Publish Date:May 20, 2025
జగన్ అడ్డా కడపలో తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు అంటే మే 19 వరకూ జరిగే పసుపు పండుగ మహానాడు నిర్వహణ కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు 19 కమిటీలను ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఆహ్వానం నుండి భోజనాల వరకు అన్నీఈ కమిటీలే చూసుకుంటాయి.
మొత్తంగా మహానాడుకు సంబంధించి సమన్వయ బాధ్యతలన్నీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చూసుకుంటారు. నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రి, పార్టీ ఎంపీ రామ్మోహన్నాయుడు కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తారు. ఇక మహానాడు నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన 19 కమిటీలకు సంబంధించి ఒక్కో కమిటీలో పది నుంచి 20 మంది ఉంటారు. పల్లా శ్రీనివాస్, బక్కని నర్సింహులు ఆధ్వర్యంలో ఆహ్వాన కమిటీ, నారా లోకేశ్ నేతృత్వంలో సమన్వయ కమిటీ, యనమల ఆధ్వర్యంలో తీర్మానాలు, అచ్చెన్నాయుడి నేతృత్వంలో వసతి , రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో సభ నిర్వహణ, బీసీ జనార్దన్రెడ్డి నేతృత్వంలో భోజనాల కమిటీలను ఏర్పాటు చేశారు.
ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నారు. అదే విధంగా కడపలో మహానాడు నిర్వహించడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక మహానాడులో తొలి రోజు అంటే మే 27న పార్టీ అధినేత ఎన్నిక కోసం చంద్రబాబు నామినేషన్ దాఖలు కార్యక్రమం ఉంటుంది. రెండో రోజు పార్టీ చంద్రబాబును పార్టీ అధినేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటుంది. అలాగే రెండో రోజు వివిధ అంశాలు, సమస్యలపై చర్చ జరుగుతుంది. చివరి రోజు పార్టీ పలు తిర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదిస్తుంది. అనంతరం భారీ బహిరంగ సభ ఉంటుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/19-committees-for-mahanadu-39-198358.html
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి కొందరు గుర్తుతెలియని ఆగంతకులు ఫోన్ చేసి వేధింపులకు గురిచేశారు.
జూన్ 14వ తేదీలోపే తల్లికి వందనం అమలు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15వేల చొప్పున జమ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
చివరాఖరికి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంచు మించుగా ఏడాదికి పైగా సాగుతున్న మంత్రివర్గ విస్తరణ మెగా సీరియల్ కు కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు తెర దించింది.
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అస్వస్థకు గురి అయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టును తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ గ్రీన్ కో ప్రాజెక్టు దేశానికి, ప్రపంచానికి మార్గదర్శిలా నిలిచిందని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో తనను కావాలని లాగుతున్నరని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరం కమీషన్ ఎదుట బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్ని అబద్దాలు చెప్పారని తుమ్మల తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపైనా, మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణం రాజు, ఒక టీవీ చానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుపైనా ఏపీ డిప్యూటీ స్వీకర్ రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
వైసీపీ అధినేత జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారని లోకేష్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండ ఉక్కపోతతో అల్లడుతున్న ప్రజలకు వర్షంతో ఉపశమనం కలిగింది. ఉన్నపళంగా వాతావరణం మొత్తం చల్లబడింది.
తీవ్ర అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.
అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ ఒక చానెల్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు మ్యాగజైన్ ఎడిటర్ కృష్ణం రాజు, ఆయనను ఇంటర్వ్యూ చేసిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు క్యాబినెట్ విస్తరణకు ఉండే అవకాశముంది.