జోన్లు తేలకుండా, టెట్ లేకుండా భర్తీ ఎలా? ఓట్ల కోసం కేసీఆర్ మరో మోసమా? 

Publish Date:Dec 14, 2020

Advertisement

తెలంగాణలో ఖాళీగా ఉన్న దాదాపు 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల నియమాకాలకు వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎక్కడైన ఉద్యోగ ప్రకటన వస్తే నిరుద్యోగులు సంతోషపడతారు. ఖాళీలు భర్తీ చేస్తామన్న సర్కార్ కు కృతజ్ఞతలు చెబుతారు. కాని తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సీన్ రివర్స్ గా ఉంది. ముఖ్యమంత్రే స్వయంగా ఉద్యోగ ప్రకటన చేసినా నిరుద్యోగులు మండిపడుతున్నారు. విద్యావేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం ప్రకటనను జనాలు కూడా నమ్మడం లేదు. తమను సీఎం మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యకం చేస్తున్నారు ఉద్యోగాల కోసం ప్రీపేరవుతున్న అభ్యర్థులు. ఓట్ల కోసం మరోసారి కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

 

ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్ చెప్పినా నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత రావడానికి బలమైన కారణాలే ఉన్నాయి. ఉద్యోగ ఖాళీల భర్తీపై ముఖ్యమంత్రే ప్రకటన పలు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా జోనల్ కేడర్ తేల్చకుండా పోస్టులను ఎలా నియమిస్తారన్న ప్రశ్న అన్ని వర్గాల నుంచి వస్తోంది. రాష్ట్రంలో జోన్ల సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జోన్లను పునర్ వ్యవస్థికరిస్తూ కేసీఆర్ సర్కార్ తీసుకున్న విధాన పరమైన నిర్ణయం ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో రాష్ట్రంలో మల్జీ జోనలో పోస్టులేంటీ, జోనల్ పోస్టులేంటీ, డిస్ట్రిక్ లెవల్ కేడర్ ఏంటో తేలలేదు. ప్రెసిడెన్షియల్ రూల్ ప్రకారం ఉండాల్సిన పోస్టుల సంగతి తేలలేదు. జోనల్ సిస్టమ్ లో క్లారిటీ లేకనే.. కేసీఆర్ సర్కార్ ఇంతవరకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. గ్రూప్ 2 ఇచ్చి కొన్ని పోస్టులకు నియామక ప్రక్రియను చేపట్టినా.. వారికి ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. జోనల్ , మల్జీ జోనల్ కేడర్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఉద్యోగం వచ్చి  ఏండ్లు గడుస్తున్నా కొలువులో చేరలేకపోతున్నారు గ్రూప్ 2 విజేతలు.  

 

జోన్ల ఇష్యూ పరిష్కరించకుండా జేఎల్,డీఎల్ వాంటి ఉద్యోగాల భర్తీ అసాధ్యం. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ ప్రకటనపై విద్యా వేత్తలు, నిరుద్యోగ అభ్యర్థులు మండిపడుతున్నారు. జోన్లపై సర్కార్ క్లారిటీ ఇవ్వకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిడం మోసపూరితమేనని వారంతా ఆరోపిస్తున్నారు. ఇవేవి తేల్చకుండా సర్కార్ ముందుకు పోయినా.. ఎవరో ఒకరు కోర్టుకు వెళితే నియామక ప్రక్రియ ఆగిపోవడం ఖాయమంటున్నారు.  తెలంగాణ వచ్చాకా కేసీఆర్ సర్కార్ నిర్వహించిన పరీక్షల్లో చాలా వరకు కోర్టు కేసులతోనే నిలిచిపోయిన విషయాన్ని నిరుద్యోగులు గుర్తు చేస్తున్నారు. ఇదే విషయాన్నిప్రస్తావిస్తూ ప్రభుత్వంపై నిరుద్యోగ అభ్యర్థులు ఫైరవుతున్నారు. పోలీసు నియామకాల్లోనూ జోనల్ సిస్టమ్ పెద్ద సమస్యగా మారింది. డీఎస్పీ, సీఐ పోస్టులపై స్పష్టత రాక ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు, ఈ సమస్య వల్లే పోలీస్ శాఖలో చాలా కాలంగా ప్రమోషన్లు నిలిచిపోయాయని చెబుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించిన ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాల్లో అర్హులుగా ఎంపికై ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి కూడా ఇంకా పోస్టింగులు ఇవ్వడం లేదు. 

 

ఇక కేసీఆర్ ప్రకటించిన ఉపాద్యాయ పోస్టుల నియామకంలో పెద్ద గందరగోళమే ఉంది.  టీచర్ పోస్టుకు కనీస అర్హత అయిన టెట్  ఎగ్జామ్ నిర్వహించకుండా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ఎట్లా అన్న చర్చ వస్తోంది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరేండ్లలో కేవలం రెండుసార్లే .. 2016 మే 22న, 2017 జులై 23న టెట్ నిర్వహించారు. ఒకసారి టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థికి ఏడేండ్ల వరకు కాల పరిమితి ఉంటుంది. ఆ గడువు దాటితే మళ్లీ టెట్‌ పరీక్ష రాయాలి. ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం ఏటా రెండుసార్లు నిర్వహించాలి. కాని తెలంగాణ విద్యాశాఖ మాత్రం తాము ఏడాదికి ఒక్కసారే నిర్వహించేలా 2015లో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారమైనా 2018, 2019, 2020లో మూడు సార్లు నిర్వహించాల్సి ఉన్నా పరీక్ష జరపలేదు.  ఇప్పటికే గడువు తీరిన ఐదు లక్షల మంది అభ్యర్థులు టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. టెట్ నిర్వహించని కారణంగా 2018, 2019, 2020లో బీఈడీ, టీటీసీ పూర్తి చేసిన అభ్యర్థులు టెట్ రాయలేదు. మొత్తంగా ఆరేడు లక్షల మంది బీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులు.. సర్కార్ ఎగ్జామ్ పెట్టకపోవడం వల్ల టెట్ కు దూరమయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం టీఆర్టీ నిర్వహిస్తే..  వీరంతా ఆ పరీక్ష రాసే అవకాశం కోల్పోతారు. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే టీచర్ల పోస్టుల నియామకం జరగడమన్నది జరిగే పని కాదంటున్నారు విద్యా రంగ నిపుణులు, నిరుద్యోగ అభ్యర్థులు. 

 

తెలంగాణ ఏర్పాటు తర్వాత డీఎస్సీని ప్రభుత్వం టీచర్ రిక్రూట్ మెంట్ గా మార్చేసింది. టీఎస్ పీఎస్సీ ద్వారా ఒక్కసారే టీచర్ పోస్టులను భర్తీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,792 టీచర్ పోస్టుల భర్తీకి 2017, అక్టోబర్‌ 21న టీఆర్టీ నోటిఫికేషన్‌ ఇవ్వగా కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో నియామక ప్రక్రియలో  జాప్యం జరిగింది. అనేక ఆందోళనల అనంతరం పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. గత ఆరేండ్ల లో వేలాది మంది టీచర్లు రిటైర్డ్ అయినప్పటికీ మళ్లీ టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి టెట్‌ స్కోర్‌ కాలపరిమితిని ఏడేళ్లకు బదులు జీవితకాలం ఉండేలా ఇటీవలే నిర్ణయించింది. అయితే ఇక నుంచి టెట్‌ రాసి, ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులకే ఇది వర్తిస్తుంది. ఇప్పటికే ఉత్తీర్ణులైన వారికి న్యాయనిపుణుల సలహా తీసుకొని దాన్ని పాటిస్తామని ఎన్‌సీటీ ప్రకటించింది. కాని దానిపై ఇంకా తుది నిర్ణయం రాలేదు. అది వస్తే గాని తెలంగాణలో డీఎస్సీ నిర్వహించడం కుదరదు. టీఆర్టీ పెట్టే ఉద్దేశం లేకనే ప్రభుత్వం అంతకాలం టెట్ ను నిర్వహించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. టెట్ లేకుండానే  సర్కార్ టీఆర్టీ నోటిఫికేషన్ వేస్తే..  ఎవరో ఒకరు కోర్టుకు వెళ్లడం ఖాయం. అదే జరిగితే టీచర్ పోస్టుల నియామక ప్రక్రియ ఆగిపోతుందని నిరుద్యోగులు చెబుతున్నారు. 

 

ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఇన్ని జటిలమైన అంశాలు ఉన్నా కేసీఆర్ మాత్రం.. త్వరలోనే నోటిఫికేషన్లంటూ మోసం చేస్తున్నారని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగుల ఓట్ల కోసమే తాజా ప్రకటన వచ్చిందనే ఆరోపణలు వస్తున్నాయి. నిరుద్యోగులు, యువత టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారంతా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండనున్నారని తెలుస్తోంది. అందుకే కేసీఆర్  ఉద్యోగ ప్రకటనల పేరుతో నిరుద్యోగులను, జనాలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తుందనే ఆరోపణలే ఎక్కువగా వస్తున్నాయి. ఓట్ల కోసం కుట్రలు చేస్తూ నిరుద్యోగులతో ఆటలాడవద్దని సీఎం కేసీఆర్ కు కొందరు హెచ్చరిస్తున్నారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.