Publish Date:May 10, 2024
అబ్ కీ బార్ 400 బహార్ అనే నినాదంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బిజెపి హైదరాబాద్ లోకసభ స్థానం మీద పూర్తి కాన్ సన్ ట్రేషన్ చేస్తోంది. 40 ఏళ్లుగా హైద్రాబాద్ లోకసభ స్థానాన్ని గెలుస్తూ వచ్చిన మజ్లిస్ పార్టీని ఓడించడానికి బిజెపి అధిష్టానం భారీ వ్యూహంతో ఉంది. ఎవరూ ఊహించని మహిళా అభ్యర్ధిని రంగంలో దించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోడ్ షో నిర్వహిస్తే దేశవ్యాప్తంగా పేరున్న సెలబ్రిటీలను రంగంలో దించుతోంది. ఒకప్పుడు తెలుగు సినిమాల హీరోయిన్ అయిన నవనీత్ కౌర్ హైదరాబాద్ బిజెపి ఎంపి అభ్యర్థి మాధవీలత తరపున ప్రచారానికి వచ్చి కేసులో ఇరుక్కున్నారు.
హైదరాబాద్ లోని షాద్ నగర్ లో ఎన్నికల ప్రచారంలో మహారాష్ట్ర ఎంపీ, సినీనటి నవనీత్ కౌర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇటీవల షాద్ నగర్ లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నవనీత్ కౌర్ ‘ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే పాకిస్థాన్ కు వేసినట్లే’నన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యల్ని ఎన్నికల సంఘం కూడా సీరియస్ గా పరిగణించడంతో పోలీసులు నవనీత్ కౌర్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇప్పటికే మాధవీలతపై మజ్లిస్ పార్టీ ఈసీ కి ఫిర్యాదు ఇస్తే కాంగ్రెస్ పార్టీ పోలీస్ కేసు నమోదు చేయించడం చర్చనీయాంమైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/a-case-has-been-registered-against-navneet-kaur-39-175564.html
రిజల్ట్స్ కౌంట్డౌన్ కొటేషన్-1
ఇంతకాలం అమెరికాలో వుండి జగన్ భజన చేయడమే కాకుండా, తెలుగుదేశం నాయకులను కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతూ వస్తున్న ‘పంచ్ ప్రభాకర్’ ఇప్పుడు జగన్ని తిట్టడం ప్రారంభించాడు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ మరోసారి జైలు పాలయ్యారు. బెయిల్ పై బయటకొచ్చి ఆయన ప్రజా మద్దత్తు ఉంటే మళ్లీ జైలుకు వెళ్లనని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ పాత్ర కీలకమే అయినప్పటికీ పదేళ్ల తర్వాత ఆయన స్థితి పూర్తిగా దిగజారిపోయింది. పదేళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ కెసీఆర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది.
తెలంగాణ రాష్ట్రం దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న శుభవేళ రాష్ట్ర మంతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ని ‘తెలంగాణ జిన్నా’ అని అభివర్ణించారు.
హైదరాబాద్తో ఆంధ్రప్రదేశ్కి బంధం నేటితో తెగిపోనుంది..
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఎపి కూడా నైరుతి రుతు పవనాలు రానున్నాయని సంకేతాలు అందుతున్నాయి.
ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలతో పల్నాడు అట్టుడికి పోయింది. ముఖ్యంగా మాచర్లలో అల్లర్లు దేశం యావత్ దృష్టికి వచ్చాయి. మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎం ను ధ్వంసం చేసి వార్తల్లో వ్యక్తి అయ్యారు.
ప్రత్యేక తెలంగాణ బిల్లు కాంగ్రెస్ పెడితే బిజెపి ఆమోదించింది. పదేళ్ల తర్వాత జరుపుకుంటున్న తెలంగాణ అవతరణ దినోత్సవాలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. మెజారిటీ మార్కుకు అవసరమైన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఏకగ్రీవంగా పది స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. 33 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినట్లు ఈసీ ప్రకటించింది.
వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. నేటి అర్ధరాత్రి నుంచి టోల్ చార్జీలను పెంచుతున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్ హెచ్ఐఏ) ప్రకటించింది.
ఎపిలో త్రి కూటమి విజయం తథ్యమని ముందు నుంచి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో బోణి కొట్టిన బిఆర్ఎస్
నిరుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన బిఆర్ఎస్ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బోణి కొట్టింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు రెండు రోజుల ముందు వచ్చిన ఫలితాల్లో గులాబి జెండా రెపరెపలాడటం అధికార పార్టీకి మింగుడు పడటం లేదు.