తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. వరుసగా వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల ప్రభావం నల్గొండ, వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా ఉంది. నల్గొండ జిల్లా కోదాడ వరద ముంపుకు గురయ్యింది. పలు కాలనీ వసుల ఇళ్లలోకి నీరు చేరింది. ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఖమ్మం జిల్లాలో మున్నేరు పోటెత్తింది.. ఖమ్మం జిల్లాలో దాదాపు 100 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. మహబూబాబాద్, సూర్యపేటలలో రైల్వే ట్రాక్ లు వరదతాకిడికి కోతకు గురయ్యాయి. అనేక రైళ్లు రద్దయ్యాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం వాటిల్లుతుంది. ఇక్కడ కిలో మీటర్లకు పైగా ట్రాఫిక్ పూర్తిగా స్థంభించిపోయాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. నాగార్జునాసాగర్ ఎడమకాల్వకు నాలుగు చోట్ల గండిపడింది. భక్త రామదాసు పంప్ హౌజ్ పూర్తిగా మునిగిపోయింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు చేరడంతో మూసీ, ఈసా నదులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు దాదాపు 15 మంది మృత్యువాతపడ్డారు. పదుల సంఖ్యలో అడ్రస్ లేకుండా పోయారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/15-people-died-in-telangana-due-to-heavy-rainsvijayawada-highway-is-at-a-standstill-39-184084.html
Publish Date:Dec 10, 2025
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
Publish Date:Dec 10, 2025
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండకు దగ్గర్లో ఒక దర్గా ఉంటే.. ఆ దర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై తమిళ కార్తీక దీపం పెట్టడం అనాదిగా వస్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.