Publish Date:May 30, 2021
ఆయనకు 56. ఆమెకు 33. ఇద్దరి మధ్య 23 ఏళ్ల తేడా. అయితేనేం? అతగాడు ఏకంగా ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్. ఆమె కేరీ సైమండ్స్. అవును, వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. కరోనా టైమ్లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు గ్రేట్ బ్రిటన్లో వైరల్గా మారింది. ప్రైమినిస్టర్ పెళ్లిపై విస్తృత చర్చ జరుగుతోంది.
వయసు శరీరానికి మాత్రమే కానీ మనసుకు కాదు అని వాళ్లిద్దరూ బలంగా నమ్మారు. కొంతకాలంలో వాళ్లు ప్రేమలో ఉన్నారు. శనివారం లండన్లోని ఓ చర్చిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం మీడియాలో రావడంతో ఇంగ్లండ్ వాసులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.
వాళ్ల పెళ్లికి సంబంధించి ఒకే ఒక్క ఫోటో బయటకి వచ్చింది. ఆ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈడూ-జోడూ సంగతి పక్కనపెడితే.. వాళ్లిద్దరి మధ్య 20 ఏళ్లకు పైగా ఏజ్ గ్యాప్ ఉన్నా.. పెళ్లి డ్రెస్లో వాళ్లిద్దరూ బ్యూటిఫుల్గానే కనిపిస్తున్నారు. గుడ్ లుకింగ్ కపుల్స్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ఈ పెళ్లితో యూకే చరిత్రలోనే బోరిస్ జాన్సన్ ఓ ఆసక్తికర రికార్డు నెలకొల్పడం విశేషం. సుమారు 200 ఏళ్లలో ప్రధాని పదవిలో ఉండగా పెళ్లి చేసుకున్న తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించడం ఆసక్తికరం.
బోరిస్ జాన్సన్కు ఇది ముచ్చటగా మూడో పెళ్లి. కేరీ సైమండ్స్కి మాత్రం ఇదే తొలి వివాహం. ప్రస్తుతం సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నా.. త్వరలోనే ఈ జంట.. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో గ్రాండ్ వెడ్డింగ్ పార్టీ చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 56 ఏళ్ల యూకే ప్రధానికి, 33 ఏళ్ల అమ్మాయితో పెళ్లి కావడం చూసి.. ఎంతవారు కానీ కాంత దాసులే.. అనే కొటేషన్ గుర్తొస్తోందని అంటున్నారు నెటిజన్స్.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/56-years-old-uk-pm-secretly-marries-33-years-young-lady-25-116598.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.