Publish Date:Oct 22, 2019
సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్ పల్లిలోని మల్లిఖార్జున నగర్ లో భారీ చోరీ జరిగింది. వడ్డీ వ్యాపారం చేసుకుంటున్న సరళ దంపతులు ఇంటికి తాళం వేసి పనిమీద బయటకి వెళ్ళారు. వేసిన తాళాలు వేసినట్టు ఉండగానే ఇంట్లోని బంగారు ఆభరణాలు,నగదు మాయం అయ్యాయి. ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి దుండగలు చోరీకి పాల్పడ్డారు. సుమారు మూడు కిలోల బంగారు ఆభరణాలు,వెండి,పధ్ధెనిమిది లక్షల నగదు దోచుకెళ్ళారు. ఇంట్లో ఉన్నది అంతా దోచుకు వెళ్ళటంతో సరళ దంపతులు తీవ్ర దిగ్బ్రాంతికి గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దొంగతనం జరిగిన తీరుపై క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు స్వీకరించారు. దొంగతనం చేసింది ఇంట్లో వాళ్ళా లేక బయటి వారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. సంఘటనా స్థలాన్ని బేగంపేట ఏసీపీ రామ్ రెడ్డి పరిశీలించారు. సోమవారం సాయంత్రం ఈ దొంగతనం జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు.
పోలీసులకి ఇంటి యాజిమాన్యం సమాచారం అంధించటంతోటి హుటా హూటీగా పోలీసులు సంఘటనా స్థలంకి చేరుకున్నారు. పోలీసులు దొంగతనానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు. సాయంత్రం ఆరు గంటల తరువాత దొంగతనం జరిగిందని తెలుసుకున్న పోలీసులు వివరాలను స్వేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంటికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు పరిశీలించారు. ఎక్కడా బ్రేక్ లు లేక పోవటం, తాళాలు పగలుగొట్టి లేకపోవటం ఇటువంటి వివరాలు అన్ని పరిశీలించిన తరువాత అసలు ఈ దొంగతనం ఇంటి దొంగల పనా లేక బయటి వాళ్ళు ఎవరైన వచ్చి చేశారన్నటువంటి కోణంలో పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎక్కడా కూడా తాళాలు పగలకొట్టినట్టు వంటి పరిస్థితి లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ విషయం పై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి నిందితుల పై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/3kg-gold-and-cash-robbed-at-old-bowenpally-25-90412.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.