పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రాణాలను కోల్పోతున్న ఆందోళనకారులు

Publish Date:Dec 20, 2019

Advertisement

పౌరసత్వ సవరణ బిల్లు పై పోలీసులకి, వ్యతిరేకిస్తున్న నేతల మధ్య అగ్గి రాజేసుకుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. బీజేపీ పాలిత కర్ణాటకలోని మంగళూరులో నిరసనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులకు బుల్లెట్ గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి మంగళూరు నార్త్ పోలీస్ స్టేషన్ ముట్టడించటం సహా పలు పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టినందునే కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఈ నెల 22 అర్ధరాత్రి వరకు మంగళూరులో కర్ఫ్యూ విధించి ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. పొరుగు రాష్ట్రం కేరళకు చెందిన ఆందోళనకారులే హింసకు కారణమని కర్ణాటక హోంశాఖ మంత్రి బసవరాజ్ బొమ్మై ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులోనూ నిరసనల ఉధృతరూపం దాల్చాయి. బెంగళూరులోని టౌన్ హాల్ వద్ద అరవై వేలకు పైగా ఆందోళనకారులు రహదారులను స్తంభింపజేశారు. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ వామపక్ష నేతలతో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు పోలీసులు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తనను అదుపు లోకి తీసుకోవడం దారుణమని రామచంద్ర గుహ ఆగ్రహం వ్యక్తం చేశారు. టౌన్ హాల్ వద్ద నిరసనకారులు ఎంతకీ కదలకపోవడంతో బెంగళూరు సెంట్రల్ డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్ జాతీయ గీతం ఆలపించారు. గీతం ఆలపించిన తర్వాత ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

భాజపా అధికారంలో ఉన్న మరో రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ లో పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. లఖ్నోలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందారు. పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు రాళ్లు రువ్వి పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. సంభల్ జిల్లా లోనూ ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగి ఓ బస్సుకు నిప్పు పెట్టారు. రేపు మధ్యాహ్నం వరకు లఖ్నోలో ఇంటర్నెట్, ఎస్సెమ్మెస్ సేవలు నిలిపివేస్తున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. గుజరాత్ అహ్మదాబాద్ లోని షాహి ఆలంలో నిరసనకారులు భారీ ప్రదర్శన చేపట్టారు. అనుమతి లేకుండా నిరసన చేపట్టడంతో పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులు రాళ్లు రువ్విన ఘటనలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు. అహ్మదాబాద్ లోని మిర్జాపూర్ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో ఇరవై మంది ఆందోళనకారులు గాయపడ్డారు. 

ముంబైలో కాంగ్రెస్, ఎన్సీపీ సహా వివిధ పార్టీలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఆగస్ట్ క్రాంతి మైదానంలో శాంతియుత ప్రదర్శనలు జరిగాయి. వీటిలో పలు రాజకీయ పార్టీల కార్యకర్తలూ బాలీవుడ్ ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. శివసేన ప్రదర్శనకు దూరంగా ఉన్నప్పటికీ పౌరసత్వం కల్పించిన హిందూ శరణార్థులను కేంద్రం ఎక్కడ ఎలా ఉంచాలని అనుకుంటోందని ప్రశ్నించింది. నాసిక్ లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సంవిధాన్ బచావో పేరుతో ర్యాలీ జరిగింది. మధ్యప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఆందోళనలు కూడా ఎగిసిపడ్డాయి. మధ్యప్రదేశ్ లోని 43 జిల్లాలలో 144 సెక్షన్ విధించారు. ఢిల్లీ లోనూ ఆందోళనకారులు కదం తొక్కారు. ఎర్రకోట, పాత ఢిల్లీ, జంతర్ మంతర్ వద్ద నిరసనలు హోరెత్తాయి. ఆందోళనకు దూరంగా ఉండాలన్న సూచనలను విస్మరించి ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు, ఆచార్యులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఆందోళనల వల్ల 20 మెట్రో స్టేషన్ లు మూసి వేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓ వైపు ఉచిత వైఫై సేవలను ప్రారంభించగా మరో వైపు ఇంటర్నెట్ సేవలను, ఎస్సెమ్మెస్ లను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆందోళనలతో ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఢిల్లీలో గురుగ్రామ్ మార్గంలో 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సిబ్బంది సకాలంలో చేరుకోలేక 19 ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి.

By
en-us Political News

  
అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో రంగంలోకి దిగాలని స్టాలిన్ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈస్ట్ తిరుచ్చి నుంచి టీవీకే అధినేత విజయ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంది. దీంతో విజయ్ తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు.
తాను సమాజంలో ఉన్న అసమానతలకు, కుల వివక్షకు మాత్రమే వ్యతిరేకమన్నారు.  దేవాలయాల పూజా విధానాలపై కానీ, ప్రజల మత స్వేచ్ఛపై కానీ ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పారు. 
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత విశ్వాసపాత్రుడిగా, తెలుగుదేశం పార్టీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే నాయకుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారు. సాధారణంగా అవకాశం ఉన్నా లేకున్నా టీడీపీపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకునే భూమన.. ఆ పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్‌ను ఎక్కి ప్రయాణించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఆయనను అరెస్ట్ చేయకుండా ముందస్తు రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తదుపరి విచారణలో ఈ పిటిషన్‌పై తుది తీర్పును వెల్లడిస్తామని పేర్కొన్న హైకోర్టు విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి రెండు రోజుల పాటు వర్చువల్
భారతీయ రాజకీయాల్లో సాధారణంగా కనిపించే శత్రుత్వాలు,
ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతంలో సుమారు 15 వేల‌ నుంచి 20 వేల‌ మంది వ‌ర‌కూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఒక‌ అంచనా. అయితే ఈ ప‌రిశ్ర‌మ ఇక్క‌డ స్థాపించ‌డంపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్లు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
కాంగ్రెస్ హైకమాండ్ కు, మరీ ముఖ్యంగా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన వీహెచ్ రాజ్యసభకు మూడు పర్యాయాలు ఎంపికయ్యారు. అయితే 2016 తర్వాత ఇంత వరకూ ఆయనకు పార్టీ పరంగా ఎటువంటి పదవీ దక్కలేదు.
కేరళం ప్ర‌జ‌ల‌కు దశాబ్దాలుగా సేవ చేస్తూ, విలువలతో కూడిన‌ రాజకీయాలు చేసే సతీశన్‌కు ఈ పదవి రావడం సముచిత గుర్తింపని రేవంత్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు అధికార బాధ్యతలు అప్పగించారని అన్నారు.
ఎల్‌డీఎఫ్ హయాంలో వి.డి.సతీశన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. క్లిష్ట సమయలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన తీవ్రంగా శ్రమించారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి తీసుకు రావడంలో సతీశన్ కీలక పాత్ర పోషించారు. కేరళం కాంగ్రెస్ కేడర్‌లో కూడా ఇదే అభిప్రాయం బలంగా ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం సీఎంగా సతీశన్ ను ఎంపిక చేసింది.
సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రుల పర్యటనల సమయంలో భద్రతా కారణాల రీత్యా పెద్ద సంఖ్యలో వాహనాలు కాన్వాయ్‌లో ఉంటాయి. అయితే.. దీనివల్ల భారీగా ఇంధన వ్యయం అవ్వడమే కాకుండా.. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయని భావించిన సీఎం, డిప్యూటీ సీఎం.. ఖజానాపై అనవసర భారం పడకూడదనే ఉద్దేశంతో, భద్రతకు విఘాతం కలగకుండానే వాహనాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు.
తీవ్రమైన పోక్సో కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ కారణంగానే బండి కుమారుడిపై పోక్సో కేసు నీరుగారిపోయిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ, హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ.. అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.