జీవన్‌‌రెడ్డిని ఫాంహౌస్ నుంచి గెంటేసిన కేసీఆర్... అందుకేనా?

Publish Date:Jul 16, 2025

Advertisement

గెటవుట్  ఫ్రమ్ మై ఫామ్‌హౌస్.. నా బిడ్డ ఓటమికి కారణం నువ్వే అని మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై గులాబీబాస్ ఫైర్ అయ్యారన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకే జీవన్‌రెడ్డి ఫామ్ హౌస్ కి చాలా రోజులుగా దూరంగా ఉంటున్నారట. కవిత ఎంపీగా పోటీ చేసినప్పుడు తనకు ఎమ్మెల్యేలు సహకరించలేదని బహిరంగంగా చెప్పిన మాట ఇప్పుడు బీఆర్ఎస్‌లో చర్చనీయాంశంగా మారింది. కవితకు సన్నిహితంగా ఉంటూ, కేసీఆర్‌కి నమ్మిన బంటుగా వ్యవహరించిన జీవన్‌రెడ్డి నిజామాబాద్ జిల్లాలో కవిత ఆధిపత్యాన్ని ఒప్పుకోలేక ఆమె ఓటమికి పావులు కదపారని కవిత వర్గం భావిస్తోందంట. 

గులాబీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి వీర విధేయుడు అని తనకు తాను ప్రచారం చేసుకునే నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మాజీ  ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కేసీఆర్ తన ఫాంహౌస్ నుంచి  గెట్ అవుట్ అంటూ బయటకు గెంటేసినట్లు  జోరుగా ప్రచారం సాగుతోంది. అ మాజీ ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్ పార్టీకి కోవర్టుగా మారి వెలగబెట్టిన వ్యవహారాలపై చర్చించుకుంటూ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలే కాదు కేసీఆర్ సైతం విస్తు పోయినట్టు సమాచారం. కేసీఆర్ చరిష్మా, కవిత ప్రచారాలతో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సదరు నేత అధికారాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారని ఇప్పటికే అన్ని వర్గాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. 

తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. జీవన్ రెడ్డి ఎంపీగా కవిత ఓటమిలోనూ కీలకపాత్ర పోషించారని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా కేసీఆర్ కన్నెర్ర చేసి ఫాంహౌస్ నుంచి బయటకు వెళ్లగొట్టిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎంపీ ఎన్నికల్లో కవిత ఓటమి పాలు కావడంలో కీలకపాత్ర పోషించినట్లు నాటి నుంచి చర్చ జరుగుతోంది. కవిత ఓటమి తర్వాత ఆయన తన మందిమగధులతో హైదరాబాద్, గోవా, దుబాయ్ లలో దావతులు చేసుకున్నట్లు జీవన్‌రెడ్డి అనుచరులే అంటున్నారంట. కవిత ఓటమి వెనుక జిల్లాకు చెందిన మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది.

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్రమ వ్యవహారాలు,  అతడిని ఫామ్ హౌస్ నుంచి గెంటేసిన దానిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో అడ్డూ అదుపూ లేకుండా దోచుకుని,  రాజ్యాంగేతరశక్తిగా వ్యవహరిస్తూ విచ్చలవిడిగా భూదందాలు, దౌర్జన్యాలకు పాల్పడిన అతడిని నియోజకవర్గ ప్రజలు గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం చేశారు. ఇప్పటికీ ఆయన నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఓటమి తర్వాత జీవన్‌రెడ్డి ఏదో చుట్టపు చూపుగా, అది కూడా ఎవరికీ తెలియకుండా అర్మూర్ వచ్చిపోతున్నారంట.  అది కూడా తన ఆస్తుల సంరక్షణ కోసమే అంటున్నారు.అధికారంలో ఉన్న సమయంలో జీవన్‌రెడ్డి అడ్డగోలు వ్యవహారాలు నడిపి  ఓటమి తర్వాత పార్టీని గాలికి వదిలేశారంట. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని గత కొంతకాలంగా కవిత ఆరోపణలు చేస్తున్నారు. ఆ లిస్టులో మాజీ ఎమ్మెల్యేలు షకీల్, జీవన్‌రెడ్డిలు కూడా ఉన్నారంటున్నారు. సిఎంఆర్ బియ్యం కుంభకోణంలో షకీల్ తప్పించుకుని తిరుగుతుండగా,  మూడో స్థానంలో ఓటమిపాలైన మరో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నియోజకవర్గంలో కనిపించకపోవడంపై  కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు 

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకున్న మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సొంత పార్టీ వ్యవహరాల్లో తనకేమి సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నాడని పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు కనీసం ప్రెస్ మీట్ సైతం పెట్టలేదని,  దాంతోపాటు అనేక అంశాలు  కేసీఆర్ దృష్టికి రావడంతో ఆయన జీవన్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారంట. 

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి  నిత్యం కేసీఆర్‌తో ఫామ్ హౌస్ లో ఉంటూనే పార్టీ అంతర్గత విషయాలు వ్యవహారాలన్నింటినీ ఎప్పటికప్పుడు కొందరు సన్నిహితులకు, ఇతర పార్టీలో ఉన్న వారికి వాట్సాప్ ద్వారా చేరవేసినట్లు కేసిఆర్, కేటీఆర్ నోటీస్ చేశారంట. అందుకే కేసీఆర్ అతడిని ఫామ్ హౌస్ నుంచి గెటవుట్ అని పంపించారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పార్టీ   అంతర్గత వ్యవహారాలన్నీ పూసగుచ్చినట్టు ప్రత్యర్ధి పార్టీ నాయకులకు చేరవేశారని జీవన్‌రెడ్డిపై కార్యకర్తలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  అధికారంలో ఉన్న సమయంలో నియోజవర్గంలో,  హైదరాబాదులో విచ్చలవిడిగా భూ అక్రమణులకు పాల్పడ్డారని,  బెదిరింపులు, దౌర్జన్యాలు చేశారని అలాంటి వ్యక్తిని భవిష్యత్తులో దరిదాపుల్లోకి రానివ్వొద్దని పలువురు కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

By
en-us Political News

  
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
ఆ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాన్ని మంగళగిరికి దీటుగా అభివృద్ధి చేస్తానన్నారు.
పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నంబర్ 1, 2, 3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ హైరాక్కీని దాటి త్వ‌ర‌లో లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.
లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం 400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి చేయ‌లేదు. ఎవ‌రి క‌ష్టం వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు.
అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.
ఈ పథకంలో ఉన్న లోపాలన సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది.
బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.