ఆలోచన దారి తప్పదు ... అంచనా గురి తప్పదు!

Publish Date:Feb 8, 2025

Advertisement

నీటిలో మత్స్యయంత్రం ప్రతిరూపాన్ని చూస్తూ గురి కొట్టి బాణం వదిలిన అర్జునుడి ఫోకస్. కళ్లకు గంతలు కట్టుకుని గదా యుద్ధం చేసిన భీముడి బలం. దుర్యోధనుడి ఎత్తుగడలను ముందే పసిగట్టిన శ్రీ కృష్ణుడి తెలివి తేటలు. భవిష్యత్ చెప్పేసిన వీరబ్రహ్మేంద్రస్వామి ముందు చూపు. చూపులతో చదివేసి మాటలు ఫిల్టర్ చేసి జనం బ్రెయిన్ లో ఏముందో స్కాన్ చేసే నైపుణ్యం. కోట్లాది ఓటర్లు, లక్షలాది రాజకీయ నేతలు, వందలాది పార్టీలు ఇవన్నీ ఒకే బుర్రలో పెట్టుకుని మరీ .. అపర చాణక్యుడిలా అంచనాలు వేసే ప్రతిభ సెఫాలజిస్టుల సొంతం. అలాంటి సెఫాలజిస్టుల్లో సక్సెస్ రేట్ ఉన్న రేరెస్ట్ పర్సనాలిటీ చాణక్య ముఖేష్.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.  ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ బీజేపీ విజయం సాధించింది.  అయితే బిజెపికి భారీ విజయం ఖాయమని ఎక్కువ మంది సెఫాలజిస్టులు చెప్పారు. అతి తక్కువ మంది మాత్రమే ఢిల్లీ ఎన్నికలలో టఫ్ ఫైట్ ఉంటుందనీ.. ఆ టఫ్ ఫైట్ లో విజయం సాధించేది బీజేపీయే అని చెప్పారు.  ఆ కొందరిలో కూడా చాణక్య స్ట్రటజీస్ మరింత యాక్యురేట్ గా ఢిల్లీ ఎన్నికల ఫలితాన్ని అంచనా వేసింది.  అవునుచాణక్య స్ట్రాటజీస్ వారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, బిజెపి మధ్య వార్ నువ్వా నేనా అన్నట్లే సాగింది. నెంబర్ చూస్తే బిజెపికి ఎక్కువ ఉన్నా.. చాలా చోట్ల బీజేపీ విజయం మార్జిన్  చాలా చాలా తక్కువ. స్వల్ప తేడాతోనే పలు నియోజకవర్గాలలో ఆప్ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్  మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 

మొన్నీ మధ్యే జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా చాణక్య స్ట్రాటజీస్ బీజేపీ విజయాన్ని ముందుగానే చెప్పింది.  హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని కూడా కచ్చితంగా అంచనా వేసింది. అంత కంటే ముందు  కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇలా రాష్ట్రం ఏదైనా ఎన్నికల ఫలితాలను ముందుగానే అంచనా వేసి కచ్చితంగా చెప్పింది. 

కర్నాటకలో బిజెపి ఓటమిని దాదాపు ఎవరూ అంచనా వేయలేదు.   కాని చాణక్య ముందే పసిగట్టింది. తెలంగాణలో
బీఆర్ఎస్ ఓటమిని కూడా చాలా మంది ఎక్స్ పెక్ట్ చేయలేదు. కాంగ్రెస్ అధికారానికి వస్తుందని ఊహించనే లేదు. కాని చాణక్య చెప్పగలిగింది. ఏపీలో కూడా కూటమి విజయం తథ్యమని ముందే చెప్పింది.

 ఇలా కచ్చితమైన అంచనాలు వేయడమంటే మామూలు విషయం కాదు.  సమాచారం ప్రజల నుంచే సేకరించినా,వారు మనసులోతుల్లో ఏమనుకుంటున్నారు, అలా అనుకుంటున్నదే చెబుతున్నారా?  లేక అబద్ధం చెబుతున్నారా అన్నది పసిగట్టడమంటే అంత తేలిక కాదు. మెదడుకు పని చెప్పాలి. ఎదుటి వారి బ్రెయిన్ రీడింగ్ చేయడం తెలియాలి.అదిచెప్పినంత ఈజీ కాదు. అందులోనూ జనం ఇప్పుడు ఓవర్ స్మార్ట్ అయిపోయారు. కెమేరా ముందు ఒకలా, వెనుక మరోలా చెబుతారు.  అలా చెప్పినట్లే పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటేస్తారన్న నమ్మకమూ లేదు.  ఇటువంటి పరిస్థితుల్లో ఎగ్జిట్ పోల్స్ లో కచ్చితత్వం అన్నది ఇప్పుడు చాలా చాలా అరుదైపోయింది.  పైగా ఎగ్జిట్ పోల్ అనగానే చాలా మంది నోరు తెరవరు. మరి కొందరు మనసులో ఉన్న మాట చెప్పరు. అయినా వారితో మాట్లాడే రెండు మూడు నిముషాలలోనే వారి మనసు లోతుల్లో ఏముందో పసిగట్టగలగాలి. ఆ విద్యలో నిష్ణాతులైతేనే ఆ సెఫాలజిస్టుల అంచనాలు వాస్తవానికి అద్దం పడతాయి. అలాంటి నిష్ణాతులైన సెఫాలజిస్టుల్లో ముందు వరుసలో నిలుస్తారు చాణక్య స్ట్రాటజీస్ ముఖేష్.  అలాంటి ఫైన్ అండ్ స్మార్ట్ సెఫాలజిస్టుల్లో చాణక్య స్ట్రాటజీస్ ముఖేష్  మన తెలుగువారు, తెలంగాణ వాసి. తెలుగువాడు. అలాంటి చాణక్య స్ట్రాటజీన్ ముఖేఫ్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.  ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన రోజు మనం చూస్తే ప్రతి నేషనల్ చానెల్ లో ముందు కనిపించినది మన చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోలే.  చాణక్య స్ట్రేటజీస్ ముఖేష్ పేరే జాతీయ చానెల్స్లో ఢిల్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో అత్యంత కచ్చితంగా ఇచ్చిన సెఫాలజిస్ట్ గా మొదటి వరుసలో నిలిచింది.  
  ఈ సక్సెస్ వెనక సీక్రెట్ ఏమిటని అడిగితే.. చాణక్య ముఖేష్ చిరునవ్వుతో, వినయంగా, బిడియంగా  టీమ్ వర్క్ అని ముక్తసరిగా చెబుతారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కచ్చితంగా అంచనా వేయడానికి మా టీమ్ ఢిల్లీలో నెల రోజుల నుంచీ పని చేస్తోందన్నారు.     పోలింగ్ రోజో.. లేదా పోలింగ్ కు ముందు వారం రోజుల ముందు పరిస్ధితులు చూసి మేం అంచనా వేయం. మొదటి నుంచి ఢిల్లీ రాజకీయాలపై మా అబ్జర్వేషన్ ఉంది. మా అంచనాలు కరెక్ట్ గా రావాలి, అంచనాలు వాస్తవాలకు అద్దం పాట్టాలంటే.. ఐదేళ్లూ ప్రభుత్వ పని తీరును పరిశీలిస్తూనే ఉండాలి. ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయానికి జనం ఎలా రెస్పాండ్ అవుతున్నారు.  ఎ నిర్ణయాన్ని వ్యతిరేకించారు? ఏ నిర్ణయాన్ని స్వాగతించారు. సానుకూలత ఎంత, ప్రతికూలత  ఎమిటి? అనేది పరిశీలిస్తూ ఉండాలి. మేం అదే చేస్తాం. 

 అలాగే ఏ పార్టీ, ఏ నాయకుడు ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారనేది చూస్తాం. అది వారి ప్రసంగాలు, మాటలలో తెలుస్తూనే ఉంటుంది. మామూలు వాళ్లకు అది అర్ధం కాకపోవచ్చు కానీ మాకు తెలిసిపోతుంది.  దానిని బట్టే ఆ నాయకుడు, ఆ పార్టీ నెక్స్ట్ స్టెప్ ఏమిటన్నది అంచనా వేస్తాం.  అలా కంప్లీట్   అబ్జర్వేషన్, ఎన్నికల సమయంలో చేసే పని కలిసి అంచనాలు వేస్తాం. అందుకే మా అంచనాలు వాస్తవానికి ప్రతిబింబాలుగా ఉంటున్నాయి ఉంటాయి.   ప్రతి రాష్ట్రంలో అలాగే చేశాం. చేస్తాం కూడా. ఇప్పుడు ఢిల్లీలో, అంతకు ముందు కర్నాటకలో మా అంచనాలలో కచ్చితత్వానికి అదే కారణం.

ఈ రోజుల్లో సోషల్ మీడియా, మీడియా మేనేజ్ మెంట్ ఎక్కువైపోయాయి. ప్రతి పార్టీ వీటి ద్వారా జనం మూడ్ ను మార్చేయాలని చూస్తున్నాయి. అయితే ఆ ప్రయత్నాలు కొన్నిసార్లు సక్సెస్ అవుతాయి.. కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి. ఒకటి మాత్రం స్పష్టం.. ప్రజలు ఎన్నికలకు ముందే డిసైడ్ అయిపోతారు. ఈ జిమ్మిక్కులన్నీ రెండు పార్టీల మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉండి, టైట్ ఫైట్ పరిస్థితి ఉంటేనే  ఏదో కొంచం వర్కౌట్ అవుతాయి.  అంతే.. లేదంటే వర్కౌట్ అయ్యే అవకాశం ఇసుమంతైనా ఉండదని చాణక్య ముఖేష్ చెప్పారు. 

 ప్రతి  నాయకుడు ఒక యాంగిల్ లో ఆలోచిస్తారు. అలాగే చాలా మంది ఎంత పెద్దవారైనా కూడా వారి ఆకాంక్షలకు, అంచనాలకు అనుగుణంగా పరిస్ధితులను అన్వయించుకోవాలని ప్రయత్నిస్తారు.  దాని కనుగుణంగా లాజిక్ తయారు చేసుకుని మాట్లాడుతుంటారు. కానీ వాస్తవాలు భిన్నంగా ఉంటాయి. అవి మేం చెప్పినా ఆ నాయకులు వినరు. విన్నా అంగీకరించరు.  ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఒకాయన అంతకు ముందు  అసెంబ్లీ ఎన్నికల్లో మేం చెప్పింది ఫాలో అయ్యారు.. విజయం సాధించారు. కాని అలా వినేవారు తక్కువ అంటూ ముఖేష్ తన అనుభవాన్ని విరరించారు. 

ఒకవైపు రాజకీయ నాయకులు గేమ్  ఆడుతుంటారు.. మరోవైపు ప్రజలు కూడా తెలివిగా మరో గేమ్ ఆడుతుంటారు. ఈ రెండు గేమ్స్ అర్ధం చేసుకుని.. అసలు గేమ్ ఏంటి.. ఎవరు విన్నర్ అనేది తేల్చడమే సెఫాలజిస్టుల పని. అంతే కాదు.. గేమ్ మార్చాలంటే గేమ్ ఛేంజర్ ఏంటనేది కూడా చెప్పగలిగేది సెఫాలజిస్టులే. మైండ్ రీడింగ్ అనేది ఎంత పవర్ ఫుల్ గా చేయగలిగితే సెఫాలజిస్టులు అంతగా సక్సెస్ అవుతారని ముఖేష్ చెప్పారు. 

భారతదేశంలో సక్సెస్ ఫుల్ సెఫాలజిస్టులు చాలా అరుదు. అలాంటి అరుదైన వారిలో ఒకరిగా మన తెలుగువాడు, తెలంగాణ వాసి చాణక్య ముఖేష్ నిజంగా తెలుగువారందరికీ  గర్వకారణం. ఈ సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగాలని.. జనానికి మేలు జరిగేలా రాజకీయ పార్టీలను, నాయకులను ప్రభావితం చేసేలా వారి సర్వేలు ఉండాలని ఆశిద్దాం.

By
en-us Political News

  
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు.
జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో ఓ యువ‌కుడు ర‌ప్పా ర‌ప్పా అంటూ ఫ్లెక్సీలు క‌ట్టి త‌న ర్యాలీలో పాల్గొన్న‌పుడే జ‌గ‌న్ వారించాల్సింది. కానీ అలా చేయ‌లేదు స‌రిక‌దా? ర‌ప్పా ర‌ప్పా అంటూ గంగ‌మ్మ జ‌త‌ర‌లో పొట్టేలు న‌రికిన‌ట్టు న‌రుకుతామ‌న‌డంలో త‌ప్పేంట‌ని మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు. దీంతో వైసీపీయులు బ‌రితెగించేశారు. ఆయ‌న‌కేం ఎన్ని కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బ‌య‌ట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.
ఇక్కడే కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల లక్ష్యమేంటంటే.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయనం.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. కొందరు వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.