ఆహారంలో ఇదొక్కటి లోపించడం వల్లే ఇరవై ఏళ్ళకే ముసలోళ్ళుగా కనబడుతున్నారు

Publish Date:Oct 27, 2023

Advertisement

మనిషిని బట్టి వయసు అంచనా వేస్తుంటారు చాలామంది.  ఈ అంచనాలో కొన్ని సార్లు నిండా 20ఏళ్ళు కూడా లేనివారు ఆంటీలు, అంకుల్స్ అనే ట్యాగ్ లోకి వెళతారు. చిన్న వయసులోనే ఇలా పిలవడం వల్ల మనసులో భోరుమని కుమిలిపోయేవారు చాలామంది ఉన్నారు. నేను ఆంటీలా కనబడుతున్నానా అని ముఖం మీద అనేసేవారు కూడా ఉన్నారు. అయితే ఇది ఎదుటివారి తప్పూ కాదూ, మీ వయసు తప్పూ కాదు. అక్కడున్న తప్పల్లా శరీర చర్మంలో వచ్చిన మార్పే. చిన్నవయసులో చర్మం ముడుతలు పడటం, బలహీనంగా మారటం, శరీరం కూడా వయసు మించినట్టు కనబడటం జరుగుతుంది. ఈ కారణం వల్లే అన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్య ఏర్పడటానికి శరీరంలో తీసుకునే ఆహారంలో ఒకే ఒకటి లోపించడం కారణమని ఆహార నిపుణులు చెబుతున్నారు. చిన్నవయసులోనే శరీరం ముసలిగా  మారకూడదంటే అవసరైన  పోషకం ఏంటి?  అది ఏ ఆహారాలలో లభిస్తుంది? పూర్తీగా తెలుసుకుంటే..

సాదారణంగా వయసు పెరిగేకొద్ది శరీరం ముసలిగా మారుతుంది. చర్మం యవ్వనంగా ఉండటానికి కారణమయ్యే కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోవడమే దీనికి ప్రధాన కారణం. చిన్నవయసులోనే కొల్లాజెన్ సరిగా ఉత్పత్తి కాకపోతే చిన్నవసులోనే ముసలివాళ్లుగా కనబడతారు. చిన్నవయసులో వృద్దాప్య సమస్యను అధిగమించాలంటే కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించే ఆహారాలను సమృద్దిగా తీసుకోవాలి.  కింది ఆహారాలు తీసుకుంటే శరీరానికి కొల్లాజెన్ సమృద్దిగా అందుతుంది. పైపెచ్చు ఇవి అందుబాటులో ఉండేవే. అవేంటో తెలుసుకుంటే..

టమోటా..

చర్మం వృద్దాప్యంలోకి జారుతుందనడానికి మొదటి సూచన ముఖంలోనే కనిపిస్తుంది. ముఖం మీది చర్మం ముడతలు పడుతూ ఉంటే వెంటనే టమోటా వినియోగం పెంచాలి. టమోటాలు తినడం వల్ల లైకోపీన్, కొల్లాజెన్ కంటెంట్ శరీరంలో పెరుగుతాయి.  ఇది ఒకరకమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది.

ఆకుపచ్చని కూరగాయలు..

కొల్లాజెన్ లోపాన్ని అధిగమించడానికి మాంసాహారులు, శాఖాహారులు కూడా తినగలిగే ఆహారం ఆకుపచ్చని కూరగాయలు. ఆకుపచ్చని కూరగాయలను సహజంగానే ఆరోగ్యానికి ఎంతో మంచివని అంటారు.  ఆకుకూరలలో పాలకూర, బ్రోకలి, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్న కూరగాయలు తీసుకోవడం వల్ల కొల్లాజెన్ పొందడం సులువు.

అరటిపండు..

బాగా ఆకలిగా ఉన్నప్పుడు భోజనం ఏమీ లేకపోయినా రెండు అరటిపండ్లు తిని గంటకు పైగా ఆకలిని అధిగమించవచ్చు. అరటిపండు కడుపునింపడంతో పాటు శరీరానికి ఆరోగ్యం చేకూరుస్తుంది. అయితే అరటిపండు తింటే వృద్దాప్యాన్ని కూడా జయించవచ్చు. అరటిపండులో కొల్లాజెన్ ఉంటుంది. ప్రతిరోజూ అరటిపండు తింటే కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది వృద్దాప్యాన్ని ఆమడదూరంలో ఉంచుతుంది.

పై మూడు రకాల పండ్లు, కూరగాయలను ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే కేవలం నెలరోజులలోపే ముడుతలు పడిన చర్మం యవ్వనంగా మారడం గమనిస్తారు. ఈ ఆహారాలు రోజువారి లైఫ్ స్టైల్ లో భాగం చేసుకుంటే యాబై ఏళ్ళు దాటినా యవ్వనంగా యూత్ లా కనిపిస్తారు.

                                                  *నిశ్శబ్ద.

By
en-us Political News

  
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని..
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై..
నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్..
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది.  ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు.  అయితే చాలామంది అల్పాహారంలో..
కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి....
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం..
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ ..
ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి...
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి...
AI..ప్రపంచం అంతా వాడుతున్న కృత్రిమ మేధస్సు ఇది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కృత్రిమ మేధస్సు వాడకం చాలా పెరిగింది.  ఏ చిన్న సందేహం వచ్చినా ఏఐ ని వాడటం, దాన్ని సలహాలు, సూచలు అడగడం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ళ నొప్పులు. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం మరియు సరైన పోషకాహారం..
వేసవి మొదలవ్వగానే తీవ్రమైన ఎండ , పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన రోజువారీ  కార్యకలాపాలు , ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలవుతుంది. ఈ రోజుల్లో బయట కొద్దిసేపు ఉన్నా కూడా శరీరం అలసిపోయేంత వేడిగా ఉంటుంది...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.