Publish Date:Jan 13, 2025
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిల్చిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. ఆయన పరిస్థితి ఇపుడు కొరివితో తలగోక్కున్నట్టు తయారయ్యింది. తన పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ కౌశిక్ రెడ్డి దూకుడు తగ్గించుకోకపోవడంతో కొత్త చిక్కులు తెచ్చుకుంటున్నారు.
బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై మూడు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే పిఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
జిల్లా కలెక్టరేట్ లో అధికారిక కార్యక్రమంలో గందరగోళం సృష్టించి మీటింగ్ ను పక్కదారి పట్టించిన ఆరోపణపై కౌశిక్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. ఆర్డీవో మహేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఆదివారం నాడు కరీంనగర్ జిల్లా కలెక్ట రేట్ లో జరిగిన సమీక్షా సమావేశంలో రసాభాసాగా మారింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కౌశిక్ రెడ్డి పచ్చి బూతులు తిట్టారు. ఒక ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్ రెడ్డి మరో ఎమ్మెల్యేను ఉచ్చరించడానికి వీల్లేని పదజాలంతో తిట్టడం చర్చనీయాంశమైంది. వీరిరువు గతంలో మంచి స్నేహితులు. ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు. కానీ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని కౌశిక్ రెడ్డి సహించలేకపోతున్నారు. గతంలో ఎమ్మెల్యే అరికపూడి కాంగ్రెస్ కు దగ్గరైనప్పుడు పెద్ద గొడవ చేశారు. నానా బూతులు తిడుతూ వార్తలకెక్కారు. తాజాగా సంజయ్ కుమార్ తో అదే తరహా గొడవ చేశారు. వాగ్వాదంతో గొడవ ప్రారంభమై చిలికిచిలికి గాలి వానగా మారి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను గట్టిగా తోసేశారు కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు ఒకరినొకరు తోసుకోవడంతో కలెక్టరేట్ లో జరిగిన సమీక్షా సమావేంలో గందరగోళం ఏర్పడింది. ఆర్డీవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ కేసు నమోదైంది.
ఇక తన పట్ల అసభ్యపదజాలంతో దురుసుగా ప్రవర్తంచిన ఆరోపణపై కరీంనగర్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ సత్తు మల్లేషం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది.
కౌశిక్ రెడ్డిపై గత సంవత్సరం జులై ఒకటో తేదీన బిఎన్ఎస్ యాక్ట్ క్రింద కేసు నమోదైన సంగతి తెలిసిందే . ఇదే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 122 126(2) బిఎన్ఎస్ సెక్షన్ ల క్రింద కేసు నమోదు చేశారు. జిల్లా పరిషత్ మీటింగ్ లో ప్రభుత్వాధికారులను దూషించిన ఆరోపణ క్రింద కేసు నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వం అప్పట్లో కొత్తగా పరిచయం చేసిన క్రిమినల్ కోడ్ బిఎన్ ఎస్ క్రింద కేసు నమోదైన మొదటి పొలిటిషియన్ కూడా కౌశిక్ రెడ్డి కావడం గమనార్హం
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/3-cases-registered-against-brs-mla-padi-kaushik-reddy-39-191242.html
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్కు, మీమ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!