యథావిథిగా మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ 25న

Publish Date:Aug 19, 2025

Advertisement

మద్యం కుంభకోణంలో అరెస్టై ప్రస్తుతం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజంపేట ఎంపీ, వైసీపీ కీలక నాయకుడు అయిన మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు  షాక్ ఇచ్చింది. దీంతో ఆయనను జగన్ ఈ నెల 25న పరామర్శ యథావిధిగా జరుగుతుంది. వాస్తవానికి జగన్ ఇప్పటి వరకూ మద్యం కుంభకోణంలో అరెస్టైన ఎవరినీ పరామర్శించలేదు. దీంతో జగన్ మద్యం కుంభకోణం నిందుతులకు ముఖం ఎందుకు చాటేస్తున్నారన్న అనుమానాలు వైసీపీలోనే బలంగా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక తప్పదన్నట్లుగా జగన్ ఈ నెల 25న మిథున్ రెడ్డిని పరామర్శించడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అయితే తాను జైలుకు వెళ్లి పరామర్శించాల్సిన అవసరం లేకుండా ఆయనకు బెయిలు వచ్చేస్తుందని ఆశించినట్లుగా కనిపిస్తోంది. అయితే మిథున్ రెడ్డి బెయిలు పిటిషన్ నుఏసీబీ కోర్టు  కొట్టివేసింది. దీంతో అనివార్యంగా, ఇష్టం ఉన్నా లేకున్నా జగన్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో మిథున్ రెడ్డిని పరామర్శించక తప్పని పరిస్థితి ఏర్పడింది.   ఇదే కేసులో అరెస్టై విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నభారతీ సిమెంట్స్ ఆడిటర్ బాలాజీ గోవిందప్ప, మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలు దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్లను కూడా ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది.

ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా సిట్ దర్యాప్తు బృందం అధికారులు వీరికి బెయిలు మంజూరు చేయవద్దంటూ కోర్టును కోరడమే కాకుండా, మద్యం కుంభకోణంలో వారి పాత్రను నిర్ధారించే పలు ఆధారాలను కోర్టుకు సమర్పించారు.  అలాగే మ‌ద్యం కుంభకోణంలో  మిథున్ రెడ్డి న‌గ‌దును త‌రలించ‌డంలోనూ.. కుంభకోణానికి రూప‌క‌ల్ప‌న చేయ‌డంలోనూ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. మిథున్ రెడ్డికి చెందిన కంపెనీకి మద్యం స్కాం సొమ్ము 5 కోట్ల రూపాయలు చేరిందనీ, అయితే ఆయన తెలివిగా వాటిని తిరిగి ఇచ్చేశారనీ సిట్ అధికారులు కోర్టులు ఆధారాలతో అందజేశారు.

అలాగే..  మాజీ ఐఏఎస్ ధ‌నుంజ‌య‌రెడ్డి, కృష్ణమోహన్ లు కూడా ఈ స్కాంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు.  అదే విధంగా  భారతీ సిమెంట్స్ ఆడిట‌ర్ గోవింద‌ప్ప‌ మ‌ద్యం కుంభ‌కోణం ద్వారా వ‌చ్చిన నిధుల‌ను ఎలా మ‌ళ్లించాలి? ఏయే రంగాల్లో పెట్టుబ‌డులు పెట్టాలి? అనే విష‌యాల‌పై స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌డంతోపాటు.. 150 కోట్ల‌ను దారిమ‌ళ్లించార‌ని సిట్ అధికారులు కోర్టుకు వివ‌రించా రు.   పిటిష‌నర్ల త‌ర‌ఫున న్యాయ‌వాదులు  అస‌లు త‌మ వారికి మద్యం కుంభకోణంలో ఎలాంటి ప్ర‌మేయం లేద‌ని తెలిపారు.  ఇరు పక్షాల వాదనలూ విన్న ఏసీబీ కోర్టు వీరందరి బెయిలు పిటిషన్లనూ డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించింది.  

By
en-us Political News

  
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.