Publish Date:Oct 17, 2019
అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు ఏసీబీ అధికారులు. లంచం తీసుకున్న, అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన, అవినీతి ఆరోపణలు వచ్చిన వారిని ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని జైలుకు పంపిస్తూ, అవినీతికి పాల్పడితే ఏ విధమైన గతి పడుతుందో ఏసీబీ అధికారులు చూపిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా కర్నూలు జిల్లాలో ఏసీబీ టీమ్ అవినీతికి పాల్పడుతున్న జిల్లా అధికారులను ట్రాప్ చేయడం చాలా చర్చ నీయాంశంగా మారాయి. ఈ పది రోజుల్లోనే ముగ్గురు ఉన్నత స్థాయి అధికారులను ట్రాప్ చేసి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బు, ఆస్తులు గుర్తించారు.
గత నెలలో ఓ కేబుల్ ఆపరేటర్ నుంచి ఏపీ ఫైబర్ నెట్ లో మార్కెటింగ్ మేనేజర్ అయిన రామచంద్రను లక్షా యాభై వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ నెల మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్న శివప్రసాదరావుని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు రావడంతో ఇతని ఇళ్ల పై దాడులు నిర్వహించారు. రాయలసీమ రీజియన్ లోని అతిపెద్ద కేసుగా అధికారులు తెలిపారు. శివ ప్రసాద్ ఇంట్లో 1.45 లక్షల నగదు, కిలో బంగారాన్ని అలాగే బెంగుళూరులో సుమారు మూడు కోట్లు విలువ చేసే జి ప్లస్ సెవన్ అపార్ట్ మెంట్, హైదరాబాద్ లో ఒకటి పాయింట్ ఐదు కోట్లు విలువ చేసే అపార్ట్ మెంట్, బెంగళూరులోనే రెండు కోట్ల విలువ చేసే మరో బిల్డింగ్, హైదరాబాద్ లోని గాజుల మల్లారంలో ఒక కోటి విలువ చేసే ఇంటి స్థలం ఉన్నట్లు ఏసిబి అధికారులు తెలిపారు. ఇవికాక తన భార్య పేరుతో మరో రెండు యాక్సి ట్రీ హోటల్ ప్రైవేటి కంపెనీ, సీండ్రీస్ అనే రెండు సూట్ కంపెనీలను వాడుతున్నారు.మనీ ట్రాన్సక్షన్ కోసం యుగాండాలో బ్యాంక్ ఎకౌంట్ తెరిచాడు.
ఇక రెండ్రోజుల క్రితం ఓ రైతు నుంచి ఐదు వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సంజామల తహసీల్దారు గోవింద్ సింగ్ ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే అవాక్కవుతున్నారు. నిన్న ఎమ్మార్వోకు సంబంధించిన ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు తెరవగా భారీగా నగదు, స్థిర, చరాస్తులు, ఫిక్సెడ్ డిపాజిట్లు బయటపడటంతో అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. గోవింద్ సింగ్ పని చేసిన ప్రతిచోటా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. మరో నాలుగు సంవత్సరాల్లో రిటైర్ కాబోతున్న గోవింద్ సింగ్ లాకర్ లో పదహారు లక్షల ముప్పై రెండు వేల నగదు, పదిహేను లక్షలు విలువ చేసే నాలుగు వందల ఇరవై ఎనిమిది గ్రాముల బంగారం, కోటి రూపాయల విలువ చేసే ఫిక్సిడ్ డిపాజిట్లు. అతని భార్య బ్యాంక్ లాకర్ లో ఇరవై ఆరు లక్షల రూపాయలు ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే, జైలు పాలు కావాల్సిందే. ఓ వైపు ఏసీబీ అధికారులు వరుస పెట్టి దాడులు చేస్తున్న ప్రభుత్వ అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు తమ తీరు మార్చుకుంటారో లేదో చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/acb-raids-in-andhra-pradesh-25-90186.html
వర్షాకాలం ప్రారంభం కాకమునుపే హైదరాబాద్ లో శిథిలావస్థలో ఉన్న భవనాలు ఏ క్షణంలో కూలిపోతాయోనన్న ఆందోళన ఎక్కువైంది. ఎండలతో మండిపోతున్న హైదరాబాద్ లో నిన్న కురిసిన భారీ వర్షం చేదు అనుభవాన్ని మిగిల్చింది
తిరుమలలో శ్రీవారి రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (మే 8) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు నాలుగు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియ జేసింది. ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. మండే ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుంది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓటమి భయం వెంటాడుతోంది. ఇన్నాళ్లూ తనకు అనుకూలమైన అధికారులతో ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులు చేయించిన జగన్ కు ఈసీ వరుసగా షాకిలిస్తోంది. ఎన్నికల నియమావళిలో భాగంగా అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులపై ఈసీ బదిలీ వేటు వేస్తోంది.
కంగనా రనౌత్.. సినీమాల గురించి తెలిసిన వారెవరికీ ఈ పేరును కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. నటిగా ఆమె ఉన్నత శిఖరాలను అధిరోహించింది. హీరోయిన్ గానే కాదు, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనే ఆమె నటన విమర్శలకు ప్రశంసలు సైతం పొందింది.
మరో సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఐదు రోజులు మాత్రమే ఉండటంతో ఉద్యో గుల కోసం పోస్టల్ బ్యాలెట్ సౌలభ్యం ఉంది. ఈ నెల 9 వరకు గడువు విధించినట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు.
భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో మరచిపోలేని తిరుగుబాటు స్వరం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. చిన్నవయసులోనే మహోజ్వల శక్తిగా మారి భరతమాత దాస్యశృంఖలాల విముక్తి కోసం పోరాడిన మన్యం వీరుడు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్ర్యం వస్తుందని నమ్మి, తన ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు.
కీలెరిగి వాత పెట్టినట్లుగా చిరంజీవి జగన్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఎన్డీయే కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నారు. అసలే బలహీనంగా ఉన్న జగన్ కు చిరంజీవి తెలుగుదేశం కూటమికి బాహాటంగా మద్దతు ఇవ్వడం మరింత బలహీనం చేస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకూ చిరంజీవి ప్రత్యక్షంగా తన రాజకీయ మొగ్గు ఎటువైపు అన్నది ప్రకటించలేదు. కానీ మిత్రులు అంటూ అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, అలాగే జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ లకు ఓటు వేయండి అంటూ ఆయన ఒక వీడియో సందేహం ద్వారా ప్రజలకు పిలుపు నిచ్చారు.
దేశంలోనే పేరుపొందిన పారిశ్రామిక ప్రాంతం శ్రీ సిటీ ఇక్కడే ఉంది. అక్కడ కూడా సమస్యల కుప్పగా మారిపోయింది. ఎవరూ పట్టించుకునే వారు లేకపోవడంతో, ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. మరో వైపు, ఒకప్పటి టీడీపీ కంచుకోటగా వున్న సూళ్లూరుపేటలో సంచలన విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.
నేచురల్ స్టార్ నాని జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికలలో ఇప్పటి వరకూ సినీ పరిశ్రమ నుంచి ఎవరూ తమ మద్దతు ఫలానా పార్టీకి, ఫలానా అభ్యర్థికి అంటూ బాహాటంగా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరి ఆ పార్టీకి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
మళ్ళీ జగన్ అధికారంలోకి రావడం అనేది అసంభవం. అయినప్పటికీ ఇంకా చాలా కొద్దిమంది జగన్ మాయలో వుండే అవకాశం వుంది. వాళ్ళు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడేమో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక ప్రముఖులను ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేయడం సాధారణమైపోయింది.
జగన్ నోట ఓటమి మాట వచ్చేసింది. ఔను ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతాయా అన్న అనుమానం కలుగుతోంది. తనను అడ్డుకోవడానికి వాళ్లు సొమ్ములు నిలిపివేస్తున్నారు. అధికారులను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు అంటూ జగన్ మాట్లాడారు.