పీవోకే ప్రధానినౌతా.. నవాజ్ షరీఫ్ సంచలన ప్రకటన.!
Publish Date:Jul 23, 2026
Advertisement
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తాను పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రధానిని అవుతానంటూ చేసిన ప్రకటన పాకిస్థాన్ లోనే కాకుండా యావత్ ప్రపంచ దేశాలలోనూ సంచలనం సృష్టించింది. ఆ ప్రకటన అన్ని విషయాలనూ అధిగమంచి ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా దేశ ప్రధానిగా పని చేసిన నాయకుడు ఎవరైనా సరే, ఆ తర్వాత ప్రాంతీయ లేదా స్థానిక పదవులను చేపట్టడానికి సుముఖత చూపరు. అటువంటిది పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మాత్రం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ప్రాంతానికి ప్రధాని కావాలని ఉందంటున్నారు. పాకిస్ధాన్ ప్రధానిగా మూడు సార్లు పని చేసిన నవాజ్ షరీఫ్.. వివాదాస్పద ఆక్రమిత ప్రాంతానికి ప్రధాని పదవి చేపట్టాలని భావించడం వెనుక వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్ నగరం వేదికగా జరిగిన భారీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన నవాజ్ షరీఫ్, అక్కడ తన పిఎమ్ఎల్-ఎన్ విజయం సాధిస్తే.. పీవోకే ప్రధానిగా బాధ్యతలు చేపడతానని చెప్పారు. నవాజ్ షరీఫ్ ప్రకటనకు పీఓకేలో ప్రస్తుతం నెలకొన్నపరిస్థితులే కారణమంటున్నారు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం పీఓకేలో ఆర్థిక సంక్షోభం, ఆకాశాన్నంటిన ద్రవ్యోల్బణం, భరించలేని విద్యుత్ ఛార్జీలు, వీఐపీ సంస్కృతికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో లక్షల మంది రోడ్లపైకి వచ్చిఆందోళన చేస్తున్నారు. ఈ ప్రజా ఉద్యమాన్ని అణచివేయడానికి పాకిస్థాన్ ప్రభుత్వం ప్రయోగించిన నిర్బంధ చర్యలు, సైనిక బలగాల ఘర్షణల కారణంగా ఇప్పటివరకు అక్కడ పలువురు నిరసనకారులు అసువులు బాసారు. దీంతో ప్రజలలో ఆగ్రహావేశాలు పీక్స్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఎ ప్రజల్లో నెలకొన్న తీవ్ర ఆగ్రహ జ్వాలల నుంచి తప్పించుకుని, ఓటర్లను ఆకట్టుకోవడానికి నవాజ్ షరీఫ్ పీవోకే ప్రధాని ప్రకటన చేశారని అంటున్నారు. Nawaz Sharif PoK PM, Pakistan Occupied Kashmir, Shehbaz Sharif, Muzaffarabad Rally
http://www.teluguone.com/news/content/-will-become-the-prime-minister-of-pok-36-226840.html





