మోదీ పాసవుతారా ఎన్నికల పరీక్ష

Publish Date:Jan 5, 2017

Advertisement

 

ఎన్నికల నగారా మరోసారి మోగింది. ఫిబ్రవరి 4 నుంచి మార్చి 8 వరకు దేశంలోని ఐదు రాష్ట్రాలలో పలు దఫాలుగా ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ పనితీరు మీదా, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మీదా, ప్రధానమంత్రిగా మోదీ పనితీరు మీదా ఈ ఎన్నికలు ఓ రెఫరెండం అని భావిచేవారు లేకపోలేదు. జరగబోయే ఎన్నికలన్నీ కూడా భాజపాకు కీలకమైన ప్రాంతాలలో కావడమే దీనికి కారణం.

 

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే ముందుగా అందిచూపు ఉత్తర్ప్రదేశ్ వైపే తిరిగింది. అఖిలేష్ నేతృత్వంలోని అక్కడి సమాజ్వాదీ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని అందరూ భావించినా... తండ్రితో సాగుతున్న అఖిలేష్ వైరం చివరికి బీజేపీకే లాభించేట్లు కనిపిస్తోంది. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్లుగా తండ్రీకొడుకులు పార్టీని పంచుకునేందుకు సాగిస్తున్న కొట్లాట బీజేపీకి ఉపయోగపడుతోందని తాజా సర్వేలు తేలుస్తున్నాయి. అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీలో కనుక చీలిక తథ్యమైతే, బీజేపీ విజయం కూడా తథ్యమని విశ్లేషకులు ఘోషిస్తున్నారు.

 

ఉత్తర్ప్రదేశ్లో భాజపాకు అనుకూలంగా ఉన్న గాలి ఉత్తరాఖండ్లో మాత్రం సెగలు కక్కుతోంది. కేంద్ర ప్రభుత్వం అక్కడ అన్యాయంగా రాష్ట్రపతి పాలనని విధించిందని అక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సాక్షాత్తూ సుప్రీం కోర్టే జోక్యం చేసుకుని అక్కడి కేంద్ర పాలనని ఎత్తివేయడంతో, బీజేపీకి తలకొట్టేసినట్లయ్యింది. దీనికి తోడు ఎలాగైనా అక్కడి ప్రభుత్వాన్ని తొలగించాలనే పట్టుదలతో ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యేలు పన్నిన తంత్రాలు కూడా అక్కడి ప్రజలకు ఏవగింపుని కలిగించాయి. శక్తిమాన్ అనే గుర్రం అక్కడి బీజేపీ చేతిలో బలైపోవడం కూడా వారి స్మృతిలో తాజాగానే ఉంది. దీంతో అక్కడ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా హరీష్ రావత్ తిరిగి అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

 

గోవాలో ప్రస్తుతం భాజపానే అధికారంలో ఉంది. అయితే అక్కడ కూడా ఆ పార్టీకి ఏమంత అనుకూలమైన పరిస్థితులు కనిపించడం లేదు. తమిళనాడు ప్రజలకి మల్లే గోవా ప్రజలకి కూడా మార్చి మార్చి పార్టీని ఎన్నుకునే అలవాటు ఉంది. పైగా అక్కడి ప్రస్తుత ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ ఏమంత సమర్థుడైన నాయకుడు కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది. పేరుకి పర్సేకర్ ముఖ్యమంత్రే అయినా ఆ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం కీలుబొమ్మలా మారిపోయిందన్న విమర్శలూ ఉన్నాయి.

 

ఒకవేళ అక్కడ బీజేపీ పెద్ద పార్టీగా అవతరించినా కూడా హంగ్ అసెంబ్లీ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.పంజాబ్లో కూడా బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ- అకాలీదళ్ కూటమి మరోసారి విజయాన్ని సాధిస్తుందా లేదా అన్నది అనుమానంగానే ఉంది. కొన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా వినిపిస్తున్నా, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవనుంది. ఇక మణిపూర్లో మరోసారి కాంగ్రెస్ జయకేతనం ఎగరవేయనుందంటూ స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.

 

ఇదీ స్థూలంగా ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలలోని పరిస్థితి. నిజానికి అధికారపరంగా 2016 బీజేపీకి ఏమంతగా కలిసిరాలేదు. ఆ ఏడాది ఎన్నికలు జరిగిన తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, పుదుచేరిలలో బీజేపీ ఓటమిపాలైంది. ఒక్క అసోంలో మాత్రమే కమలం వికసించింది. కాబట్టి ఎలాగొలా 2017లో జరగనున్న ఈ అసెంబ్లీ ఎన్నికలలో అయినా పట్టు బిగించాలని ఆ పార్టీ భావిస్తోంది.

 

అసలు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెనుక ఈ రాష్ట్రాలలో ప్రవహించనున్న దనాన్ని అదుపు చేయడం కూడా ఒక వ్యూహమంటూ విశ్లేషణలు వినవచ్చాయి. డిసెంబరు 31న జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కురిసిన వరాల జల్లు కూడా ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే అన్నవారూ లేకపోలేదు. ఇక ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తరువాత కూడా కేంద్రం తన బడ్జెటుని ప్రవేశపెట్టాలనుకోవడం కూడా బీజేపీకి లాభించే అంశమే! కేంద్రం ఊహించినట్లుగానే బడ్జెటుని ప్రవేశపెట్టే అవకాశం చిక్కితే అందులో ఇన్కమ్ టాక్స్ పరిమితుల పెంపు దగ్గర్నుంచీ సామాన్యులని ఊరించే సంస్కరణలు ఎన్నో కనిపించవచ్చు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.