Publish Date:May 21, 2025
వైసీపీ నేత మాజీ సీఎం జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. వైఎస్సార్ కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో సజ్జల ఫ్యామిలీ ఆక్రమించిన 55 ఎకరాల ఫారెస్ట్ భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు సర్వే చేశారు. సికే దిన్నె రెవెన్యూ సర్వే నెం.1629లో 11 వేల ఎకరాలు ఉండగా మొత్తం 63 ఎకరాలను సజ్జల ఫ్యామిలీ కబ్జా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూముల్లో 52 ఎకరాలు అటవీ భూములుగా నిర్ధారణ అయింది. ఇందులో హద్దులు పాతి, బోర్డులు సైతం పెట్టారు. ఈ మేరకు గురువారం అటవీ శాఖకు 52 ఎకరాల భూములను రెవెన్యూ అధికారులు అప్పగించనున్నారు. కాగా కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం నేషనల్ హైవే పక్కన సజ్జల ఫ్యామిలీకి ఎస్టేట్ ఉంది. సర్వే నెంబర్1599, 1600/1,2,1601/1,1A, 2తో పాటు మరికొన్ని సర్వేల నెంబర్లలో మొత్తం 200 ఎకరాలకు పైగా భూములున్నాయి.
ఇందులో సజ్జల సోదరుడు దివాకర్ రెడ్డి కుమారు సందీప్ రెడ్డి పేరుతో 130 ఎకరాలు, కుటుంబ సభ్యుల పేరుతో మిగిలి భూములు సజ్జల ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని రిజిస్ట్రేషన్ భూములు సైతం ఉన్నాయి. 200 ఎకరాల్లో 146 ఎకరాలు పట్టా భూమి కాగా 5.14 ఎకరాలు డీకేటీ, రెండు ఎకరాలకు పై చిలుకు చుక్కల భూములుగా ఉన్నాయి. అయితే పక్కనున్న సర్వే నెం. 1629లోని ఫారెస్ట్ భూములు, రిజర్వు భూములను కూడా ఎస్టేట్లో కలుపుకున్నట్లు ఆరోపణలు ఉండటంతో అధికారులు విచారణ చేపట్టారు చేశారు. ఆక్రమణకు గురైన భూములను గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ అయ్యారు. దీంతో ఆక్రమణకు గురైన భూములను అటవీ శాఖకు అప్పగించనున్నారు. ఈ మేరకు సర్వం సిద్ధం చేశారు. దీనిపై ఇప్పటికే కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. సీకే దిన్నె తహశీల్దార్ ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకున్నారు. 63 ఎకరాలకు రెవెన్యూ సిబ్బంది హద్దులు పాతి, బోర్డులు పెట్టారు. ఇందులో 52 ఎకరాల అటవీ భూమిని ఆ శాఖకు అప్పగించనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-sajjala-ramakrishna-reddy-39-198434.html
ఐపీఎల్-2025 ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తమ హోం సిటీ బెంగళూరులో అడుగుపెట్టింది. వేలాది మంది అభిమానులు నడుమ ఆర్సీబీ ఆటగాళ్లు బస్సులో ర్యాలీగా వచ్చి చిన్నస్వామి స్టేడియానికి చేరుకున్నారు.బెంగుళూరు ఎయిర్ఫోర్ట్లో ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు.
వైసీపీలో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆ పార్టీ కీలక నేతలంతా జగన్ అరెస్టు ఖాయమంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా మద్యం కుంభకోణంలో జగన్ అరెస్టు అనివార్యమని అంతర్గత సంభాషణల్లోనే కాదు, మీడియా సమావేశాలలో కూడా చెప్పేస్తున్నారు. అదే జరిగితే పార్టీ సారథ్యం ఎవరిదన్న విషయంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలనకు ముగింపు.. తెలుగుదేశం పాలనకు ఆరంభం జరిగి బుధవారం (జూన్ 4) నాటికి సరిగ్గా ఏడాది పూర్తయ్యింద. ఈ సందర్భంగా వెన్నుపోటు దినం అంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. అలాగే కూటమి పార్టీలు ఏడాది పాలన సంబరాలకు సమాయత్తమయ్యాయి. ఈ రెండు కార్యక్రమాలలో ఒక కార్యక్రమం వెలవెల బోతే.. రెండోది కళకళలాడింది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. జులై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు బుధవారం ప్రకటించారు.
రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హైదరాబాద్ కాళేశ్వరం కమిషన్ నోటీసులను నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు
స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్.. సింపుల్గా స్వాట్. ప్రజాక్షేత్రంలో పరిస్థితులు ఎలా ఉన్నా.. వీళ్లు రంగంలోకి దిగితే మొత్తం సీనే మారిపోతుంది.
హైదరాబాద్ పోలీసులు మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే.. మహిళా పోలీసులతో ఓ కొత్త ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్.. ప్రధానంగా మహిళలు నిరసనలు, ఆందోళనలు చేసినప్పుడు వారిని సురక్షితంగా తరలించేందుకు తయారుచేస్తున్నారు.
గుంటూరు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం ర్యాలీలో ఈ గొడవ చోటుచేసుకుంది. పట్టాభిపురం సీఐ మధ్య తీవ్ర వాగ్వాదన్నికి దిగారు
క్రికెట్లో రికార్డుల కింగ్ విరాట్ కోహ్లీకి నెంబర్ 18 చాలా.. చాలా స్పెషల్. 18వ నెంబరుతో విరాట్కి ఉన్న అనుబంధం అపురూపమైంది. తాజాగా 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 18వ సీజన్లో ఆర్సీబీ ఐపీఎల్ కప్ను ముద్దాడింది.
ఏపీపీఎస్సీలో అవకతవకలు కేసులో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆయనను బుధవారం (జూన్ 4) జైలు నుంచి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసును సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
జగన్ పాలనపై నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమరశంఖం అని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జగన్ రాక్షస పాలనపై ప్రజలలో చైతన్యం తీసుకు రావడంలో నారా లోకేష్ పాదయాత్ర ప్రముఖ పాత్ర వహించిందని పేర్కొన్నారు.
మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వెనుపోటు దినంలో భాగంగా చీపురుపల్లిలో ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నాన్నా పులి కథ, తెలుసు కదా.. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కథ కూడా అలాగే వుంది. అందుకే.. ఇప్పుడు నిజంగానే మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఫిక్స్ అయినా, జనం నమ్మేలా లేరు. సరే.. జరిగితే అప్పుడు చూద్దాంలే అంటున్నారు.