రాజకీయాలలో దార్శనికుడి తొలి అడుగుకు నేటితో నాలుగున్నర దశాబ్దాలు

Publish Date:Feb 25, 2023

Advertisement

రాజకీయంగా ఆయనతో విభేదించే వారు కూడా ఆయన దార్శనికతను వేనోళ్ల పొగుడుతారు. అభివృద్ధి విషయంలో ఆయన ఎక్కడా, ఎవరితోనూ రాజీపడరు. ఆయనే తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. హైదరాబాద్ బిజినెస్ స్కూల్, హైటెక్ సిటీ, ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ప్రగతి దారిలోనూ తొలి అడుగు ఆయనదే. అటువంటి దార్శనికుడు రాజకీయ ప్రస్థానం నేటికి నాలుగున్నర దశాబ్దాల కిందట మొదలైంది. ఔను సరిగ్గా నాలుగున్నర దశాబ్దాల కిందట ఇదే రోజు (ఫిబ్రవరి 25, 1978) చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు చంద్రబాబు తొలిసారి నామినేషన్ వేశారు.  అప్పటి నుంచీ చంద్రబాబుది ఒకే దీక్ష, ఒకే లక్ష్యం, ఒకే సంకల్పం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. దేశంలో అక్షర క్రమంలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలోనూ నంబర్ వన్ గా చూడాలి. ఆయన రాజకీయ ప్రస్థానం అంతా.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగానే సాగింది.

అభివృద్ధి విషయంలో కానీ, ప్రజా సంక్షేమం విషయంలో కానీ ఎక్కడా ఎప్పుడూ చంద్రబాబు రాజీపడిన దాఖలాలు లేవు. అధికారంలో ఉన్న సమయంలోనూ.. లేని సమయంలోనూ కూడా ఆయన రాష్ట్ర ప్రగతి, ప్రజల సంక్షేమం కోసమే తపించారు. సంపద సృష్టి జరగాలి.. ఆ పెరిగిన సంపద ఫలాలు పేదవాడికి చేరాలి. నాలుగున్నర దశాబ్దాలుగా ఆయన ఆలోచన, తపన, కృషి ఇందుకే. అడుగులూ ఆ లక్ష్య సాధనకే... తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు తొలి సారిగా ఎన్నికల బరిలో అడుగుపెట్టి  నేటికి సరిగ్గా 45 సంవత్సరాలు అయ్యింది. అప్పటి నుంచి ఈ నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు.

ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. మరెన్నో సంక్షోభాలను అధిగమించారు. ప్రజా శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రగతి కోసం అపనిందలు మోశారు. అన్నిటినీ ప్రజా జీవితంలో ప్రజల కోసం అడుగులు వేయడానికి లభించిన అవకాశాలుగానే భావించి ముందుకు సాగారు. దార్శనికత ఉన్న నేతగా.. దేశం మొత్తం ఆయన వైపు చూసేలా చేశారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం పని చేసిన చంద్రబాబు.. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పదేళ్లు విపక్ష నేతగా క్రీయాశీలంగా వ్యవహరించిన చంద్రబాబు.. విభజిత ఆంధ్రప్రదేశ్ లో గత నాలుగేళ్లుగా విపక్ష నేతగా జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతున్నారు. ప్రజలకు అండగా నిలబడుతున్నారు.  ప్రజాక్షేత్రంలో ఇంతగా  సుదీర్ఘకాలం ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటూ మనగలిగిన నేత వర్తమాన రాజకీయాలలో మరోకరు కనిపించరు.

అతి పిన్న వయస్సులోనే చట్టసభకు ఎన్నికైన నాయకుడిగా అప్పట్లో రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన చంద్రబాబు.. ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు.   తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంలో చంద్రబాబుదే కీలక పాత్ర అనడంలో సందేహం లేదు.  1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా  రాజకీయ కుట్ర జరిగి నెల రాజు నాదెండ్ల భాస్కరరావు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా  జరిగిన ప్రజాస్వామ్య ఉద్యమాన్ని చంద్రబాబు ముందుండి నడిపించారు.  1985 ఎన్నికల్లో తెలుగుదేశం విజయంలో కీలక భూమిక పోషించారు.    1995 సెప్టెంబర్  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ముఖ చిత్రాన్ని మార్చేశారు. ఆయన హయాంలోనే ఇప్పుటి ఐటీ హబ్ సైబరాబాద్ నిర్మాణమైంది. సాహసోపేతంగా  ఆర్థిక సంస్కరణలను  అమలు చేసి రాష్ట్రాన్ని ప్రగతి దారిలో పరుగులు పెట్టించారు.

అందుకే తిరుగులేని మెజార్టీతో రెండవసారి అధికారంలోకి వచ్చారన్నారు. అంతకు ముందు ఎన్టీఆర్ సారధ్యంలో బీజేపీ, కమ్యూనిస్టులు సహా దేశంలోని కాంగ్రెసేతర పార్టీలన్నిటినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.   నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ  ఏర్పాటు వెనుక క్రియాశీలంగా వ్యవహరించిందీ చంద్రబాబే.   దేశ ప్రధాన మంత్రుల నియామకంలోనూ అప్పట్లో చంద్రబాబు నిర్ణయాన్నే మిగిలిన పార్టీలన్నీ శిరోధార్యంగా భావించాయి. ఇక రాష్టప్రతులుగా కేఆర్ నారాయణన్, అబ్దుల్ కలామ్ ఎంపికలో కీలక భూమిక పోషించింది కూడా చంద్రబాబునాయుడే అనడంలో ఎటువంటి అతిశయోక్తీ లేదు.  

విపక్ష నేతగా ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం 208 రోజులు 2,817 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. రాష్ట్ర విభజనతో  అన్ని విధాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను అన్నిటా అగ్రస్థానంలో నిలబడాలంటే అది చంద్రబాబు వల్లే సాధ్యమని జనం నమ్మారు. అందుకే  మళ్లీ పూర్వ వైభవం తీసుకురాగల నాయకుడు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మొట్టమొదట గుర్తుకొచ్చిన పేరు చంద్రబాబు నాయుడు కనుకనే   2014 ఎన్నికలలో ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. సరే ఆ తరువాత 2019 ఎన్నికలలో ఒక్క చాన్స్ అభ్యర్థనకు తోడు వివేకా హత్య, కోడి కత్తి కేసుల కారణంగా వచ్చిన సానుభూతి పవనాలతో వైసీపీ విజయం సాధించింది. కానీ విజయం సాధించిన స్వల్ప కాలంలోనే జనంలో ఆ ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి జగన్ పట్ల భ్రమలు తొలగిపోయాయి.

వివేకా హత్య వెనుక ఉన్నదెవరు? కోడికత్తి సంఘటన డ్రామా ఎవరి వ్యూహం అన్నవి జనానికి అర్ధమౌతున్నాయి. దానికి తోడు రాజధాని అమరావతి విషయంలో జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు.. అన్ని వైపులా సమస్యలు చుట్టుముడుతున్నా ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరు.. అప్పులే తప్ప అభివృద్ధి జాడ లేకపోవడంతో మళ్లీ జనం చంద్రబాబు వైపు చూస్తున్నారు.  తన నాలుగున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు ప్రజల పక్షానే నిలిచారనడానికి ఇప్పుడు ఆయన సభలకు జనం బ్రహ్మరథం పట్టడమే నిదర్శనం అని చెప్పుకోవచ్చు.

By
en-us Political News

  
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.