Publish Date:Jun 18, 2022
పుస్తకాలు చదివే అలవాటున్నవాళ్లు వాళ్లకు నచ్చిన పుస్తకాన్ని లైబ్రరీ నుంచి ఇంటికి తీసుకువెళ్లి చదివి వెంటనే తిరిగి ఇచ్చేస్తుంటారు. మహా అయితే అప్పుడప్పుడు ఒకటి రెండురోజులు ఆలస్యం జరగవచ్చు. వేరే పనిలో పడి మర్చిపోయానని సదరు పాఠకుడు ఆనక చెప్ప వచ్చు. కానీ కెనడా వాంకోవర్ లైబ్రరీ విషయంలో గొప్ప వింతే జరిగింది. ఒక పుస్తకం ఏకంగా 51 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చింది, అదీ సారీ మరోలా అనుకోవద్దన్న చిన్న లెటర్తో పాటు!
మన వూళ్లలా కాదు అక్కడ పుస్తకం ఇవ్వడంలో ఆలస్యం చేస్తే పుస్తకం అద్దతో పాటు అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. కానీ ఈ మహాశయుడు ఎవరోగానీ, ఆ అదనపు ఛార్జీలను తప్పించుకోవడానికి లైబ్రరీ వారికి ఒక వుత్తరం పెట్టా డు. ఇన్నాళ్ల జాప్యం వూహించనిదని, తనను క్షమించమని ఆ లేఖ సారాంశం! చిత్రంగా వుంది గదూ! ఈ వుత్తరం చదివిన తర్వాత ఆ లైబ్రరీ వారు హాయిగా నవ్వుకున్నారు. పోయిందేమో అనుకున్న పుస్తకం చక్కగా తిరిగి వచ్చినందుకు!
ఇక ఆ పాఠకుడు మంచి మనసుతో తన తప్పు తెలుసుకుని మరీ క్షమించాలని కోరడంతో అదనపు ఛార్జీలు వసూలు మాట వదిలేసేరు! వాంకోవర్ లైబ్రరీ వారు తమ ఇన్స్టా గ్రామ్ అకౌంట్లో ఒక బొమ్మను పెట్టారు. 51 ఏళ్ల తర్వాత లైబ్రరీకి ఎంతో భద్రం గా తిరిగి వచ్చిన పుస్తకం అని! హెన్రీ ఎడ్వర్డ్ నీల్ అనే ఆయన రాసిన ది టెలిస్కోప్ అనే పుస్తకం అది. పుస్తకం మీద చివరిగా చదువరికి ఇచ్చిన తేదీ 1971 ఏప్రిల్ 20 అని స్టాంప్ కూడా వేసి వుంది. బొమ్మలో స్టాంప్ పైన 5 సెంట్లు చెల్లించవలసి వుంది అని పేర్కొన్నారు. కానీ ఈ అదనపు ఛార్జీలు లైబ్రరీ తొలగించేసి చాలా కాలమయింది కూడా!
ఇన్స్టా గ్రామ్లో ఈ పుస్తకం బొమ్మను చూసిన నెటిజన్లు ఎంతో ఆశ్చర్యపోతూ కామెంట్లు పెట్టారు. ఈ ఫోటో ద్వారా తమకు అసలీ లైబ్రరీ సౌత్ హిల్ లైబ్రరీ 51 సంవత్సరాల పాతది అని తెలిసిందని! నిజమేనా? అనీ అడుగుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/a-book-was-returned-to-libraury-after-51-years-25-137909.html
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.