తంబళ్లపల్లి ప్రవీణ్ రెడ్డి రాజకీయ చరిత్ర
Publish Date:Sep 28, 2012
Advertisement
తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచం అంచులవరకూ చాటేందుకు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయన ఆశయానికి ఆకర్షితులై ఎంతోమంది రాజకీయరంగంలోకి దూకారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న తంబళ్లపల్లి ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి తండ్రి ఉమాశంకర్ రెడ్డికూడా అలా తెలుగుదేశం పార్టీలోకి దూకిన రాజకీయ యోధుడే. ఎన్టీఆర్ ఆయనకు 83 ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్టిచ్చారు. ఉమాశంకర్ ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. పట్టువీడని ఎన్టీఆర్.. ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇప్పించి ప్రోత్సహించారు. ఆయన చనిపోయినప్పుడు ఎన్టీఆర్ స్వయంగా వెళ్లి ఉమాశంకర్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. బాధ్యత కలిగిన పార్టీ అధ్యక్షుడిగానే కాక, మంచిమనసున్న మనిషిగా పాడెకూడా మోశారు. ఆ కుటుంబానికి పెద్దదిక్కుగా నిలబడ్డారు. ఉమాశంకర్ భార్యకి మూడుసార్లు ఎమ్మెల్యే టిక్కెట్టిచ్చి రెండుసార్లు పార్టీయే పట్టుబట్టి గెలిపించుకుంది. ఉమాశంకర్ రెడ్డి కొడుకు ప్రవీవ్ కుమార్ రెడ్డిని తెలుగుదేశం పార్టీయే చదివించింది. 2009లో ఆయనకు పార్టీ టిక్కెట్టిచ్చి గెలిపించుకుంది. ఆ కృతజ్ఞతను మర్చిపోయి ఇప్పుడు ప్రవీణ్ చంద్రబాబుపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం నేతలు అంటున్నారు. ఎమ్మెల్యే అమర్ నాథరెడ్డి చరిత్రకూడా ఇలాంటిదేనని గుర్తుచేస్తున్నారు. అమర్ నాథరెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి కుప్పంలో అత్యధిక మెజార్టీతో మూడుసార్లు ఎంపీగా, మరో మూడుసార్లు ఎమ్మెల్యేగాగెలిచారని, 1999లో అమర్ నాథరెడ్డి ఓటమి పాలైనప్పుడు అండగా నిలిచిన పార్టీ.. తనని ప్రోత్సహించేందుకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షపదవిని కట్టబెట్టిన విషయాన్ని మరోసారి ఆయన గుర్తు చేసుకోవాలని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/-tamballapally-praveen-reddy-24-17747.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





