Publish Date:Nov 11, 2013
తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయిలో వున్న కార్యకర్తల నుంచి జాతీయ స్థాయిలో వున్న నాయకుల వరకూ ఇప్పుడు శభాష్ ఎర్రబెల్లీ అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా, పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఎర్రబెల్లి దయాకరరావు ఇటీవల తన సహచరులు కోడెల శివప్రసాదరావు, పయ్యావుల కేశవ్ మీద ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణవాదిగా ఎర్రబెల్లి చేసిన కామెంట్లను తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరూ సానుభూతితో అర్థం చేసుకున్నారు.
ఎర్రబెల్లి స్థానంలో ఎవరూ వున్నా అలాగే స్పందించేవారని భావించారు. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ పార్టీలు ఎర్రబెల్లి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతాయని, దానిని తమకు అనుకూలంగా మలచుకోవాలని ప్లాన్ చేశాయి. అయితే ఎర్రబెల్లి వ్యాఖ్యల వివాదం టీ కప్పులో తుపానులా చల్లారిపోయి ఆ పార్టీలకు నిరాశ మిగిల్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తన దింపుడుకళ్ళం ఆశలను వదులుకోలేదు. తెలుగుదేశం పార్టీలో అసంతృప్తిలో వున్న ఎర్రబెల్లి దయాకరరావుని కాంగ్రెస్ వైపు లాక్కోవాలని గాలం వేసింది. ఆహ్వానాల మీద ఆహ్వానాలు పంపింది. ‘ఆపరేషన్ ఆకర్ష’ సృష్టికర్త అయిన కాంగ్రెస్ పార్టీ ఎర్రబెల్లిని ఎలాగైనా తమ పార్టీలో చేర్చుకోవాలని చేసిన అన్ని ప్రయత్నాలనూ ఎర్రబెల్లి విజయవంతంగా తిప్పికొట్టారు.
ఆయన అక్కడితో ఆగకుండా తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో తెలంగాణ ప్రాంత నాయకులు, కార్యకర్తలో జరిపిన మేధోమధన సదస్సులో ఈ విషయాన్ని బయటపెట్టారు. తాను ఎట్టిపరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టనని, ఒకవేళ పార్టీని వీడాల్సివస్తే రాజకీయాల నుంచి తప్పుకుని వ్యవసాయం చేసుకుంటానని ఎర్రబెల్లి ప్రకటించడం సదస్సులో కరతాళధ్వనులు మోగేలా చేసింది. శభాష్ ఎర్రబెల్లీ అని పార్టీలోని ప్రతి ఒక్కరూ ప్రశంసించేలా చేసింది. ఎర్రబెల్లి దయాకరరావు లాంటి నాయకులు చంద్రబాబు వెంట వుంటే ఇక తిరుగేముంటుందని మేధోమథన సదస్సులో పాల్గొన్న తెలంగాణ ప్రాంత తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అభిప్రాయపడ్డారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-yerrabelli-dayakararao-39-27346.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.