దిల్ రాజుకీ, మహేష్కీ క్లాష్?
Publish Date:Jan 16, 2014

Advertisement
‘1.. నేనొక్కడినే’, ‘ఎవడు’ సినిమాల రిలీజ్ సంగతేమోగానీ, ఈ సినిమాల రిలీజ్ పుణ్యమా అని స్టార్ హీరో మహేష్బాబు, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మధ్య క్లాష్ ఏర్పడింది. మహేష్బాబు హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించాలని దిల్ రాజు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. మహేష్ కూడా దిల్ రాజు నిర్మాణంలో నటించడానికి ఆసక్తిగా వున్నాడు. దీనికి సంబంధించిన ప్రయత్నాలు కూడా ఆమధ్య ముమ్మరంగా జరిగాయి. అయితే ఇద్దరికీ లేటెస్ట్ గా క్లాష్ వచ్చింది. దీనికి కారణం వీరిద్దరి సినిమాలే.
మహేష్ నటించిన ‘1’, దిల్ రాజు నిర్మించిన ‘ఎవడు’ సినిమాలు రెండు రోజుల తేడాతో ఈమధ్య విడుదలైన విషయం తెలిసిందే. రెండు భారీ సినిమాలు రెండు రోజుల తేడాతో విడుదల కావడం సినిమా వ్యాపార సూత్రాల రీత్యా సరైన పద్ధతి కాదు. రెండు సినిమాలు ఒకదానితో మరొకటి పోటీపడి రెండు సినిమాలూ నష్టపోయే ప్రమాదం వుంది. రెండు సినిమాలూ బాగున్నా రెండిటికీ కలెక్షన్లు రావు. ఒక సినిమా బాగుండి రెండో సినిమా బాగా లేకపోతే బాగాలేని సినిమా నిర్మాత నిలువునా ఆరిపోయే ప్రమాదం వుంది. ఆ ప్రమాదాన్ని ఆపాలన్న ఉద్దేశంతో మహేష్బాబు దిల్ రాజుని ‘ఎవడు’ సినిమా విడుదలను రెండు వారాలపాటు వాయిదా వేసుకోవాలని కోరాడని సినీ వర్గాల సమాచారం. ఎలాగూ తనతో సినిమా తీయడానికి దిల్ రాజు ఉత్సాహం చూపిస్తున్నాడు కాబట్టి తాను అడిగినదానికి దిల్ రాజు ఒప్పకుంటాడని మహేష్ భావించాడు.
అయితే దిల్ రాజు మాత్రం చాలా కూల్గా అలా కుదరదని చెప్పేశాడు. తన సినిమా విడుదల ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని, ఇంకా వాయిదా వేసే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని మహేష్కి నిర్మొహమాటంగా చెప్పేశాడు. దాంతో మహేష్ ఇలా అయితే నేను నీతో సినిమా చేసే విషయాన్ని పునరాలోచించుకోవాల్సి వస్తుందని చెప్పాడట. నీతో సినిమా లేకపోతే పాయె నేను మాత్రం ‘1’కి పోటీగా ‘ఎవడు’ రిలీజ్ చేయడం ఖాయమని చెప్పేశాడు. అన్నట్టుగానే ఆ సినిమాకి పోటీగా ఈ సినిమాని రిలీజ్ చేశాడు. టోటల్గా జరిగిందేమిటంటే, ‘1’ సినిమా మీద ‘ఎవడు’ సినిమా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇది మహేష్ బాబుకి మరింత ఆగ్రహాన్ని తెప్పించినట్టు సమాచారం.
http://www.teluguone.com/news/content/1-nenokkadine-evadu-32-29261.html

హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..

మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?

డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.

ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..

2015 సంవత్సరంలో టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్స్గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్గా తెలుస్తుంది.

క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి

2015 సంవత్సరంలో టాలీవుడ్లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.

టాలీవుడ్లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...

సుధీర్బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...

ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..

డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.

త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో

దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.