దుబాయ్‌లోని 8 మంది ధనవంతులు...!!

Publish Date:Nov 12, 2020

Advertisement

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ఒకటైన దుబాయ్  చిన్నదేశమే అయినా సంపన్న దేశంగా గుర్తింపు పొందింది. దుబాయ్ లో వలసవాసులుగా భారతీయులు అందులో తెలుగువారు ఎక్కువగా ఉంటారు. ఈ దేశంలో ఉన్న సంపన్నుల జాబితాలో ఉన్నవారిలో భారతీయుులు, భారతీయ సంతతికి చెందిన వారి సంఖ్య  ఎక్కు వే ఉంది.


1. ఉస్సేన్ సేజ్వాని (Hussain Sajwani)

అతని మొత్తం ఆస్తుల విలువ. 2.1 బిలియన్ డాలర్లు. సేజ్వాని, 2002 లో 'డమాక్ ప్రాపర్టీస్' అనే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీ  స్థాపించాడు. అప్పటి నుండి ఇది యూరోప్ లో తన వ్యాపారాన్ని విస్తరించి ప్రముఖ సంస్థగా ఎదిగింది. సేజ్వాని రియల్ ఎస్టేట్ రంగంలో సాధించిన ప్రగతికి గాను అతన్ని అరేబియా బిజినెస్ రియల్ ఎస్టేట్ అవార్డులతో, అలాగే రియల్ ఎస్టేట్ లెజెండ్ బిరుదుతో సత్కరించారు. అలాగే 2018 సంవత్సరంలో గల్ఫ్  బిజినెస్ అవార్డులతో పాటు ఆ సంవత్సరపు రియల్ ఎస్టేట్ బిజినెస్ లీడర్ గా ఎన్నికైనాడు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడి జాబితాలో అతని స్థానం 962.

2. సన్నీ వర్కీ.(Sunny Varkey)

ఇతని మొత్తం ఆస్తుల విలువ 2.6 బిలియన్ డాలర్లు. భారతీయుడైన సన్నీ బిలియనీర్ల జాబితాలో  స్థానాన్ని సంపాదించుకున్నాడు. జేమ్స్  విద్యా సంస్థలకు అధిపతిగా ఉన్న ఆయన ప్రపంచవ్యాప్తంగా 250 పాఠశాలలను నిర్వహిస్తున్నాడు. అలాగే  ప్రపంచంలోని అతిపెద్ద k-12 పాఠశాలలను నడుపుతున్నాడు.   అతన్ని 2007 సంవత్సరపు అత్యుత్తమ ఆసియా వ్యాపారవేత్త తో సహా అనేక అవార్డులతో సత్కరించారు. అలాగే 2012లో మిడిల్ ఈస్ట్ ఎక్సలెన్స్  సీఈవో గా ఎడ్యుకేషన్ బిజినెస్ లీడర్ గా అవార్డులు సొంతం చేసుకున్నాడు. విద్యా రంగంలో చేసిన కృషికి ఆయనకు అవార్డులు లభించాయి.

3. అబ్దుల్ బిన్ అహ్మద్ అల్ ఘురైర్(Abdulla Bin Ahmad Al Ghurair) 

ఇతని మొత్తం ఆస్తుల విలువ 4.9 బిలియన్ డాలర్లు.  మాష్రేక్‌బ్యాంక్‌ను స్థాపించాడు. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ప్రముఖ బ్యాంకులలో ఒకటి.  దుబాయ్ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.

4. బి.ఆర్. షెట్టి.  (B.R.Shetty)

ఇతని ఆస్తుల విలువ 2.6 బిలియన్ డాలర్లు. భారతీయ మూలాల కలిగిన దుబాయ్ వ్యాపారవేత్త. దుబాయ్ లో అనేక వ్యాపారాలను సొంతం చేసుకున్నాడు.  ఆరోగ్య సంరక్షణ , ఆర్థిక సేవల సామ్రాజ్యానికి అధిపతి అయిన ఇతనికి బి.ఆర్. లైఫ్, ఎన్ఎంసి హెల్త్ కేర్, ఫైనాబీఆర్ హోల్డిగ్ వంటి కంపెనీలు ఉన్నాయి.  తన సంపదలో సగం సేవా కార్యకలాపాలను విరాళంగా ఇచ్చే విషయంపై 2018లో అతను సంతకాలు చేసి తనలో నిజమైన మానవత్వం ఉందని నిరూపించుకున్నాడు. 

5. సైఫ్ అల్ ఘురైర్ (Saif Al Ghurair)

ఇతని  ఆస్తుల నికర విలువ 1.7 బిలియన్.  ప్రపంచంలోని టాప్ 500 ధనవంతులలో తన పేరును నమోదు చేసుకున్నాడు. అతను యుఎఇలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్,  ప్రొడక్షన్  సంస్థలలో ఒకటైన అల్ ఘురైర్ గ్రూపుకు అధిపతి.  యాష్రెడ్‌లో కొన్ని పెట్టుబడులను కలిగి ఉన్నాడు, ఇది యుఎఇలో ప్రైవేటు ఆధీనంలో ఉన్న పురాతన బ్యాంకు.

6. మిక్కీ జగ్టియాని.(Micky jagtiani)

ఇతని ఆస్తుల విలువ 3.1 బిలియన్ డాలర్లు. ఈ స్థాయికి చేరుకోవడానికి అతను ఎన్నో కష్టనష్టాలను అనుభవించాడు. అట్టడుగు నుండి అత్యున్నత స్థానం వరకు సాగింది అతని ప్రస్థానం. లండన్ లో టాక్సీ డ్రైవర్‌గా తన క్యారియర్‌ను ప్రారంభించిన అతను 1973 సంవత్సరంలో యుఎఇకి వచ్చాడు. బహ్రెయిన్‌లో 10 సంవత్సరాలు బేబీ ప్రొడక్ట్ షాపును నడిపి, తరువాత దానిని మరింత విస్తరించాలని నిర్ణయించుకొని ఆ వ్యాపారాన్ని 6 షాపుల వరకు విస్తరించాడు.

గల్ఫ్  యుద్ధం ప్రారంభమైన తరువాత, అతను ప్రస్థానం కొనసాగింది. ల్యాండ్‌మార్క్ గ్రూప్ అనే కార్పొరేషన్‌ను స్థాపించాడు . అది కాస్త  ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ , ఫర్నిచర్ వంటి ఇతర వ్యాపారాలను విస్తరించింది. దాంతో మిక్కీ  సంపన్నుల జాబితాలో చేరాడు.   ఫోర్బ్స్  జాబితా ప్రకారం ప్రపంచంలోని ధనవంతుల్లో ఇతను 478 వ స్థానంలో ఉన్నాడు.

7. ఎం.ఏ.యూసుఫ్ అలీ(M.A.Yusuff Ali)

ఇతని ఆస్తుల విలువ 3.7 బిలియన్ డాలర్లు. అతను లులు గ్రూప్ ఇంటర్నేషనల్ అధిపతి. భారతదేశంలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టిన వ్యాపారవేత్త. తన వాణిజ్యవ్యాపారాలను అంతకంతకు పెంచుకుంటూ సంపన్నుల జాబితాలో చేరాడు.

8. రవి పిళ్ళై. (Ravi Pillai)

ఇతని ఆస్తుల విలువ 4.2 బిలియన్ డాలర్లు. ఇతను కేరళకు చెందిన వ్యక్తి. దురదృష్టవశాత్తు అతని వ్యాపారం క్షిణించడంతో  దుబాయికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అక్కడి స్థానిక భాగస్వామి సహాయంతో ఒక చిన్న వాణిజ్య వ్యాపారాన్ని ప్రారంభించాడు. రెండు సంవత్సరాలల్లో అతని వ్యాపారం అపారంగా పెరిగింది. రవి పిళ్ళై  కొత్తగా నాజర్ ఎస్.హాల్.హజారే కార్పొరేషన్ (NSH) ను స్థాపించాడు. దుబాయ్ లోని ధనవంతుల జాబితాలో చేరాడు. 
 

By
en-us Political News

  
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.