బెజవాడ గజ గజ...వంశీ, నెహ్రూల మధ్య కోల్డ్ వార్
Publish Date:Dec 10, 2012
Advertisement
విజయవాడలో రాజకీయ వాతావరణం మరలా వేడెక్కినట్లు కనిపిస్తోంది. నగర పరిధిలోని గుణదలలో నిన్న తెలుగు దేశం పార్టీ కార్యాలయం ప్రారంభ కార్యక్రమం ఆ పార్టీ నేత వల్లభనేని వంశీ చేతుల మీదుగా ప్రారంభం అయింది. ఈ కార్యక్రమన్నంతా ఓ వ్యక్తి వీడియో తీయడమే ఇందుకు కారణం. అనుమానం వచ్చిన పార్టీ నేతలు ఆ వ్యక్తిని ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడింది. నగర కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రు అనుచరుడు సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని వీడియో తీస్తే, ఎంత డబ్బయినా ఇస్తానని చెప్పాడని రమేష్ అనే వ్యక్తి తెలుగు దేశం నేతలకు చెప్పాడు. దీనితో పార్టీ నేతలు మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో చిత్రాల ద్వారా నెహ్రు తన ఫై దాడి చేయాలని పధక రచన చేస్తున్నారని వంశీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ అవసరం తమకు లేదని, కేవలం ప్రచారం కోసమే వంశీ ఈ ఆరోపణలు చేస్తున్నారని నెహ్రు వర్గీయులు తిప్పి కొట్టారు. ఏది ఏమైనా గుణదలలో ఏ చిన్న రాజకీయ కార్యక్రమం జరిగినా అక్కడి సాధారణ ప్రజానీకం భయబ్రాంతులకు గురి అవుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలకు పరిస్థితి దృష్ట్యా పోలీసులు కూడా బారీ ఎత్తున బలగాలను మొహరిస్తూఉండడంతో అక్కడ ప్రజలలో ఆందోళనలు నెలకొని ఉన్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా ఈ ఇద్దరు నేతలు మాటల యుద్దానికి తలపడుతూ ఉండటం సహజంగా మారింది. ఇలా ఒకరి కార్యకలాపాలఫై మరొకరు నిఘా పెట్టడంతో విజయవాడ రాజకీయాలు మరలా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సంఘటన ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
http://www.teluguone.com/news/content/-vallabhaneni-vamsi-24-19652.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





