యర్రగొండపాలెం వైపు ఆదిమూలపు చూపు

Publish Date:May 15, 2025

Advertisement

సిట్టింగ్ స్థానంలో వైసీపీ పాలిట్రిక్స్

 ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గం మారి పోటీ చేసే వైసీపీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ తిరిగి సెగ్మెంట్ మారేందుకు కసరత్తు మొదలు పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో గెలుపొందిన యర్రగొండపాలెం నియోజకవర్గానికి తిరిగి వెళ్లేందుకు ఆయన తెర వెనుక రాజకీయాలు మొదలుపెట్టారంట. అందులో భాగంగా సొంత పార్టీ ఎమ్మెల్యేకు పొగ పెట్టే పనిలో పడ్డారంట. పార్టీ అధికారం కోల్పోయినా తన రాజకీయ భవిష్యత్ కోసం ఆ మాజీ మంత్రి పార్టీ ప్రయోజనాలను కూడా పణంగా పెట్టాలని చూస్తున్నారంట. 

ఆ క్రమంలో ప్రకాశం జిల్లా వైసీపీలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిందిప్పుడు. ఆయన తన రాజకీయ భవిష్యత్ కోసం సొంత నియోజకవర్గం యర్రగొండపాలెం తిరిగి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఫ్యాన్ పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి. ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైసీపీలో ఉన్న తన అనుచరుల్ని టీడీపీలో చేర్చడమే లక్ష్యంగా ఆదిమూలపు సురేష్ పావులు కదుపుతున్నారన్న ప్రచారం జిల్లా  రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.  2024 ఎన్నికల సమయంలో తనకు కాకుండా పోయిన ఎర్రగొండపాలెంలో తాత్కాలికంగా ఫ్యాన్ పార్టీని వీక్ చేసి తిరిగి అక్కడ పాగా వేయాలని సురేష్ ప్రయత్నిస్తున్నారంట. ఆ క్రమంలో ఆదిమూలపు సురేష్ వ్యవహారం వైసీపీలో తీవ్ర చర్చినీయంశంగా మారింది.

2009లో రాజకీయాల్లోకి వచ్చిన ఆదిమూలపు సురేష్ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికలలో ఆదిమూలపు సురేష్ సంతనూతలపాడు నియోజకవర్గానికి మారి వైసీపీ నుండి గెలుపొందారు. 2019లో తిరిగి తన నియోజక వర్గమైన ఎర్రగొండపాలెం వెళ్లిన సురేష్ ఆ ఎన్నికల్లోనూ గెలిచి జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణలోనూ ఆదిమూలపు సురేష్‌కి రెండో సారి మంత్రిగా అవకాశం లభించింది. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రకాశం జిల్లాలో సురేష్‌తో పాట మంత్రివర్గంలో ఉన్న సీనియర్ నాయకుడు, జగన్ బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డిని మూడేళ్ళకే పక్కన పెట్టినా.. సురేష్‌ని ఐదేళ్ళ పాటూ కొనసాగించారు. దానిపై అప్పట్లో బాలినేని అలకపాన్పు ఎక్కడంతో వైసీపీ ముఖ్య నేతలు రంగంలోకి దిగి బుజ్జగించాల్సి వచ్చింది. 

మంత్రిగా ఆదిమూలపు సురేష్‌పై అంత నమ్మకం ఉంచిన జగన్ టికెట్ దగ్గరకు వచ్చే సరికి మరోసారి ఆయనకు ఝలక్ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్‌ని కొండపి నియోజక వర్గానికి మార్చారు. తప్పనిసరి పరిస్థితులలో ఆయన కొండేపి నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే సురేష్ సిట్టింగ్ స్థానమైన ఎర్రగొండపాలెంలో పోటీ చేసిన తాటిపర్తి చంద్రశేఖర్ కూటమి హవాలోను వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాంతో మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెగ ఫీల్ అవుతున్నారంట. 

కొండపి నియోజకవర్గంలో ఎన్నికల వేళ పార్టీ కార్యాలయాల కోసం తీసుకున్న ఇల్లు కూడా ఖాళీ చేశారట. ఆదిమూలపు సురేశ్  తిరిగి ఎర్రగొండపాలానికి షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నా సిట్టింగ్ ఎమ్మెల్యేగా తాటిపర్తి చంద్రశేఖర్ ఉన్నారు. తిరిగి నియోజకవర్గంలో అడుగు పెట్టాలంటే  తాటిపర్తి చంద్రశేఖర్ పరపతిని తగ్గించడమే మార్గమని భావిస్తున్న ఆదిమూలపు సురేష్ ఆ పనిలో పడ్డారన్న ప్రచారం జరుగుతోంది.

అందులో భాగంగా  ఆదిమూలపు సురేష్ యర్రగొండపాలెంలో తన ముఖ్య అనుచరులుగా ఉన్న వారిని తెరచాటు రాజకీయం నడిపి సైకిల్ ఎక్కిస్తున్నారన్న టాక్ నడుస్తోందట. ఇటీవల  త్రిపురాంతకం ఎంపిపి  స్థానానికి, పుల్లలచెరువు మండల పరిషత్ వైఎస్ ప్రెసిడెంట్ స్థానానికి అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ ఆదిమూలపు సురేష్ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కి వ్యతిరేకంగా తన అనుచరులతో కలిసి తెరచాటు రాజకీయం నడిపారని ప్రచారం జరుగుతోంది. 

ఎర్రగొండపాలెంలో ఆదిమూలపు సురేష్ స్కెచ్ తెలుసుకున్న ఫ్యాన్ పార్టీ పెద్దలు ఇప్పటికే ఆయన్ని పిలిచి మందలించారంటున్నారు. ఒక వైపు టీడీపీలోకి తన అనుచరులను పంపుతూ యర్రగొండపాలెంలో వైసీపీని వీక్ చెయ్యాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయట. ఇప్పటికే ఆదిమూలపు సురేష్ వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారన్న ప్రచారం యర్రగొండపాలెంలో గుప్పుమంటోందట. ఈనేపథ్యంలో ముందస్తుగా తన అనుచరుల్ని సురేష్ వైసీపీ నుండి టీడీపీలో చేరుస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. 

అయితే నియోజక వర్గంలో జరుగుతున్న పరిణామాలతో తనకు సంబంధం లేదని ఆదిమూలపు సురేష్ పార్టీ పెద్దలకు వివరణ ఇస్తున్నా...సురేష్ పై మాత్రం రోజురోజుకీ ప్రచారం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. చంద్రశేఖర్‌ని వీక్ చేసి నియోజకవర్గ పార్టీ బాధ్యతలు చేపట్టాలనే వ్యూహంలో ఆదిమూలపు సురేష్ ఉన్నారంటున్నారు. మరి 2029 ఎన్నికల నాటికి ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.

 

By
en-us Political News

  
జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి కొందరు గుర్తుతెలియని ఆగంతకులు ఫోన్ చేసి వేధింపులకు గురిచేశారు.
జూన్ 14వ తేదీలోపే తల్లికి వందనం అమలు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15వేల చొప్పున జమ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
చివరాఖరికి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంచు మించుగా ఏడాదికి పైగా సాగుతున్న మంత్రివర్గ విస్తరణ మెగా సీరియల్ కు కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు తెర దించింది.
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అస్వస్థకు గురి అయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టును తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ గ్రీన్ కో ప్రాజెక్టు దేశానికి, ప్రపంచానికి మార్గదర్శిలా నిలిచిందని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో తనను కావాలని లాగుతున్నరని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరం కమీషన్ ఎదుట బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్ని అబద్దాలు చెప్పారని తుమ్మల తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపైనా, మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణం రాజు, ఒక టీవీ చానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుపైనా ఏపీ డిప్యూటీ స్వీకర్ రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
వైసీపీ అధినేత జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారని లోకేష్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండ ఉక్కపోతతో అల్లడుతున్న ప్రజలకు వర్షంతో ఉపశమనం కలిగింది. ఉన్నపళంగా వాతావరణం మొత్తం చల్లబడింది.
తీవ్ర అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరామర్శించారు.
అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ ఒక చానెల్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు మ్యాగజైన్ ఎడిటర్ కృష్ణం రాజు, ఆయనను ఇంటర్వ్యూ చేసిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు క్యాబినెట్ విస్తరణకు ఉండే అవకాశముంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.