ఆర్ధిక స్వాతంత్ర్యానికి పాతికేళ్లు..

Publish Date:Jun 22, 2016

Advertisement

ఆర్ధిక సంస్కరణలు.. దేశ గతిని మార్చి..ప్రపంచంలోనే ప్రబల ఆర్ధిక శక్తిగా భారత్‌ ఎదగడానికి కారణమైన సాహసోపేత నిర్ణయాలు. అలా దేశానికి ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చి ఇప్పటికి 25 సంవత్సరాలు. పాముల్ని ఆడించుకునే దేశంగానే ప్రపంచ ప్రజలకి తెలిసిన భారతదేశాన్ని తిరుగులేని ఆర్థికశక్తిగా తీర్చిదిద్ది..ప్రపంచం ముందు నిలబడేలా చేసిన ఘనత తెలుగుబిడ్డ పీవీ నరసింహరావుదే. 1991 జూన్ 21 అప్పటికి రాజీవ్ హత్య జరిగి సరిగ్గా నెల రోజులైంది. ఒకవైపు ఉగ్రవాదం, మరోవైపు మందిర్-మండల్ ఉద్యమాలు. దేశంలో పూర్తిగా అస్థిరత నెలకొన్న సమయంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు తెలుగుబిడ్డ పీవీ నరసింహారావు. ఓ పక్క ఆర్ధిక పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది..విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటిపోయాయి. బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. పెను సవాళ్ల పద్మవ్యూహంలో చిక్కుకున్న పీవీ స్వాతంత్ర్య భారతావనిలో అత్యంత కఠోర పరీక్షకు సిద్ధమవ్వాలని గుర్తించారు.

 

సంస్కరణలు తీసుకురాకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని గ్రహించిన పీవీ పెద్ద సాహసం చేశారు. ఆర్ధిక మంత్రుల్ని కాదని..అప్పటి వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా, ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్‌గా పనిచేసిన మన్మోహన్‌ సింగ్‌ని ఆర్థిక మంత్రిగా చేశారు. కాని మన్మోహన్‌కు ఆర్థిక మంత్రి పదవి ఇవ్వడంపై సొంతపార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పటికే ప్రధాని పీఠంపై కన్నేసిన శరద్‌పవార్, అర్జున్ సింగ్, ఎన్డీ తివారీ లాంటి వారు పీవీ నిర్ణయాన్ని బహిరంగంగానే విమర్శించారు. వీటిని ఏ మాత్రం లెక్కచేయని నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌కు సర్వాధికారాలను, పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. అటు ప్రధాని తనపైన పెట్టుకున్న నమ్మకాన్ని మన్మోహన్ వమ్ము చేయలేదు. సరళీకరణ విధానాలకు బాటలు పరిచారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేయడం ద్వారా దేశ ముఖచిత్రాన్నే మార్చివేశారు. ఈ విధానాల వల్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరుబాట సాగించే కమ్యూనిస్టులు, తదితర వర్గాలను దానికి అనుకూలంగా ఒప్పించగలిగారు పీవీ. సంస్కరణల ఫలితంగా ఐటీ అన్నది భారతదేశంలో కాలు మోపింది. టెలికాం సంస్థలు తమ సాంకేతిక వ్యవస్థను ఇండియాలోకి విస్తరింపచేశాయి.

 

పలు దేశీయ సంస్థలను ప్రైవేటీకరణ చేయడంతో పని సంస్కృతి అభివృద్ధికరంగా మారింది. నాణ్యతలో, సేవలలో పోటీ తత్వం పెరిగింది. అలా కొద్ది రోజుల్లోనే భారతదేశం ఆర్థిక సంక్షోభం నుంచి తేరుకుని అనతికాలంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా ప్రపంచం ముందు నిలబడింది. ఈ విధంగా దేశానికి నిజమైన స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చారు పీవీ. ఇంత కష్టపడిన మనిషిని దేశం సరిగా గుర్తించలేదు. ఢిల్లీలో దివంగత ప్రధానుల కోసం స్మారక ఘాట్‌లు కట్టించడం ఆనవాయితీ. కానీ పీవీకి ఇది వర్తించదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు భారతరత్న ఇప్పించిన ధీశాలికి ఇంతవరకు భారతరత్న రాలేదు. ఆఖరికి ఆయన చనిపోయినప్పుడు మృతదేహన్ని కూడా సరిగా కాల్చకుండా వదిలివేసిన ఘనత ఆనాటి నేతలకే చెల్లింది. ఏదేమైనా పీవీ నాటిన సంస్కరణలు అనే మొక్క మహావృక్షమై ఇప్పుడు దేశానికే నీడనిస్తోంది. ఎవరు గుర్తించినా గుర్తించకున్నా నవ భారత నిర్మాతగా పీవీ చరిత్రలో నిలిచిపోతారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.