ఆమాద్మీముందు ప్రజారాజ్యం దిగదుడుపే

Publish Date:Dec 10, 2013

Advertisement

 

ఆమాద్మీపార్టీ స్థాపించి ఏడాది కూడా తిరగకుండానే డిల్లీలో కాంగ్రెస్, బీజేపీలకు చుక్కలు చూపించింది. ఇంచుమించు అటువంటి గొప్ప ఆశయాలతోనే మన రాష్ట్రంలో కూడా చిరంజీవి ప్రజారాజ్యం, జయప్రకాశ్ నారయణ లోక్ సత్తా పార్టీలు స్థాపించారు. కానీ, రెండు పార్టీలు కూడా ఆమ్మాద్మీలాగ నిలద్రోక్కుకొని తమ సత్తా చూపలేకపోయాయి.

 

లోక్ సత్తా నామ మాత్రంగా ఇంకా రాష్ట్రంలో కనబడుతున్నపటికీ ప్రజారాజ్యం మాత్రం పదవుల కోసం తన ఆశయాలకు, సిద్దాంతాలకు తిలోదకాలు ఇచ్చేసి నిర్లజ్జగా కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయింది. పోనీ దానివల్ల చిరంజీవి, ఆయన అనుచరులు ఏమయినా బావుకొన్నారా? అంటే అదీ లేదు. రాష్ట్ర విభజన ఉచ్చులో చిక్కుకొని ఏడాది తిరగకుండానే మళ్ళీ వారందరి పరిస్థితి మొదటికి వచ్చేసింది. ప్రజారాజ్యం స్థాపించక ముందు రాష్ట్ర ప్రజలు, అభిమానులు ఆ పార్టీపై ముఖ్యంగా చిరంజీవిపై చాలా ఆశలు పెట్టుకొన్నారు. అయితే అడుగడుగునా పొరపాట్లు చేస్తూ ఎన్నికలు ముగిసేసరికే తన పరువు, పార్టీ పరువు రెండూ కూడా పూర్తిగా పోగోట్టుకొన్న ఏకైక జీవి చిరంజీవి.

 

గతంలో నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీ కేవలం తొమ్మిది నెలలలోనే రాష్ట్రంలో అధికార పగ్గాలు చెప్పటడం చూసి, చిరంజీవి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తనకున్నఅశేష ప్రజాభిమానంతో అధికారం కైవసం చేసుకొని ముఖ్యమంత్రి అయిపోదామనే లక్ష్యంతో పార్టీని పెట్టారు. కానీ ఆయన ఏ అభిమానుల అండ చూసుకొని పార్టీ పెట్టారో ఆ వీరాభిమానులను అందరినీ దూరంగా ఉంచడం, పార్టీలో వారికి ఎటువంటి పాత్ర లేకుండా చేయడం ఆయన చేసిన అతిపెద్ద పొరపాటు. అందువల్ల ఆయన ఎన్నికల ప్రచారంలో ఎన్ని గొప్ప ఆశయాలు, సిద్దాంతాలు వల్లె వేసినా ప్రజలు ఆయనను నమ్మలేదు.

 

ఆమాద్మీ పార్టీ, తెదేపా రెండూ కూడా కేవలం ప్రజాభిమానంతోనే అతి తక్కువ వ్యవధిలోనే అపూర్వ విజయాలు సాధించగా, ప్రజాభిమానం పుష్కలంగా ఉన్నపటికీ ప్రజారాజ్యం అతితక్కువ వ్యవధిలోనే దుఖాణం కట్టేసుకొని సరి కొత్త రికార్డు నెలకొల్పింది. ఎన్నికలలో ఓడిపోయినా తరువాతయినా చిరంజీవి తన తప్పు తెలుసుకోలేదు. కనీసం పశ్చాత్తాప పడలేదు. పద్దతులు కూడా మార్చుకోలేదని తదనంతర పరిణామాలు స్పష్టం చేసాయి. ఈరోజుకి కూడా ఆయన వ్యవహరిస్తున్నతీరుని ప్రజలందరూ ఆక్షేపిస్తూనే ఉన్నారు.

ఆమాద్మీ పార్టీతో పోలిస్తే చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా అశేష ప్రజాదారణ ఉండేది. కానీ దానిని సరిగ్గా ఉపయోగించుకోలేక ఒక గొప్ప అవకాశాన్ని పోగొట్టుకొంది.

 

ఇక గత ఎన్నికలలో కులం, డబ్బు, రాజకీయ సమీకరణాల ముందు లోక్ సత్తా పార్టీ కొట్టుకుపోయింది. ఆ తరువాత నుండి లోక్ సత్తా కూడా వాస్తవ పరిస్థితులకి అనుగుణంగా మాట్లాడుతూ వ్యవహరించడం మొదలుబెట్టింది. దానివల్ల ఆ పార్టీ ఎటువంటి లాభం పొందలేకపోయినా క్రమంగా ఉన్న పేరు కూడా పోగొట్టుకొంది. లోక్ సత్తా, ప్రజా రాజ్యం పార్టీలు రెండూ కూడా గొప్ప ఆశయాలతో ఆరంభమయినవే, కానీ ఆమాద్మీ పార్టీ లాగ ఎందుకు విజయవంతం కాలేకపోయాయి అని ప్రశ్నించుకొంటే, సరయిన ప్రణాళిక లేకపోవడం, వల్లె వేస్తున్న ఆశయాలు, సిద్దాంతాల పట్ల చిత్తశుద్ది లేకపోవడం, ప్రజలతో మమేకం కాలేకపోవడం ముఖ్యకారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీల తీరు, వైఫల్యం చూసిన తరువాత ఇక ముందు పుట్టుకొచ్చేఏ పార్టీలని కూడా ప్రజలు నమ్మలేని పరిస్థితి లేకుండా పోయింది.

 

By
en-us Political News

  
ఆ ఆత్మీయ విందులో పాల్గొన్న వారెవరి మెబైల్ ఫోనూ ఒక్కసారి కూడా రింగ్ అవ్వలేదు. అంతెందుకు ఆ సమయంలో ఎవరూ ఫోన్ జోలికే పోలేదు. వాట్సాప్ చాటింగ్ ల ఊసే లేదు. కుటుంబాల ముచ్చట్లు, పెళ్లిళ్లు, పిల్లల చదువులు, కుటుంబాలా క్షేమ సమాచారాలు పంచుకోవడంతో అంతా ఆనందంగా ఆహ్లాదంగా గడిపారు.
తాజా జాబితాలో 5.67 కోట్ల మంది ఓటర్లు నమోదు కాగా, వీరిలో 2.77 కోట్ల మంది పురుషులు, 2.89 కోట్ల మంది మహిళలు 7,617 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. క్లెయిమ్‌లు, అబ్జెక్షన్ పీరియడ్‌లో దాఖలు చేసిన దరఖాస్తులను సమీక్షించి మార్పులు చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.
రాష్ట్రంలో కాపు సామాజికవర్గం బానిస వర్గం కాదన్నారు. అరెస్టులకు భయపడేది లేదని ముద్రగడ ఈ సందర్భంగా చెప్పారు. గతంలో చంద్రబాబు తనను, తన కుటుంబాన్నీ వేధించిన తీరు అందరికీ తెలుసునని చెప్పిన ఆయన మాజీ మంత్రి ఇంటిపై ఏడు గంటల పాటు దాడులు చేయడం, అరెస్టులతో భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు.
కల్తీ పాల వల్లే వారు అనారోగ్యం పాలయ్యారని ప్రాథమికంగా నిర్థారణ అయిందన్నారు. అంతకుముందు కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో వర్చువల్ గా చంద్రబాబు సమావేశమైన చంద్రబాబు కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పాల శాంపిల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత పాలు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇటీవ‌ల కిరాక్ ఆర్పీ.. వైసీపీ ఎమ్మెల్సీ, మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత‌ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను అవ‌హేళ‌న చేస్తూ మాట్లాడారు. ఆ వెంట‌నే కాపుల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. దీంతో దిగి వ‌చ్చిన ఆర్పీ క్ష‌మాప‌ణ చెప్పారు కూడా. అలాగ‌ని కాపులంతా వైసీపీకి స‌పోర్ట్ చేయ‌డం అని అర్ధం కాదు క‌దా ? అంటున్నారు వంగవీటి రాధా అభిమానులు.
రాజకీయ ప్రవేశంపై తనకు ఆసక్తి ఉన్న మాట వాస్తవమేననీ, అయితే అందుకు ఇంకా సమయం ఉందన్నారు. ఇప్పటికే ఆమె సోదరుడు వంగవీటి రాధా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న సంగతి విదితమే.
తెలంగాణ‌లో కమలం పార్టీ ఎప్ప‌టి నుంచి పుంజుకుంది? రాష్ట్రంలో అధికారం చేప‌ట్టే అవ‌కాశ‌మెంత‌ అన్న‌దొక చ‌ర్చ‌.
తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి అధిక సంఖ్యలో కవాహనాలతో వెళ్ల కూడదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ అంబడి రాంబాబు, జక్కంపూడి రాజా ఆ నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడమే కాకుండా రైల్ కం రోడ్డ బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో వాహనాలతో వెళ్లడంతో రాజమహేంద్రవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
గుంటూరులోని తన నివాసంపై తెలుగుదేశం శ్రేణుల దాడి, తనపై హత్యయాత్నం చేయడం తదితర విషయాలను జగన్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ అంబటికి కేసులకు భయపడవద్దని ధైర్యం చేప్పారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు.
అప్పట్లో అధికారపార్టీలో ఉన్న అనంతబాబుతో అధికారంలో ఉన్న వై ఉన్న అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని వ్యాఖ్యానించింది. డీఫాల్ట్ బెయిల్ వచ్చేలా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.
వైసీపీ సభ్యులు వేంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్లకార్డులతో పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.