భార్య చావుకి, భర్త ప్లాన్.. చివరికి.. 

Publish Date:Jun 24, 2021

Advertisement

ఈ మధ్య కాలంలో భార్య భర్తల మధ్య వివాదాల కేసులు చాలానే తలెత్తుతున్నాయి. అటు పెద్దలు కుదిర్చిన పెళ్ళిలో కావచ్చు, ఇటు ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి విషయంలో గొడవలు సహజంగా జరుగుతున్నాయి. ఏ కుటుంబంలో అయిన గొడవలు జరగడం సహజమే కానీ ఆ గొడవలు చావుల వరకు వెళ్తున్నాయి. ఇంకొందరు మాత్రం గదులలో బందించి మరి హింసిస్తున్నారు. అయితే సరిగ్గా అలాంటి సంఘటనే జరిగింది. మీరే చూడండి అసలు ఏం జరిగిందో. వాళ్ళు ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా నాలుగు ఏళ్ళ బాబు కూడా ఉన్నాడు. కారణాలు తెలియలేదుగానీ మనసుకు నచ్చి  ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చంపాలని ప్రయత్నించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. 

నెల్లూరు జిల్లాకు చెందిన ఆశ అనే మహిళ కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్లి సినీ పరిశ్రమలో పనిచేసేది. అక్కడ సీతానగరం మండలంలోని పెదకొండేపూడికి చెందిన కర్రి అభిరామ్‌ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే బంధించి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించాడో దుర్మార్గపు భర్త. కొంతకాలం అభిరామ్ ఆమెను దూరం పెట్టడంతో ఇటీవల పెదకొండేపూడిలోని అత్తమామల ఇంటిముందు కొడుకుతో కలిసి నిరసన దీక్ష చేపట్టింది. పెద్దలు రంగంలోకి దిగి ఇద్దరికి సర్ది చెప్పి వారి  మధ్య రాజీ కుదర్చడంతో ఆశ అత్తింట్లోనే ఉంటోంది. అయితే ఆమెతో కాపురం చేయడం ఇష్టం లేని అభిరామ్ కొద్దిరోజులుగా భార్యను ఇంట్లోనే బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. పధకం వేశాడు ఆ పధకాన్ని అమలు పడ్డామని దిండుతో ముఖంపై అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఇంట్లోని కుటుంబ సభ్యులు అతనికి సహకరించారు. వారి నుంచి తప్పించుకున్న ఆశ సీతానగర పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భర్త అభిరామ్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడిలో వెలుగుచూసింది. మోసాల మనుషులు మోసపు రోజులు ఎవరిని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో అర్థం కానీ రోజులు ఇవి.. ప్రేమ పేరుతో కలవడం ఆ తర్వాత విడిపోవడం.. పిల్లలు ఉన్నారు వారి భవిష్యత్తు ఏం అవుతుందని ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం. అని స్థానికులు మాట్లాడుకుంటున్నారు.   

By
en-us Political News

  
వైసీపీ ప్ర‌భుత్వం దిగిపోవ‌టం ఖాయ‌మైంది. ఐదేళ్ల‌ పాటు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌క్ష‌పూరిత‌, అరాచ‌క పాల‌న‌కు విసిగిపోయిన ఏపీ ప్ర‌జలు ఓటు ద్వారా వీడ్కోలు ప‌లికేశారు. వైసీపీ శ్రేణుల హింసకు పాల్పడుతూ రెచ్చిపోయి భ‌యాందోళ‌న‌కు గురిచేసినా, ప‌లు పోలింగ్ కేంద్రాల్లో దాడుల చేసినా బెద‌రకుండా, అద‌ర‌కుండా ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ ల వ‌ద్ద‌కు ఓట‌ర్లు పోటెత్తారు.
ముంబైలో పలు ప్రాంతాల్లో భారీ గాలులు, వర్షం బీభత్సం సృష్టించాయి. బలమైన గాలుల కారణంగా ఘట్కోపర్ ప్రాంతంలో ఒక భారీ హోర్డింగ్ కుప్పకూలింది. ఆ హోర్డింగ్ పక్కనే వున్న పెట్రోల్ బంక్‌పై పడటంతో ఎనిమిది మంది మరణించారు.
పోలింగ్ ముగిశాక టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. వైసీపీ వర్గాలు మాత్రం నిరాశ, నిస్పృహల్లో మునిగిపోయి కనిపిస్తున్నారు.
నగరి నియోజకవర్గానికి పట్టిన దరిద్రం వదలబోతోంది. ఆ నియోజకవర్గ వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే రోజా ఓడిపోబోతోంది.
నాలుగో విడత పోలింగ్ సమాప్తం
పోలింగ్ బూత్‌లో బుర్ఖా వేసుకున్న మహిళల ఐడీ ప్రూఫ్ చెక్ చేసిన నేపథ్యంలో తనపై నమోదైన కేసు అంశం మీద హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత స్పందించారు. తాను హైదరాబాద్ నుంచి లోక్ సభ అభ్యర్థిని అని... పైగా మహిళా అభ్యర్థిని అన్నారు. వారి ఫొటో ఐడెంటింటీని చెక్ చేసుకునే హక్కు తనకు ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వేళ అధికార వైసీపీ అన్ని విలువలకూ వలువలు విప్పేసి యథేచ్ఛగా దాడులు, దౌర్జన్యాలకు తెగబడింది. అదే సమయంలో ఎన్నికల సంఘం కూడా హింసాత్మక ఘటనలపై సీరియస్ గా స్పందించి ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టు చేసింది.
పోలింగ్ సందర్భంగా కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ నాయకత్వంలో  బీభత్సం సృష్టించారు
5 గంటల వరకు ఏపీలో 67.99 శాతం పోలింగ్
 ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ప్రక్రియ చాలా కీలకంగా ఉంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, ఇది అందరూ హక్కుగా చెబుతూ ఉంటారు. ప్రత్యేకించి ఓట్లు వేయడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ ఉంటారు.‌ అయితే ఎవరు ఎంత చెప్పినా.. కొందరు మాత్రం అస్సలు మారరు. గడప దాటరు. ఓటు వేయరు. ఏం జరిగినా మనకెందుకులే అని కూర్చొంటారు. అలాంటి వారిలో హైదరాబాదీలు కూడా ఉన్నారు.
కుప్పం మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారాచంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇక్కడ ఆయన వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఆ ఒరవడిని బద్దలు కొడతామంటూ ఇంత కాలం వైసీపీ ప్రగల్భాలు పలికింది.
పుణ్యక్షేత్ర సమీపంలో కూడా వైసీపీ నేతలు పాపపు పనులు మానుకోవడం లేదు. తిరుపతిలోని పోలింగ్ కేంద్రాల దగ్గర వైసీపీ నాయకులు దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.