Publish Date:Jan 13, 2025
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిల్చిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. ఆయన పరిస్థితి ఇపుడు కొరివితో తలగోక్కున్నట్టు తయారయ్యింది. తన పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ కౌశిక్ రెడ్డి దూకుడు తగ్గించుకోకపోవడంతో కొత్త చిక్కులు తెచ్చుకుంటున్నారు.
బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై మూడు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే పిఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
జిల్లా కలెక్టరేట్ లో అధికారిక కార్యక్రమంలో గందరగోళం సృష్టించి మీటింగ్ ను పక్కదారి పట్టించిన ఆరోపణపై కౌశిక్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. ఆర్డీవో మహేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఆదివారం నాడు కరీంనగర్ జిల్లా కలెక్ట రేట్ లో జరిగిన సమీక్షా సమావేశంలో రసాభాసాగా మారింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కౌశిక్ రెడ్డి పచ్చి బూతులు తిట్టారు. ఒక ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్ రెడ్డి మరో ఎమ్మెల్యేను ఉచ్చరించడానికి వీల్లేని పదజాలంతో తిట్టడం చర్చనీయాంశమైంది. వీరిరువు గతంలో మంచి స్నేహితులు. ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు. కానీ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని కౌశిక్ రెడ్డి సహించలేకపోతున్నారు. గతంలో ఎమ్మెల్యే అరికపూడి కాంగ్రెస్ కు దగ్గరైనప్పుడు పెద్ద గొడవ చేశారు. నానా బూతులు తిడుతూ వార్తలకెక్కారు. తాజాగా సంజయ్ కుమార్ తో అదే తరహా గొడవ చేశారు. వాగ్వాదంతో గొడవ ప్రారంభమై చిలికిచిలికి గాలి వానగా మారి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను గట్టిగా తోసేశారు కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు ఒకరినొకరు తోసుకోవడంతో కలెక్టరేట్ లో జరిగిన సమీక్షా సమావేంలో గందరగోళం ఏర్పడింది. ఆర్డీవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ కేసు నమోదైంది.
ఇక తన పట్ల అసభ్యపదజాలంతో దురుసుగా ప్రవర్తంచిన ఆరోపణపై కరీంనగర్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ సత్తు మల్లేషం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది.
కౌశిక్ రెడ్డిపై గత సంవత్సరం జులై ఒకటో తేదీన బిఎన్ఎస్ యాక్ట్ క్రింద కేసు నమోదైన సంగతి తెలిసిందే . ఇదే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 122 126(2) బిఎన్ఎస్ సెక్షన్ ల క్రింద కేసు నమోదు చేశారు. జిల్లా పరిషత్ మీటింగ్ లో ప్రభుత్వాధికారులను దూషించిన ఆరోపణ క్రింద కేసు నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వం అప్పట్లో కొత్తగా పరిచయం చేసిన క్రిమినల్ కోడ్ బిఎన్ ఎస్ క్రింద కేసు నమోదైన మొదటి పొలిటిషియన్ కూడా కౌశిక్ రెడ్డి కావడం గమనార్హం
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/3-cases-registered-against-brs-mla-padi-kaushik-reddy-39-191242.html
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం లాంటి అంశాలపై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.