Publish Date:May 24, 2025
తిరుమలలో తప్పతాగి హల్ చల్ చేసిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు చెప్పారు. అన్నమయ్య భవన్ లో శనివారం (మే 24) డయల్ యువర్ ఈవో కార్యకరమంలో భక్తుల సందేహాలకు సమాధానమిచ్చిన ఆయన ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. శ్రీవారి పుష్కరిణిలో శుభ్రంగా ఉండడం లేదని భక్తుల ఫిర్యాదు చేశారనీ, అద్దె గదులలో బాత్రూంలు కొన్ని సరిగా క్లీన్ చేయడం లేదని కూడా ఫిర్యాదు చేశారని వివరించారు. ఇక శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి, బంగారు వాకిలి దగ్గర ఎక్కువ తోపులాట జరుగుతోందని భక్తుల వద్ద నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. భక్తుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఈవో స్పష్టం చేశారు.
అలాగే శ్రీవారి సేవలో సంస్కరణలు తీసుకువస్తున్నమన్న ఆయన ఇటీవల తిరుమల పర్యటనకు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సూచనల మేరకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. తిరుమలను ప్రణాళికా బద్దంగా అభివృద్ధి చేస్తామన్నారు. 100 బిగ్ క్యాంటీన్లు, 6 జనతా క్యాంటీన్ల కేటాయింపు విషయంలో నిబంధనల్లో మార్పులు తీసుకురానున్నట్లు వెల్లడించారు. 163 ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ చేస్తామని అన్నారు. భక్తులకు సాంప్రదాయ వంటలు మాత్రమే అందించాలని మరోమారు స్పష్టం చేశారు. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ పూర్తి స్థాయిలో నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
టెక్నాలజీ ఉపయోగించుకుని భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. త్వరలో జిపిటి చాట్ బోట్ అందుబాటులోకి తీసుకువస్తామనీ, వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 4 సర్వీసులను భక్తులకు అందుబాటులోకి తెచ్చామని మరో 10 సేవలు ట్రయల్ రన్ లో ఉన్నాయని ఈవో శ్యామలరావు వివరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/action-on-drunked-police-39-198616.html
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.