Publish Date:Apr 25, 2021
కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తోంది. అధికారులను ఆందోళన పెడుతోంది. ప్రజా ప్రతినిధులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరోనా కట్టడి, చికిత్స విషయంలో ప్రజాప్రతినిధులపై జనాలు ఫైరవుతున్నారు. దీంతో తమ కోపాన్ని కొందరు నేతలు అధికారులపై చూపిస్తున్నారు. నేతల తీరుతో అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు తిరుగుబాటు చేస్తున్నారు.
కరోనా మందుల విషయంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కాన్ఫరెన్స్ కార్యాలయంలో కొవిడ్ సమీక్ష సమావేశం నిర్వహించగా, ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల లెక్కల్లో తేడాపై ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు విసురుకున్నారు.రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల కోసం రాజకీయ పైరవీలు ఎక్కువయ్యాయని రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంజెక్షన్లు ఇవ్వలేదని ఎమ్మెల్యే జోగు రామన్న తనపై కక్ష కట్టారని, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్ కు ఎక్కడ తరలిపోయాయో ఆధారాలు చూపించాలని బలరాం నాయక్ అన్నారు. దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న స్పందిస్తూ, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల కోసం తాను ఎవరికీ రికమెండ్ చేయలేదని స్పష్టం చేశారు.
సమావేశం తర్వాత రిమ్స్ లో పర్యటించారు ఎమ్మెల్యే జోగు రామన్న. హాస్పిటల్ లో కోవిడ్ మందులు, చికిత్స పై ఆరా తీశారు. కరోనా రోగులతోనూ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/adilabad-dmho-mla-war-on-covid-medicine-25-114253.html
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.