వర్షాకాలంలో దగ్గు, జలుబును ఇలా తగ్గించేయచ్చు..!

Publish Date:Jul 11, 2024

Advertisement


వాతావరణం మారితే అది ఆరోగ్యంపై ప్రభావం చూపడానికి ఎక్కువ సమయం పట్టదు.  వర్షాకాలం ప్రారంభమైన నేపధ్యంలో  దగ్గు,  జలుబు చాలా ఎక్కువగా  వస్తుంటాయి. ఈ సీజనల్ సమస్యలు సాధారణంగా రెండు మూడు రోజులలో తగ్గిపోతాయి. కానీ రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ఇవి అంత సులువుగా తగ్గవు.  వీటిని తగ్గించడానికి ఇంట్లోనే కొన్ని చిట్కాలను ప్రయత్నించవచ్చు.  ఇవి చాలా వేగంగా దగ్గు, జలుబు నుండి రిలీఫ్ ఇస్తాయి.  అవేంటో తెలుసుకుంటే..


తేనె..

 
జలుబు, దగ్గు వంటి సమస్యలు వచ్చినప్పుడు  ఉదయం, సాయంత్రం తేనెను వెచ్చ చేసి తింటే సమస్య నుంచి బయటపడవచ్చు. తేనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇది జలుబు,  దగ్గుకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. తేనెను కొద్దిగా వేడి చేసి తీసుకోవాలి. అయితే  ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తేనె ఇవ్వకూడదు.

వెల్లుల్లి..


యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్,  యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండే వెల్లుల్లిని తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు తగ్గుతాయి. వెల్లుల్లిని పచ్చిగా లేదా తేలికగా కాల్చి తింటే  రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇది దగ్గు, జలుబు నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.

పసుపు..


పసుపులో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి.  సీజనల్ సమస్యల నుండి ఉపశమనం అందించడంలో సహాయపడుతుంది. పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీవైరల్,  యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పసుపు నీటిని తయారు చేసి త్రాగవచ్చు లేదా పసుపు టీ లేదా పసుపు పాలు తాగడం వల్ల కూడా ఉపశమనం పొందవచ్చు.

తులసి..


తులసి ఆకులను వివిధ రకాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు. తులసి ఆకులతో చేసిన టీ తాగడం వల్ల దగ్గు,  జలుబు నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఈ ఆకుల్లో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. ఇవి దగ్గును నివారించడంలో ప్రభావవంతంగా ఉంటాయి.

ఉప్పు నీరు..


ఉప్పు నీరు గొంతును శుభ్రపరచడంలో..   దగ్గు,  జలుబు నుండి ఉపశమనాన్ని అందించడంలో ప్రభావవంతంగా ఉంటాయి . ఉప్పునీరు గొంతులో పేరుకుపోయిన శ్లేష్మాన్ని తొలగిస్తుంది.  ఈ నీటిని తాగాల్సిన అవసరం లేదు ఈ నీటితో పుక్కిలిస్తే సరిపోతుంది. ఉప్పు నీళ్లతో పుక్కిలిస్తే గొంతు క్లియర్ అవుతుంది. ఒక గ్లాసు వేడి నీటిలో ఒక చెంచా ఉప్పు వేసి ఆ నీటితో పుక్కిలించాలి.


                                            *రూపశ్రీ.

By
en-us Political News

  
కాలం మారినా మనిషి జీవన పోరాటం మాత్రం మారదు.  కొందరు కాలంతో పోటీ పడి ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా సాగుతూ ఉండాలి. లేకపోతే వారితో పాటు వారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.....
వేసవి అంటే మండే ఎండలు, వేడి గాలులు,  చెమటలు పట్టించే వాతావరణం.. ఇవన్నీ ఉంటాయి.  ఇలాంటి రోజుల్లో  రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా కలపడం వల్ల చెరకు రసం  రుచి మరింత ఇనుమడిస్తుంది...
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని..
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై..
నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్..
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది.  ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు.  అయితే చాలామంది అల్పాహారంలో..
కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి....
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం..
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ ..
ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి...
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి...
AI..ప్రపంచం అంతా వాడుతున్న కృత్రిమ మేధస్సు ఇది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కృత్రిమ మేధస్సు వాడకం చాలా పెరిగింది.  ఏ చిన్న సందేహం వచ్చినా ఏఐ ని వాడటం, దాన్ని సలహాలు, సూచలు అడగడం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.