అభి‘షేర్’శర్మ సిక్సర్ల సునామీ.. ఢిల్లీ క్యాపిటల్స్ పై ఎస్ఆర్ హెచ్ సునాయాస విజయం

Publish Date:Apr 21, 2026

Advertisement

ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్  హ్యాట్రిక్ విజయాలు సాధించింది. హైదరాబాద్  రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మంగళవారం (ఏప్రిల్ 21) రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆరెంజ్ ఆర్మీ పరుగుల సునామీ సృష్టించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ అజేయ,  శతకంతో కదం తొక్కడంతో, ఢిల్లీ క్యాపిటల్స్‌పై 47 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ ఘన విజయం సాధించింది. సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ.. అభిషేర్ శర్మలా మారిపోయి సిక్సర్ల మోత మోగించాడు. కేవలం 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 భారీ సిక్సర్లతో 135 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సొంతగడ్డపై సన్‌రైజర్స్ కు ఇది వరుసగా మూడో విజయం. ఈ విజయంతో ప్లేఆఫ్స్ దిశగా మరో అడుగు వేయడమే కాకుండా, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్  పరుగుల వరద పారించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రత్యర్థి బౌలింగ్ ను ఊచకోత కోశాడు.  మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్37 పరుగులు, ఇషాన్ కిషన్  పాతిక పరుగులు చేశారు.  చివరిలో హెన్రిచ్ క్లాసెన్   తనదైన శైలిలో మెరుపులు మెరిపించి 13 బంతుల్లో 37 పరుగులు చేశాడు. దీంతో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో  2 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.

భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ పోరాడినప్పటికీ, క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో లక్ష్యానికి దూరంగా నిలిచిపోయింది. నితీశ్ రాణా  30 బంతుల్లో 57 పరుగులు, సమీర్ రిజ్వీ 41 పరుగులు, కేఎల్ రాహుల్ 37 పరుగులు రాణించినా ఫలితం లేకపోయింది. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో..లక్ష్యానికి దూరంగా నిలిచిపోయింది.  సన్‌రైజర్స్ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. యువ పేసర్ ఎషాన్ మలింగ  ఢిల్లీ పతనాన్ని శాసించాడు. కీలకమైన డేవిడ్ మిల్లర్  , ట్రిస్టన్ స్టబ్స్  సహా మొత్తం 4 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు, యువ స్పిన్నర్ హర్ష్ దూబే తన మాయాజాలంతో ఆకట్టుకున్నాడు. కేవలం 2 ఓవర్లు బౌలింగ్ చేసి 12 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసి ఢిల్లీ ఓటమిని ఖాయం చేశాడు. దీంతో ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులకే పరిమితమైంది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్ 7 మ్యాచ్‌లలో 4 విజయాలు, 8 పాయింట్లతో పట్టికలో మూడో స్థానానికి చేరింది.  

By
en-us Political News

  
పెళ్లయిన కేవలం రెండు వారాల్లోనే అమెరికాలోని మాసాచుసెట్స్‌లో హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల ఇంజనీర్ జాబీర్ హుస్సేన్ నిద్రలోనే కన్నుమూశారు. ఉదయం తల్లితో మాట్లాడిన కొద్ది గంటలకే చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన వివరాలు, కుటుంబ సభ్యుల ఆవేదన మరియు పార్థివదేహం రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై పూర్తి కథనం.
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.