్ర‌శంస‌లు గుప్పిస్తున్నారు. ఇటీవ‌ల‌ అడ్వ‌కేట్ ఉన్నం ముర‌ళీధ‌ర‌రావుకు అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌గా.. వాషింగ్ట‌న్ డీసీలో ప్ర‌వాసులు ఘ‌నంగా స‌త్క‌రించారు. అమ‌రావ‌తి రైతుల పోరాటాన్ని, వారికి అండ‌గా నిలుస్తూ కోర్టుల్లో ముర‌ళీధ‌ర్ రావు సాగించిన పోరాటాన్ని ప్ర‌వాసులు కొనియాడారు. ఈ సంద‌ర్భంగా అమ‌రావ‌తి రైతులు ముర‌ళీధ‌ర్ రావుకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ.. ఉద్య‌మంలో అండ‌గా నిలిచినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

By
en-us Political News

  
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.