Publish Date:May 10, 2024
జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే, రాష్ట్రంలో పెన్షన్లు తీసుకుంటున్న పేదలు ఒక్కొక్కరికి రాబోయే అయిదేళ్లలో 57 వేల రూపాయలు నష్టపోతారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వీఆర్ శ్రీలక్ష్మీ శ్యామల చెబుతున్నారు. మహిళ ఓటర్లతో 27 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో బైక్ ర్యాలీలు నిర్వహించి ప్రచారం నిర్వహించారు.
అధికారంలోకి వస్తే చంద్రబాబునాయుడు ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి పింఛనును 4000 చేస్తానని ప్రకటించారు. జులై నెలలో అరియర్స్ కలిపి 7వేల రూపాయల పింఛన్లు అందుకుంటారు.
జగన్ సర్కారు ప్రస్తుతం కేవలం మూడువేల పెన్షను మాత్రమే అందిస్తోంది. జగన్ తన మేనిఫెస్టోలో అయిదేళ్లకూ కలిపి 500 మాత్రం పెంచేలా హామీ ఇచ్చారు. అది కూడా.. 2028 ఏప్రిల్లో 250, 2029 ఏప్రిల్లో అంటే జస్ట్ ఎన్నికలకు ముందు మరో 250 పెంచుతానని పేర్కొన్నారు. అంటే జగన్ ను గెలిపిస్తే ఇప్పుడున్న మూడు వేలు మాత్రం ప్రజలకు అందుతాయన్నమాట.
ఇటు చంద్రబాబు, అటు జగన్ హామీలను పోల్చి చూస్తే..చంద్రబాబు ఇచ్చేది అయిదేళ్లలో రూ.2.40 లక్షలు. జగన్ ఇచ్చేది అయిదేళ్లలో రూ.1.83 లక్షలు. తేడా 57 వేలు. అంటే ఇప్పుడు పెన్షన్లు తీసుకుంటున్న వృద్ధులు, వితంతువులు ఎవ్వరైనా సరే.. ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే గనుక.. రాబోయే అయిదేళ్లలో అచ్చంగా 57 వేల రూపాయలు కోల్పోబోతున్నారని శ్రీలక్ష్మీ శ్యామల ప్రచారం చేస్తున్నారు.
జగన్పై కేసులు కావొచ్చు, ఇతర స్వార్థ ప్రయోజనాలు కావొచ్చు ఇన్నేళ్లుగా కేంద్రంలోని ఎన్డీయే కూటమి సర్కారుకు, ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ వంగి వంగి దండాలు పెట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడూ ప్రశ్నించని ఆయన సొంత పనులే చూసుకున్నారు. రాష్ట్రానికి దక్కాల్సిన ప్రత్యేక హోదా, పోలవరం నిధులు తదితర వాటి గురించి కూడా కేంద్రాన్ని ప్రశ్నించలేకపోయారు. ఏమైనా అడిగితే జైల్లో వేస్తారేమో అన్న భయమే అందుకు కారణమంటారు శ్రీలక్ష్మీ శ్యామల. ఆకువేడు ఉండి నియోజకవర్గంలో ఆమె రఘురామకృష్ణ రాజు తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. రఘురామకృష్ణంరాజు తన గెలుపు పక్కా ..మెజార్టీ లెక్కేసుకోవడం మిగిలింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/57-39-175573.html
కల్వకుంట్ల కవిత ఇప్పుడప్పుడే జైలు నుంచి బయటకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం తీహార్ జైల్లో వున్న కవిత రిమాండ్ని జులై 3వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ ను పూర్తిగా తిరస్కరించారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగిలిన దాఖలాలు లేవు. విభజన తరువాత జరిగిన తొలి రెండు ఎన్నికలలోనూ జీరో స్థానాలతో రిక్త హస్తాలతో మిగిలిన పార్టీ.. 2024 ఎన్నికలలో మాత్రం రాష్ట్రంలో పూర్వ వైభవం కోసం కాకపోయినా.. ఉనికి చాటుకోవడానికి చాలా చాలా కష్టపడింది.
తెలంగాణ సాధించిన పార్టీగా పదేళ్ల పాటు రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పిన బీఆర్ఎస్ ఇప్పుడు పరిపూర్ణంగా పతనమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది చివరిలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పరాజయంతో ప్రారంభమైన బీఆర్ఎస్ పతనం లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత పరిపూర్ణమౌతుందని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితం ఎలా ఉండబోతోందో సంకేతాలిచ్చేశాయి. ఇక మంగళవారం (జూన్ 4) అధికారికంగా ఫలితాలు వెల్లడి అవుతాయి.
తెలుగుదేశం కేడర్ తన ప్రత్యేకతను మరోసారి నిరూపించుకుంది. గత పదేళ్లుగా తెలంగాణలో పార్టీ దాదాపు నామమాత్రపు కార్యక్రమాలకే పరిమితమైనా, పార్టీ తరఫున పదవులు, హోదాలు అనుభవించిన నేతలు గోడ దూకేసి పక్క పార్టీలకు వలస వెళ్లిపోయానా.. క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
రిజల్ట్స్ కౌంట్డౌన్ కొటేషన్-1
ఇంతకాలం అమెరికాలో వుండి జగన్ భజన చేయడమే కాకుండా, తెలుగుదేశం నాయకులను కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతూ వస్తున్న ‘పంచ్ ప్రభాకర్’ ఇప్పుడు జగన్ని తిట్టడం ప్రారంభించాడు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ మరోసారి జైలు పాలయ్యారు. బెయిల్ పై బయటకొచ్చి ఆయన ప్రజా మద్దత్తు ఉంటే మళ్లీ జైలుకు వెళ్లనని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ పాత్ర కీలకమే అయినప్పటికీ పదేళ్ల తర్వాత ఆయన స్థితి పూర్తిగా దిగజారిపోయింది. పదేళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ కెసీఆర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది.
తెలంగాణ రాష్ట్రం దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న శుభవేళ రాష్ట్ర మంతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ని ‘తెలంగాణ జిన్నా’ అని అభివర్ణించారు.
హైదరాబాద్తో ఆంధ్రప్రదేశ్కి బంధం నేటితో తెగిపోనుంది..
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఎపి కూడా నైరుతి రుతు పవనాలు రానున్నాయని సంకేతాలు అందుతున్నాయి.