నిరాహార దీక్ష విరమించిన అభిజిత్ దీప్కే..!

Publish Date:Jul 20, 2026

Advertisement

 

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠ భరిత పరిణామాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తన ఆమరణ నిరాహార దీక్షను అధికారికంగా విరమించారు. నీట్ (NEET-UG) పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీల వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ గత 30 రోజులుగా ఈ శాంతియుత నిరసన ప్రదర్శనలు సాగుతున్నాయి. 

ఈ ఉద్యమంలో భాగంగా సుదీర్ఘంగా 21 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి, ఆరోగ్యం క్షీణించడంతో సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సామాజిక విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ విజ్ఞప్తి మేరకు అభిజిత్ దీప్కే తన నిరహార దీక్షను ముగించారు. వాంగ్‌చుక్ భార్య గీతాంజలి అంగ్మో నిరసన వేదికపై నుంచి ఈ సందేశాన్ని ప్రకటించగా, అభిజిత్ నిమ్మరసం తాగి దీక్షను విరమించారు. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నిరసనకారులకు మరింత శక్తి అవసరమని, అందుకే దీక్షను విరమించి ప్రత్యక్ష పోరాటంలోకి దూకాలని వాంగ్‌చుక్ కోరడం గమనార్హం.

దీక్ష విరమణ అనంతరం జంతర్ మంతర్ వద్ద వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిరసనకారులు 'చలో సంసద్' (పార్లమెంట్ మార్చ్) పిలుపునిచ్చారు. ఈ మహా పాదయాత్రలో అభిజిత్ దీప్కేతో పాటు గీతాంజలి అంగ్మో మరియు నీట్ పరీక్ష అక్రమాల వల్ల తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రియా కుమారి తండ్రి కూడా పాల్గొన్నారు. 

దాదాపు 8000 మందికి పైగా విద్యార్థులు, యువత, మద్దతుదారులు ఈ మార్చ్‌లో పాల్గొనేందుకు జంతర్ మంతర్ వద్దకు తరలివచ్చారు. "ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి" అంటూ నిరసనకారులు భారీ ఎత్తున నినాదాలు చేశారు. గత కొన్ని ఏళ్లుగా దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, వీటికి వ్యతిరేకంగా భారత చరిత్రలోనే ఇది అతిపెద్ద నిరసన ప్రదర్శనగా నిలుస్తుందని అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు.

ఈ భారీ నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చి చర్చలకు మొగ్గు చూపింది. సిజెపి (CJP) ముఖ్య ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా ఈ సమస్యపై చర్చించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డాతో భేటీ అయ్యేందుకు బయలుదేరారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలన్న విద్యార్థుల డిమాండ్లపై స్పష్టత వచ్చే వరకు పోరాటం ఆపేది లేదని ప్రతినిధులు తేల్చి చెప్పారు. మరోవైపు, ఈ నిరసన మార్చ్ పార్లమెంట్‌కు చేరుకోకుండా ఉండేందుకు ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. 

జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలను పూర్తిగా ఒక ఇనుప కోటలా మార్చేశారు. దాదాపు 32 కంపెనీల పారామిలట్రీ బలగాలను అంటే సుమారు 2000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. భద్రతా కారణాల దృష్ట్యా 5 ఢిల్లీ మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. అదనంగా మరో 1400 మంది పోలీసులను రప్పించి బారికేడ్లను వెల్డింగ్ చేసి నిరసనకారులను అడ్డుకునేందుకు సర్వసన్నద్ధమయ్యారు. అయినప్పటికీ విద్యార్థి లోకం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా శాంతియుతంగా తమ నిరసనను కొనసాగిస్తోంది.

Abhijeet Dipke hunger strike, Jantar Mantar protest Delhi, Sonam Wangchuk fast CJP, Chalo Sansad march NEET, JP Nadda meeting student leaders, Delhi police security deployment

By
en-us Political News

  
అలాగే బహ్రెయిన్‌లోని దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రధాన డేటా సెంటర్‌ను కూడా ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ దేశ పౌర వసతులపై అమెరికా దళాలు జరిపిన దాడులకు తగిన రీతిలో జవాబు చెప్పడానికే ఈ సాంకేతిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఈ ఆరోపణలు, క్షిపణి దాడి ఘటనను అమెజాన్ కానీ, బహ్రెయిన్ ప్రభుత్వం కానీ ధ్రువీకరించలేదు.
బాబాయ్ త్వరగా కోలుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ అయ్యింది. బాబాయ్ పట్ల ఎన్టీఆర్ చూపించిన ఈ ప్రేమాభిమానాల పట్ల నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో ఒప్పందం ఇవాళ సాకారమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో గత కొన్ని నెలలుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారం
తన ఆరోగ్యం, ఆసుపత్రి అనుభవాల గురించి తాజాగా నెట్టింట షేర్ చేసిన పోస్టు ఆయన అభిమానులను, సినీ వర్గాలనూ కలవరానికి గురి చేసింది. ఆసుపత్రి వాతావరణం, శస్త్రచికిత్స, అనంతరం ఐసీయూలో వైద్యుల నిరంతర పర్యవేక్షణ వంటి కష్టతరమైన దశలను ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జరుగుతున్న శ్రీ జగదాంబికా అమ్మవారి బోనాల మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు విస్తృత స్థాయిలో ట్రాఫిక్ బందోబస్తు చేపట్టారు.
ప్రధాని ఇంటి ఎదుట బైఠాయించిన రాహుల్, ఖర్గే..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జాతీయ రాజకీయం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛలో సంసద్ పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఉత్తరాంధ్ర ప్రాంత ప్రగతికి ఊపిరి పోసేందుకు తమ జీవనాధారమైన భూములను ప్రభుత్వం సేకరించడానికి సహకరించిన రైతులకు కృతజ్ఞతగా, గౌరవంగా భోగాపురం విమానాశ్రయం నుంచి ఉచితంగా ఒకసారి విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఈ మేరకు ఆయన అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
కాకినాడలో జరుగుతున్న NBK111 సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శిం చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పొగాకు (HSN 2401)పై ప్రస్తుతం అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని
ట్రైనీ ఐపీఎస్‌కి న్యాయం జరగాలి..విచారణ పూర్తికాకముందే దోషిగా ప్రకటించడం సరికాదు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.