తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న పెద్ద పులి

Publish Date:Dec 2, 2024

Advertisement

 తెలుగు రాష్ట్రాలకు పెద్ద పులి భయం పట్టుకుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి మాసాలలో  మగపెద్ద పులులు ఆడపులుల కోసం వెతుకుతుంటాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి మగ పెద్ద పులులు తెలుగు రాష్ట్రాలో ఎంటర్ అయినట్టు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు.  పులులు గత రెండు రోజులుగా  ఎపిలోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి , సంతబొమ్మాళి మండలాల్లో బెంగాల్ టైగర్ సంచారంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పొడుగుపాడు సమీపంలో రోడ్డు దాటుతుండగా పులిని గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సమీప ప్రాంతాల్లో పులి ఆనవాళ్లు గుర్తించిన అటవీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. కాగా, ఇటీవలే ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లో పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. ఓ యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన మరువకముందే సంతబొమ్మాళి మండలం హనుమంతునాయుడుపేట పంచాయతీలో ఓ ఆవుపై దాడి చేసి చంపేసింది.ఈ క్రమంలో టెక్కలి  నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పులి జాడ కోసం అటవీ సిబ్బంది గాలింపు ముమ్మరం చేశారు. ఒంటరిగా రాత్రి పూట ఎవరూ బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. పులిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. పెద్ద పులి భయంతో సాయంత్రమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనం వణుకుతున్నారు. అటు, పులి సంచారంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల్లో పెద్ద పులి ఆనవాళ్లు గుర్తించామని.. ఒడిశా నుంచి పులి టెక్కలి వైపు వచ్చి ఉంటుందని అటవీ అధికారులు మంత్రికి వివరించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లకుండా అవగాహన కల్పించాలని సూచించారు. మంత్రి ఆదేశాలతో గ్రామాల్లో చాటింపు వేయించిన అధికారులు.. కరపత్రాలు పంపిణీ చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని.. గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు.అటు, తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ కొన్ని రోజులుగా పులులు స్వైర విహారం చేస్తున్నాయి. పశువుల మందలపై దాడులు చేస్తూ వచ్చాయి. చివరకు పత్తి ఏరుతున్న ఓ యువతిపై దాడి చేసి చంపేసింది. కుమ్రం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మి   మరో ఆరుగురు మహిళలతో కలిసి నజ్రుల్‌నగర్ గ్రామ శివారులోని చేనులోకి పత్తి ఏరేందుకు వెళ్లారు. కొంతసేపటికే చేనులోకి వచ్చిన పెద్దపులి మహిళపై దాడి చేసి నోట కరచుకుని వెళ్లింది. అక్కడున్న వారు కేకలు వేయడంతో ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. స్థానికులు తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.ఈ ఘటనతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. కాగజ్‌నగర్‌ మండలంలో ఆంక్షలు విధించారు. దాదాపు పది, పదిహేను గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు.

By
en-us Political News

  
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.