వైసీపీలోకి గొట్టిపాటి..! బాబు పిలిచి మాట్లాడినా...?

Publish Date:Nov 7, 2019

Advertisement

 

గొట్టిపాటి రవికుమార్... అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే... 2004లో కాంగ్రెస్ నుంచి... 2014లో వైసీపీ నుంచి... 2019లో టీడీపీ నుంచి... మొత్తంగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి... ఒకప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవికుమార్... అప్పటి రాజకీయ పరిస్థితులు, వ్యాపార ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశంలో చేరారు. అనంతరం 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేసి... మూడోసారి అద్దంకి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, ఏ కారణాలతోనైతే ఆనాడు టీడీపీలో చేరారో... ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో... మళ్లీ అదే పరిస్థితులు గొట్టిపాటికి ఎదురవుతున్నాయట. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నప్పటికీ, స్థానిక రాజకీయ పరిస్థితులు మాత్రం అనుకూలంగా లేకపోవడంతో... మళ్లీ వైసీపీ గూటికి చేరాలని భావిస్తున్నారట. వైసీపీ నేతలతో ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు.

అయితే, గొట్టిపాటి రవికుమార్ ఆలోచనను తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు పిలిచి మాట్లాడారు. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చాక... నియోజకవర్గంలో ఎదురవుతోన్న కష్టాలు... వ్యాపారపరంగా కలుగుతున్న ఇబ్బందులు... మరోవైపు కేసులు... ఇలా తన ఇక్కట్లపై గొట్టిపాటి ఏకరువు పెట్టారట. ముఖ్యంగా తనకున్న గ్రానైట్ వ్యాపారంపై విజిలెన్స్ దాడులు చేయిస్తున్నారని, దాంతో బల్లికురవ, చీమకుర్తిలో బిజినెస్ నిలిచిపోయిందని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట. అయితే, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తాను, పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పిన చంద్రబాబు.... పార్టీ మారాలన్న ఆలోచనను మానుకోవాలని సూచించారట. 

చంద్రబాబు బుజ్జగించినా, అండగా ఉంటామని భరోసా కల్పించినా, గొట్టిపాటి మాత్రం పార్టీ మారాలనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకు, వ్యాపారపరంగా ఇబ్బందులు ఒకటైతే... మరోవైపు జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉండటం కూడా కారణమంటున్నారు. ఇప్పటికే తన అనుచరులతో గొట్టిపాటి మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. మొత్తానికి గొట్టిపాటి పార్టీ మారడం ఖాయమే అయినా... అది ఎప్పుడు ఎలా అనేది మాత్రం తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

By
en-us Political News

  
రష్యాలో అదృశ్యమైన అంగార ఎయిర్‌లైన్స్ ఫ్యాసింజర్ విమానం కూలిపోయిందని ఎయిర్‌లైన్‌ అధికారులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనల్లో 49 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. గురువారం (జులై 24) రేవంత్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లకార్జున్ ఖర్గే, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా కులగణన, బీసీ రిజర్వేషన్ బిల్లుపై చర్చించారు.
 తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ నటించిన సినిమా సూపర్ సక్సెస్ కావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. హరి హర వీరమల్లు సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.
తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, మధిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు కాంగ్రెస్ గూటికి చేరనున్నారా? అందుకు రంగం సిద్ధం చేసుకున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 50మంది ప్రయాణికులతో చైనా లోని టిండా నగరం వైపు వెళ్తున్న విమానం అదృశ్యమైంది. ఆ విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సిట్ దర్యాప్తుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ నేతలకు నిప్పుడు ఉప్పు తోడైనట్లుగా ఈడీ కూడా ఎంటర్ కావడంతో ఇక చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన కార్యాలయాల్లో ఈడీ అధికారులు గురువారం (జులై 24) సోదాలు చేపట్టారు. ఢిల్లీ, ముంబయిలోని ఆయనకు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో దాదాపు 50 ప్రదేశాలలో ఏకకాలంలో ఈ దాడులు చేస్తున్నారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్‌కు పోలీస్‌ లు నోటీసులు జారీ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఫిర్యాదు మేరకు అనిల్ కుమార్ యాదవ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ కేసులో నోటీసులు జారీ చేశారు.
కావేరీ నది పొంగి ప్రవహిస్తున్నది. దాదాపు 84 ఏళ్ల తరువాత ఈ నదిలో ఈ స్థాయి నీటిమట్టం రావడం ఇదే మొదటి సారి. ఈ నదిపై 1932లో కృష్ణసాగర్ డ్యాం నిర్మించిన తరువాత ఇక్కడ నుంచి నీటిని దిగువకు విడుదల చేయడం ఇది రెండో సారి మాత్రమే.
తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావును వివాదాలు వెంటాడతాయా? లేక ఆయనే వివాదాల వెంటపడతారా తెలియదు కానీ, ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఆయన తరచూ వివాదాలతోనే సహవాసం చేస్తున్నారని అనిపించక మానదు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన తాజా డిమాండ్ తో కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ నే కాదు, బీజేపీ హైకమాండ్ ను కూడా ఇరుకున పడేశారు. తన రాజకీయ చాణక్యం ప్రదర్శించి.. కేంద్రంలో తీవ్ర ఒత్తిడి తీసుకుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.