Publish Date:Nov 21, 2024
అదానీ వ్యాపార సామ్రాజ్యం అత్యంత వేగంగా విస్తరించడం వెనుక రాజకీయ అండదం డలున్నాయన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఆయన వ్యాపార లావాదేవీల్లో పారదర్శకత తరచూ ప్రశ్నార్థకమౌతూనే ఉంది. ఇప్పుడే కాదు గతంలోనూ అదానీ అవినీతి వ్యవహారాలపై పలు ఆరోపణలు వచ్చాయి. అమెరికాకు చెందిన హిడెన్ బర్గ్ అనే పరిశోధనా సంస్థ గతంలో పలు మార్లు అదానీ వ్యాపార సామ్రాజ్యం అతి వేగంగా విస్తరించడం వెనుక మనీలాండరింగ్, సెక్యూరిటీల ఫోర్జరీ వంటి నేరాలు ఉన్నాయని ఆరోపిస్తూ నివేదికలు వెలువరించింది. తన నివేదికలకు ఆధారంగా స్విట్జర్ ల్యాండ్ విచారణ నిగ్గు తేల్చిన అంశాలను ప్రస్తావించింది. స్విట్జర్ ల్యాండ్ ఆ దేశంలో అదానీ గ్రూపునకు చెందిన పలు బ్యాంక్ అక్కౌంట్లను సీజ్ చేసిందని పేర్కొంది. అలా స్విట్జర్ ల్యాండ్ లో సీజ్ అయిన అదానీ అక్కౌంట్లలో 2600 కోట్ల రూపాయలు ఉన్నాయని హిడెన్ బర్గ్ గతంలో పేర్కొంది. అందుకు ఆధారంగా అక్కడి అంటే స్విట్జన్ ల్యాండ్ క్రిమినల్ కోర్డు రికార్డుల నుంచి సేకరించిన సమాచారాన్ని పేర్కొంది. అంతే కాకుండా వర్జిన్ ఐలాండ్స్, మారిషస్, బెర్ముడాలో కూడా అదాని అనుబంధ సంస్థ పెట్టుబడులు ఉన్నాయనీ, అవన్నీ కూడా మనీల్యాండరింగ్, సెక్యూరిటీల ఫోర్జరీల ద్వారా జమ చేసినవేనని ఆరోపించింది.
అయితే సహజంగానే అదానీ గ్రూపు ఆ ఆరోపణలను ఖండించింది. అయితే అప్పట్లో హిడెన్ బర్గ్ నివేదిక వెలువడిన తరువాత మార్కెట్ లో అదానీ షేర్ల విలువ భారీగా పతనమైంది. అప్పట్లోనే.. అంటే హిడెన్ బర్గ్ నివేదిక వెలువడడానికి ముందు వరకూ ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న అదాని, ఆ నివేదిక వెలువడిన స్వల్ప వ్యవధిలోనే 26వ స్థానానికి పడిపోయారు. అలాగే అదానీ గ్రూప్ షేర్ల విలువ కూడా భారీగా పతనమైంది. నివేదిక వెలువడిన నెల రోజుల వ్యవధిలో అదానీ సంపద 11లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. అప్పట్లో అదానీపై హిడెన్ బర్గ్ అక్కౌంటింగ్ ఫ్రాడ్, షేర్ల విలువ కృత్రిమంగా పెంచడం, మనీ ల్యాండరింగ్, అవినీతి వంటి ఆరోపణలు చేసింది.
ఇప్పుడు అమెరికాలో అదానీపై నమోదైన కేసులో కూడా ఇవే అంశాలు ఉన్నాయి. లాభాల కోసం ఒప్పందాలు చేసుకోవడానికి ముడుపులు చెల్లించారనీ, చెల్లించడానికి అంగీకారం తెలిపారన్న అభియోగాలపై అమెరికాలో అదానీపై కేసు నమోదైంది. సహజంగానే ఇప్పుడు కూడా అదానీ గ్రూప్ ఆ ఆరోపణలను ఖండించింది. అభియోగాలు, ఖండనల సంగతి ఎలా ఉన్నా.. ఒకే వ్యాపారిపై తరచుగా అవినీతి ఆరోపణలు రావడాన్ని బట్టి అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరణ వెనుక మతలబు ఉందన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే నిప్పు లేనిదే పొగరాదు. ఎంత మంది, ఎన్ని శక్తులు అండగా, దండగా నిలబడినా నిజం నికలకడ మీద తేలక తప్పదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/adani-business-expanssion-full-of-corruption-25-188774.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.