రెడ్డిగారూ ఉండబట్టే..మేమిక్కడ ఉండగలిగాం!

Publish Date:Oct 16, 2013

Advertisement

 

 

 
- డా. ఎబికె ప్రసాద్

[సీనియర్ సంపాదకులు]

 

 

డాక్టర్ సంజయ్ బారు పేరు పత్రికాపాఠకులకు తెలిసే ఉండాలి. ఆయనెవరో కాదు, మన తెలుగువాళ్ళలో స్థిరపడిన ఉత్తముల్లో ఒకరు. ఇంకా అంతకంటే వివరించి చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక, ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శిగా కీలకపాత్ర వహించిన సుప్రసిద్ధ విశ్రాంతాధికారి బి.పి.ఆర్. విఠల్ కుమారుడే డాక్టర్ బారు; మరింత వివరంగా చెప్పాలంటే ఇటీవల సంవత్సరాలలో ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ కు విశిష్ట మీడియా సలహాదారుగా పనిచేసి ఉన్న ప్రముఖుడే ఈ బారు. ఇతని ప్రస్తావన ఇప్పుడెందుకు చేయవలసి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ విభజన ప్రతిపాదనను అర్థాంతరంగా తెరమీద కెక్కడానికి కారణమైన పాలకపార్టీ అయిన కాంగ్రెస్ అధిష్ఠానం ఆ పార్టీ అధ్యక్షులయిన సోనియా నాయకత్వాన తెలుగుజాతిని చీల్చడానికి తీర్మానం రూపంలో తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల!

 


ఈ నెల 16న "హిందూ'' పత్రికలో బారు "విభజన'' సమస్యపై రాసిన ఒక ప్రత్యేక వ్యాసంలో మనకు తెలియని ఒక విశేషాన్ని బయటపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ను చీల్చడంకోసం తెలంగాణాలోని కొందరు మోతుబరులయిన గుప్పెడు రాజకీయ నిరుద్యోగులు తమ పదవీ స్వార్థప్రయోజనాల కోసం లేవనెత్తిన ఉద్యమం [ఇలాంటిది 1969-70 లలో కూడా ఇదే బాపతు వర్గం మరొక రూపంలో లేవనెత్తింది]సందర్భంగా ఇదే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గం 2001లోనూ 2004లోనూ ఇరుప్రాంతాల మధ్య సమస్యలేమైనా ఉంటే రాష్ట్రం విడిపోవటం కాకుండా వాటి పరిష్కారానికి మరొక ఎస్.ఆర్.సి.ని నియమిస్తే చాలునని ప్రతిపాదిస్తూ వచ్చింది; ఈ సమస్య పూర్వరంగంలో ఆనాటి [2004 నుంచి 2009 మధ్య, ఆ పిమ్మట 2009లోనూ] ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఢిల్లీ వెడుతుండేవారు. వెళ్ళినప్పుడల్లా ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలుసుకుంటూ వుండేవారు. ఆ సమయంలో బారు ప్రధాని మీడియా సలహాదారుగా ప్రధానికి సన్నిహితంగా ఉండి ప్రధాని-ముఖ్యమంత్రి మధ్య సంభాషణ వింటూండేవారు. అలాంటి సందర్భాల్లో మన్మోహన్ సింగ్ తనకు కలవవచ్చిన రాజశేఖర్ ను ఉద్దేశించి ఎప్పుడూ ఏమంటూ సంబోధించేవారో బారూ తాజా వ్యాసంలో పేర్కొన్నారు "రండి రెడ్డిగారూ, స్వాగతం. మీరక్కడ (ఆంధ్రప్రదేశ్ లో) ఉండబట్టే మేమిక్కడ (ఢిల్లీ) ఉండగలిగాం'' అని మన్మోహన్ కితాబు!



ప్రధాని మన్మోహన్ - ముఖ్యమంత్రి వై.ఎస్.కు అంత కితాబివ్వగలిగారు? "కారణం లేని తోరణం'' ఉండదు. 2004లోనూ, 2009లోనూ రెండుసార్లు జనరల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అఖండవిజయం సాధించిపెట్టింది రాజశేఖర్ రెడ్డి. అటు దేశేయంగానూ, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పరువుప్రతిష్ఠలు స్థిరపడడానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కారకులయిన ముఖ్యులలో ముఖ్యుడు రాజశేఖర్ అని మన్మోహన్ కే కాదు, తాము కాంగ్రెస్ 'పెద్దలం' అనుకునే వాళ్ళందరికీ తెలుసు. కాని మన్మోహన్ కు ఆ కృతజ్ఞతాభావం వుందిగాని సోనియాకు ఉందని నమ్మలేం! ఏ నాయకుడైనా/నాయకురాలైనా తన కొడుకులు/కూతుళ్ళు తన స్థాయికి రావాలని కోరుకోవతంలో తప్పులేకపోవచ్చుగాని, ఎదుటివాళ్ళ బిడ్డలు ఎదిగిరాకూడదని తలంచేవాళ్ళు దుష్టులుగానే ముద్రపడతారు! తాను అందుకు భిన్నం కాబట్టే బహుశా మన్మోహన్, నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ ను అలా తనను కలుసుకున్నప్పుడల్లా 'ఢిల్లీ లో కూడా మేము అధికారంలో ఉండగలగడానికి మీ కృషి వల్లనే'నని ధ్వనించగలిగాడు! మొత్తం ఆంధ్రప్రదేశ్ విజయం ప్రభావమే కేంద్రంలో సోనియా 'ప్రభ' వేలులోకి రావడానికి కారణమయింది. దేశ, విదేశీ పత్రికలూ ఆ విజయాన్ని ఘనంగా కీర్తించడమూ జరిగింది!

 

1999లో కాంగ్రెస్ కు ఆంధ్రప్రదేశ్ లో దక్కిన పార్లమెంటు లోక సభ సీట్లు కేవలం 9 కాగా ఆ సంఖ్య 2004ఎన్నికల్లో టిడిపి సహా అన్ని ప్రతిపక్షాలనూ ఓడించి 29 స్థానాలు కాగా, ఆ సంఖ్య తిరిగి 2009 ఎన్నికల్లో 33కి పెరిగి, కాంగ్రెస్ పార్టీ ఇటు హైదరాబాద్ లోనూ, అటు ఢిల్లీలోనూ అధికారానికి దిలాసాగా రాగల్గింది! కాంగ్రెస్ కు 'పాడికుండ'లాంటి అలాంటి ఆంధ్రప్రదేశ్ ను విభజించడానికి కాంగ్రెస్ నిష్కారణంగా కొందరు వేర్పాటువాద రాజకీయ నిరుద్యోగులు కృత్రిమంగా పెంచిన ప్రాంతీయ ఉద్యమానికి బెదిరిపోయి, రాజనీతిజ్ఞతను మరిచిపోయి అధిష్ఠానం పూనుకోవడాన్ని సంజయ్ బారు ఎంతో ఆవేదనలో నిశితంగా విమర్శించవలసి వచ్చింది౧ ఆ వేదనలో అతనొక మాత అన్నాడు : "బ్రిటీష సామాజ్యవాద ప్రభుత్వం సహితం భారతదేశాన్ని విభజించడానికి ఎంతో జాగరూకతతో వ్యవహరించాల్సివచ్చింది. కాని నేటి స్వతంత్ర భారతప్రభుత్వం మాత్రం దేశంలోనే తొలి భాషాప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యను పూర్తిగా అనాలోచితంగా పరిష్కరించడానికి గజ్జేకట్టింది''!

 

కాంగ్రెస్ అధిష్ఠానానిది ఎంత అనాలోచితమైన చర్యో, అంతకన్నా ఎక్కువరెట్లు అనాలోచితమైన వైఖరిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు, ఎం.పి.లూ, శాసనసభ్యులూ వహించారని చెప్పాలి. వాళ్ళకి అవినీతితో బంధుత్వమేగాని ఆలోచనతో కాదు; వాళ్లకి అధిష్ఠానం కాళ్ళకు మొక్కడంలో అవమానం చూడరు, ప్రజల కాళ్ళు మొక్కడానికి బిడియపడతారు. విభజన సమస్యపై అధిష్ఠానం నుంచి కిందిస్థాయి ఛోటా-మోటా కాంగ్రెస్ నాయకులవరకూ తమ పదవులు వదులుకోవడానికి సిద్ధంగా లేరు; వదులుకున్నట్టుగా ప్రజలకు కన్పించేందుకు స్పీకర్ లకు రాజేనమా పత్రాలు సమర్పించామని చెప్పడమేగాని ఆమోదింపజేసుకునే దమ్ములు లేవు! నేడు "ఆత్మగౌరవం'', "ఆత్మవిశ్వాసం'' అన్న పదాలకు విలువలేకుండా చేస్తున్నవాళ్ళు కాంగ్రెస్, టిడిపిలే; అందరూ రెండునాల్కలతో మాట్లాడేవారేగాని, ఏకావాక్యతతో మెలగడంలేదు. తమ రాజీనామా లేఖల్ని లోక సభ స్పీకర్ తిరస్కరించినా కాంగ్రెస్ ఎం.పి.లు ఎందుకు తిరస్కరించాల్సివచ్చిందో గద్దించే దమ్ములు కూడా కోల్పోయారు; అదేమంటే, విభజన సమస్యపై చర్చలకు ఇంకా రంగంలోకి రాని "మంత్రులబృందం'' అనే "దేవతావస్త్రాల'' సంఘాన్ని చూపుతూ ఆ సంఘాన్ని 'ఇదిగో, అదిగో' కలుస్తామని కేంద్రంలోని మంత్రులు ఊరించుతున్నారు!

 

"మా రాజీనామాల వల్ల విభజన ఆగద''ని పరువు కోల్పోయిన మంత్రులు సిగ్గువిడిచి ప్రకటించుకుంటున్నారు. రాష్ట్రానికి ఇంత రాజకీయ, ఆర్ధిక, సామాజిక  నష్టాలకు కారణమయిన కాంగ్రెస్ ను 2014 ఎన్నికల్లో ఎలాగోలా గట్తెక్కించుకుందామనే కాంగ్రెస్ వందిమాగధులు ఆశిస్తున్నారుగాని, ప్రజలు  మరోసారి మోసపోరు! ఎందుకంటే రాష్ట్రవిభాజనకు జరిగిన కుట్రలో ఎవరెవరు భాగాస్వాములో, ఎవరు, ఏ పార్టీ నాయకులు ఎవరితో ఎక్కడ కుమ్ముక్కు అయ్యారో, ఎవరిమధ్య ఎలాంటి ఒప్పందాలు జరిగాయో పూసగుచ్చినట్టు వెల్లడిస్తానని కాంగ్రెస్ సీనియర్ ఎం.పి. లగడపాటి ఇప్పటికి ప్రకటనలవరకే సరిపెట్టుకుంటున్నారుగాని, 'ముగ్గు'లోకి దిగడం లేదు! కాంగ్రెస్ లో ఆదినుంచీ "క్రమశిక్షణ'' అనే పేరుతొ నెహ్రూ కుటుంబసభ్యులకు దాసోహం అవడమే తమ ప్రత్యేక "జన్యు'' (డి.ఎన్.ఎ) లక్షణంగా భావించుకోవటం వల్లనే ప్రజల్ని మోసగించడానికి నాయకులు వెనుదీయడంలేదు. ఈ నేపథ్యంలోనే విభజన సమస్యపై సీమాంధ్రులతో చర్చలకు వస్తుందనుకున్న "ఆంటోనీ కమిటీ''ని ఆటక ఎక్కించారని పత్రికలు వార్తలందించాయి!

 

పిసిసి అధ్యక్షుడు బొత్సా నాటకాలు మానలేదు. జీవితంలో ప్రశ్నార్థకమైన "లాడ్జీ''రాజకీయాలకు అలవాటుపడిన రాజకీయ నాయకులు రాష్ట్ర రాజకీయాయపక్షాలకు నాయకత్వం వహించటం హాస్యాస్పదం! అందువల్ల స్పీకర్  ఫార్మాట్ లో రాజీనామాలు చేసి ప్రజలకు 'టోపీ'పెట్టె కార్యక్రమాన్ని రాష్ట్ర ఎం.పి.లు, శాసనసభ్యులూ మానుకొని ప్రజలతో మమేకతను, సమైక్యతా ఉద్యమానికి ఆచరణలో అండగానూ నిలబడి తీరాలి. అదే దేశభక్తికీ, తెలుగుజాతి పట్ల అనురక్తికీ నిదర్శనంగాని, స్పీకర్ కు యిచ్చే దొంగ ఫార్మాట్లు కావు. ఇటువంటి తప్పుడు ప్రకటనలతో, నర్మగర్భ కుట్ర రాజకీయ ప్రయోజనాలతో స్వాతంత్రోద్యమంలో వ్యవహరించి ఉండగలిగితే భగత్ సింగ్ లాంటి వీరులు తమ విలువైన ప్రాణాలను ఏనాడో కాపాడుకోగలిగి ఉండేవారు; ఆత్మగౌరవానికి పరీక్ష దొంగఫార్మాట్ లో రాజీనామాలు యివ్వడం కాదు. ఆ పత్రాలు లేకపోయినా, స్పీకర్ తొక్కిపట్టినా "ప్రజా ప్రతినిధుల''పేరుకు తగినట్టుగా శాసనకర్తలందరూ ప్రజలమధ్యకి రావలసిందే. రాజీనామాలు, ఆమోదించు ఆమోదించకపో  - కాంగ్రెస్ పార్టీకే రాజీనామా యివ్వగలగాలి!

By
en-us Political News

  
జగన్‌కు లౌకికవాద ముద్ర ఉంది, ఆయన తనను తాను క్రైస్తవ లేదా హిందూ విశ్వాసాలకు మాత్రమే పరిమితం చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఆయన నుదుటిపై సంప్రదాయ హిందూ బొట్టు కనిపించడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఇప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రీ కూడా ఇలాంటి ఆహార్యాన్ని ఎంచుకోలేదు.నల్లకొటు ధరించే ఏకైక ముఖ్యమంత్రి విజయ్ అనడంలో సందేహం లేదు. సీఎంలు, ప్రముఖ పొలిటీషియన్లు ధరించే సాధారణ చొక్కాలు, ప్యాంట్లు మొనాటనీ అయిపోయి జనం వాటిని పట్టించుకోవడమే మానేశారని చెప్పొచ్చు.
మాములుగా పార్ల‌మెంటు థియ‌రీ అంటే ఏమిటంటే ప్ర‌ధాని మాత్ర‌మే నిర్ణ‌యాలు తీసుకునేది కాదు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 107 స్థానాలను గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు మాత్రం చేరుకోలేకపోయింది. ఈ క్లిష్ట సమయంలో దశాబ్దాల నాటి డీఎంకే స్నేహాన్ని తెంచుకుని మరీ.. కాంగ్రెస్ విజయ్‌కు మద్దతు ప్రకటించింది.
పిఠాపురం నియోజకవర్గంలో తరచూ కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య వాగ్వాదాలు తలెత్తుతుండటమే. ఈ వాగ్వాదాల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతుండటం, పరిస్థితి నిత్య పంచాయతీగా మారిపోవడంతో తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నియోజకవర్గ ఇన్ చార్జ్ వర్మను ఆ పదవి నుంచి తప్పించాలని నిర్ణయించారు.
ఆయ‌న కు ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో 108 సీట్లు రాగా.. అందులో త‌న సీట్లే రెండు ఉండ‌టంతో.. ఒక‌టి తాను వ‌దులుకోవ‌ల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. దీంతో ఈ సంఖ్య కాస్తా 107కి ప‌డిపోయింది. మేజిక్ ఫిగ‌ర్- 118గా ఉంది. దీంతో ఆయ‌న పార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలంటే, జ‌గ‌న్ కి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య అంటే 11 కావాలి.
కేరళలో రేవంత్ రెడ్డి పర్యటించిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఆయన నిర్వహించిన రోడ్ షోలు ఓటర్లను విశేషంగా ఆకర్షించాయి. కోవళం, పఠానాపురం వంటి కీలక ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం క్షేత్రస్థాయిలో ఓట్ల వర్షం కురిపించింది. కోవళంలో ఎం.విన్‍సెంట్, పఠానాపురంలో జ్యోతి కుమార్ చమక్కల వంటి నేతలు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా గాడిన పెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటే, కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ తండ్రీకొడుకుల పనితీరు ప్రస్తుత రాజకీయాల్లో సరికొత్త స్ఫూర్తిని నింపుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండూ కూడా రైతుల కష్టాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మార‌నున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను బ‌ట్టి తెలంగాణలో ఈ రాజకీయ వేడి మరింత రాజుకునే అవకాశం క‌నిపిస్తోంది.
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.