Publish Date:Oct 17, 2019
అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు ఏసీబీ అధికారులు. లంచం తీసుకున్న, అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన, అవినీతి ఆరోపణలు వచ్చిన వారిని ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని జైలుకు పంపిస్తూ, అవినీతికి పాల్పడితే ఏ విధమైన గతి పడుతుందో ఏసీబీ అధికారులు చూపిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా కర్నూలు జిల్లాలో ఏసీబీ టీమ్ అవినీతికి పాల్పడుతున్న జిల్లా అధికారులను ట్రాప్ చేయడం చాలా చర్చ నీయాంశంగా మారాయి. ఈ పది రోజుల్లోనే ముగ్గురు ఉన్నత స్థాయి అధికారులను ట్రాప్ చేసి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బు, ఆస్తులు గుర్తించారు.
గత నెలలో ఓ కేబుల్ ఆపరేటర్ నుంచి ఏపీ ఫైబర్ నెట్ లో మార్కెటింగ్ మేనేజర్ అయిన రామచంద్రను లక్షా యాభై వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ నెల మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్న శివప్రసాదరావుని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు రావడంతో ఇతని ఇళ్ల పై దాడులు నిర్వహించారు. రాయలసీమ రీజియన్ లోని అతిపెద్ద కేసుగా అధికారులు తెలిపారు. శివ ప్రసాద్ ఇంట్లో 1.45 లక్షల నగదు, కిలో బంగారాన్ని అలాగే బెంగుళూరులో సుమారు మూడు కోట్లు విలువ చేసే జి ప్లస్ సెవన్ అపార్ట్ మెంట్, హైదరాబాద్ లో ఒకటి పాయింట్ ఐదు కోట్లు విలువ చేసే అపార్ట్ మెంట్, బెంగళూరులోనే రెండు కోట్ల విలువ చేసే మరో బిల్డింగ్, హైదరాబాద్ లోని గాజుల మల్లారంలో ఒక కోటి విలువ చేసే ఇంటి స్థలం ఉన్నట్లు ఏసిబి అధికారులు తెలిపారు. ఇవికాక తన భార్య పేరుతో మరో రెండు యాక్సి ట్రీ హోటల్ ప్రైవేటి కంపెనీ, సీండ్రీస్ అనే రెండు సూట్ కంపెనీలను వాడుతున్నారు.మనీ ట్రాన్సక్షన్ కోసం యుగాండాలో బ్యాంక్ ఎకౌంట్ తెరిచాడు.
ఇక రెండ్రోజుల క్రితం ఓ రైతు నుంచి ఐదు వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సంజామల తహసీల్దారు గోవింద్ సింగ్ ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే అవాక్కవుతున్నారు. నిన్న ఎమ్మార్వోకు సంబంధించిన ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు తెరవగా భారీగా నగదు, స్థిర, చరాస్తులు, ఫిక్సెడ్ డిపాజిట్లు బయటపడటంతో అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. గోవింద్ సింగ్ పని చేసిన ప్రతిచోటా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. మరో నాలుగు సంవత్సరాల్లో రిటైర్ కాబోతున్న గోవింద్ సింగ్ లాకర్ లో పదహారు లక్షల ముప్పై రెండు వేల నగదు, పదిహేను లక్షలు విలువ చేసే నాలుగు వందల ఇరవై ఎనిమిది గ్రాముల బంగారం, కోటి రూపాయల విలువ చేసే ఫిక్సిడ్ డిపాజిట్లు. అతని భార్య బ్యాంక్ లాకర్ లో ఇరవై ఆరు లక్షల రూపాయలు ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే, జైలు పాలు కావాల్సిందే. ఓ వైపు ఏసీబీ అధికారులు వరుస పెట్టి దాడులు చేస్తున్న ప్రభుత్వ అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు తమ తీరు మార్చుకుంటారో లేదో చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/acb-raids-in-andhra-pradesh-25-90186.html
మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించిన ఆయనకు తన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కమ్ ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలను సెట్ చేసుకుంటే సరిపోతుందని ఆలోచన వచ్చింది.
తెలంగాణ ఉద్యమం అయిపోలేదు. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉందంటారు కేసీఆర్. ఎన్నికల్లో ఓటమి అనేది టెంపరరీ సెట్ బ్యాక్ మాత్రమే. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు నిబ్బరం ఉండాలి. గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలని కేసీఆర్ తన క్యాడర్కు హితబోధ చేస్తూ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు.
ఎవరు ఎంత అధికారంలో అయినా వుండవచ్చు... మా మాటకు ఎదురు లేదు.. మేం చేసిన దానికి తిరుగులేదు అనే ధీమాలో వుంటే వుండొచ్చు..
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వారం రోజుల వ్యవధిలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీకి కొమ్ముకాస్తూ ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్న అధికారుల జాబితాను రెడీ చేసుకున్న ఈసీ ఆ జాబితాలో ఒక్కొక్కరి పై బదిలీ వేటు వేస్తూ వస్తున్న. ఇప్పటికే పలువురు అధికారులపై బదిలీ వేటు వేసిన ఈసీ.. ఆదివారం (మే6) రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎపిలో నూతన డిజిపి నియామకమయ్యారు. అంతటితో ఆగకుండా ఎన్నికల కమిషన్ దూకుడు పెంచింది.
ఏపీలో ఎన్నికలు వారం రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. అధికార వైసీపీ ఈ ఐదేళ్ల కాలంలో చేసిందేమిటన్నది చెప్పుకోవడానికి ఏమీ లేక.. చెప్పుకునే గొప్పలు జనం నమ్మడం లేదని ఖరారు కావడంతో ఇక విపక్షాలపై దుష్ప్రచారం, అబద్ధాల వ్యాప్తికి డిస్పరేట్ గా ప్రయత్నిస్తోంది.
‘ఒకే ఒక్కడు’ సినిమాలో ఒక కీలక సీన్ వుంటుంది. ముఖ్యమంత్రి పోస్టులో వున్న రఘువరన్ని జర్నలిస్టు పాత్రలో అర్జున్ ఇంటర్వ్యూ చేస్తాడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ గట్టిగా చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమనీ ప్రజల భూములను దోచుకునేందుకు కుట్రపూరితంగా జగన్ సర్కార్ దీనిని తీసుకువచ్చిందని విమర్శిస్తున్నారు.
అబూజ్ మడ్ దట్టమైన అటవీ ప్రాంతం. కేవలం రెండు నెలల వ్యవధిలో ఇక్కడ జరిగిన ఎన్కౌంటర్లలో 90 మంది చనిపోవడమంటే.. కచ్చితంగా ఈ అబూజ్ మడ్ పైనే సర్కార్ సీరియస్ గా దృష్టి సారించినట్టు అర్థం చేసుకోవచ్చు.
ఏపీ ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన విషయం విధితమే. ఈ క్రమంలో కొత్త డీజీపీ నియామకం కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను పంపారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను సీఎస్ ఈసీకి పంపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ , బిజెపిలు పాలు నీళ్లలో కలిసి ఉండేవారు. బిజెపి బి టీం బిఆర్ఎస్ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ భారీ పరాజయంతో రెండు పార్టీల మధ్య అగాథం బాగా పెరిగాపోయింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లు వైసీపీ ప్రభుత్వంతో పూర్తిగా తెగతెంపులు చేసేసుకున్నారా? మరో సారి జగన్ ను నమ్మే పరిస్థితి లేదని విస్పస్టంగా చెప్పేశారా? అంటే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం కోసం వారు దరఖాస్తు చేసుకుంటున్న తీరును బట్టి ఔనని అనక తప్పదు.
వైసీపీ నాయకుడు జగన్కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అని, దాన్ని షార్ట్కట్లో ‘నార్సి’ అంటారని,