టి20లలో తనకు తిరుగే లేదని టీమ్ ఇండియా మరోసారి రుజువు చేసుకుంది. స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు టీ20ల సిరీస్ ను 4-1తో కైవశం చేసుకుంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన చివరి టీ20లో టీమ్ ఇండియా ఏకంగా 150 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా పరుగుల సునామీ సృష్టించింది.
ముఖ్యంగా అభిషేక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లను సిక్సర్లతో ఓ ఆటాడుకున్నాడు. ఇంగ్లాండ్ పై టి20ల్లో ఫాస్టెస్ సెంచరీ రికార్డు సృష్టించాడు. కేవలం 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన అభిషేక్ వర్మ తన బ్యాటింగ్ లో ఐదు ఫోర్టు కొట్టాడు. ఏకంగా 13 సిక్సర్లు బాదేశాడు. బౌండరీ లైన్ ఆవల పడిన బంతిని తీసుకురావడమే ఇంగ్లాండ్ ఫీల్డర్ల పని అన్నట్లుగా అభిషేక్ వర్మ బ్యాటింగ్ జోరు కొనసాగింది. అభిషేక్ వర్మ బ్యాటింగ్ ధాటికి ఇంగ్లాండ్ బౌలింగ్ అటాక్ కకావికలమైపోయింది. గల్లీ బౌలర్లను ఎదుర్కొంటున్నామా అన్నట్లుగా అభిషేక్ వర్మ బ్యాటింగ్ విధ్వంసం కొనసాగింది. తొలి ఏడు ఓవర్లలో టీమ్ ఇండియా ఏకంగా 111 పరుగులు చేసిందంటేనే ఏ స్థాయిలో ఇంగ్లాండ్ బౌలర్లు ఊచకోతకు గురయ్యారో అర్ధం అవుతుంది.
ఇన్నింగ్స్ మొదటి బంతినే సిక్సర్ గా మలిచిన శాంసన్ త్వరగానే ఔటైపోయాడు. అయితే అభిషేక్ వర్మ తనకు అసలు అడ్డే లేదన్నట్లుగా చెలరేగి పోయాడు. సిక్సర్ల్ మోత మోగించాడు. ఒక దశలో నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ స్కోరు అలవోకగా 300 పరుగులు దాటేస్తుందా అనిపించింది. ఆ స్థాయిలో అభిషేక్ వర్మ బ్యాటింగ్ దాడి ఉంది. అయితే తిలక్ వర్మ , సూర్య కుమార్ యాదవ్ ఫెయిల్ అవ్వడంతో భారత్ పరుగుల వేగం ఒకింత మందగించింది. 10 ఓటర్లు పూర్తయ్యే సరికి మూడు వికెట్ల నష్టానికి 143 పరుగుల స్కోరు వద్ద నిలిచింది.
ఆ తరువాత వచ్చిన శివం దూబె, ఒక సిక్స్ ఒక ఫోర్ తో ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించాడు. కేవలం 13 బంతుల్లో 30 పరుగులు చేసిన శివం దూబె ఔటైన తరువాత వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా సిక్సర్ తో పరుగుల వేట మొదలెట్టినా కుదురుకోలేదు. రింకూ సింగ్ కూడా పెద్దగా రాణించలేదు. 54 బంతుల్లో 13 సిక్సర్లు 7 ఫోర్ లతో 135 పరుగులు చేసిన అభిషేక్ శర్మ చివరకు అవుట్ అయ్యాడు నిర్ణీత 20 ఒవర్లు పూర్తయ్యే సరికి టీమ్ ఇండియా 9 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు సాధించింది.
248 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 10.3 ఓవర్లలో కేవలం 97 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ ఫిల్ సాల్ట్ వినా మరెవరూ భారత్ బౌలింగ్ మందు నిలవ లేకపోయారు. సాల్ట్ 55 పరుగులు చేశాడు. అతడి తరువాత ఇంగ్లాండ్ బ్యటర్లలో జాకెబ్ బెతల్ ఒక్కడే డబుల్ డిజిట్ స్కోరు సాధించాడు. బెతల్ పది పరుగులు చేశాడు. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టగా, వరుణ్ చక్రవర్తి, శివం దుబె, అభిషేక్ వర్మ రెండేసి వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్ కి ఒక వికెట్ దక్కింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అభిషేక్ వర్మకు దక్కింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/abishek-verma-score-century-39-192244.html
Publish Date:Jun 10, 2026
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.