ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ను లోతుగా విచారించేందుకు ఏసీబీ అధికారులు ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కీలక అంశాలపై వివరాలు సేకరించాల్సి ఉందని పేర్కొంటూ, వంశీ మోహన్ను వారం రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది.
ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగాలపై ఏసీబీ అధికారులు వంశీ మోహన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆస్తులు, ఆర్థిక లావాదే వీలు, పెట్టుబడులు, ఇతర సంబంధిత అంశాలపై మరింత సమా చారం సేకరించాల్సి ఉందని ఏసీబీ కోర్టుకు తెలిపింది.
ఏసీబీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు, వంశీ మోహన్ తరఫు న్యాయవాదులను కౌంటర్ను దాఖలు చేయాలని ఆదేశించింది. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కస్టడీపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/acb-seeks-custody-of-deputy-collector-vamsi-mohan-36-221757.html
గతంలో కంప్యూటర్లు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. కంప్యూటర్లు వస్తే అకౌంటెంట్లు, క్లర్కుల ఉద్యోగాలు పోతాయని అంతా భావించారు. కానీ వాస్తవంగా జరిగిందేమిటి? కంప్యూటర్ల వల్ల పాత ఉద్యోగ పద్ధతులు మారాయి తప్ప ఉద్యోగాలు తగ్గలేదు.. సరికదా మరిన్ని అవకాశాలు వచ్చాయి. సాఫ్ట్వేర్ అనే రంగం తెరమీదకు వచ్చింది. కోట్లాది మందికి సరికొత్త ఉపాధి లభించింది.
గచ్చిబౌలిలోని ఓ ఎలైట్ కోలివింగ్లో ఒక యువతి తన జీవితానికి చివరి అధ్యాయం రాసుకున్నది.
బీఆర్ఎస్ నేత సురేష్ రెడ్డి ఇంట్లో భారీ చోరి జరగడం తో హైదరాబాద్ సనత్ నగర్ జెడ్ కాలనీ ఇప్పుడు ఒక్క సారిగా చర్చల కేంద్రంగా మారింది.
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన రష్యా పర్యటనను యథావిధిగా కొనసాగించాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. డ్రోన్ల దాడుల వార్త వెలువడే సమయానికి ఆయన మాస్కో నుండి సెయింట్ పీటర్స్బర్గ్కు ప్రయాణిస్తున్నారు. అక్కడ నెలకొన్న భద్రతా ఏర్పాట్లు, తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం, లోకేష్ తన షెడ్యూల్లో ఎలాంటి మార్పులు చేయకూడదని నిశ్చయించుకున్నారు.
మలేషియా దేశంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
మధ్యతరగతి, సామాన్య కుటుంబాలపై మరోసారి చమురు భారం పడింది.
తమిళనాట బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె.అన్నామలై మూడు రోజుల క్రితం రాజీనామా చేశారు.
రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమ పథకాలపై విస్తృతంగా మాట్లాడారు.
అమెరికాలోని న్యూయార్క్ సిటీలోలో తెలుగు యువకుడు కుంచా అన్షుల్ దారుణ హత్యకు గురైనాడు.
తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంతో పాటు అసాంఘిక శక్తుల కదలికలను ముందుగానే గుర్తించి అరికట్టేందుకు సిటీ పోలీసులు శుక్రవారం
దాంపత్య బంధాన్ని కాపాడేది సహనం, సంభాషణే..