పెట్రేగిపోతున్న ఎర్రచందనం స్మగ్లర్లు?
Publish Date:Jun 21, 2012
Advertisement
చిత్తూరు జిల్లాలో అక్రమంగా ఎర్రచందనం కలపను తరలించటానికి అలవాటుపడ్డ స్మగ్లర్లు పెట్రేగిపోతున్నారు. వీరిని అటు అతవీశాఖాధికారులు కానీ, ఇటు పోలీసులు కానీ అదుపు చేయటం కుదరటం లేదు. తాజాగా ఈ స్మగ్లర్లు తుపాకులతో తిరుగుతుండటం సంచలనమవుతోంది. తమను ఎవరి వెంబడించిన ఆ స్మగ్లర్లు తుపాకులతో బెదిరిస్తున్నారు. ఇంకా పోలీసులైతే ఎదురుకాల్పులకు కూడా సిద్ధమవుతున్నారు. ఒకవైపు మావోలు, మరోవైపు స్మగ్లర్లు తుపాకులతో ఎదిరించటంతో విసుగుచెందిన పోలీసులు స్మగ్లర్ల వెంటబడ్డారు. చిత్తూరుజిల్లా శంకరంపల్లిలో ఎదురుకాల్పులకు సిద్ధమయ్యారు. హోరాహోరీగా కాల్పులు జరపటంతో పోలీసులు, స్మగ్లర్లు బాగానే ఉన్నా మధ్యలో మరెవరో మృతి చెందారని సమాచారం. ఒకవైపు రాజకీయ అండ, మరోవైపు సొంతబలగాలు పెంచుకునే దిశగా స్మగ్లర్లు కృషి చేస్తుండటంతో భద్రతా సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళనలు ప్రారంభమయ్యాయి. రాను రాను గడ్డుపరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందని చిత్తూరు జిల్లా గ్రామీణులు ఆందోళన చెందుతున్నారు. స్మగ్లర్లు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని వారు వాపోతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న గ్రామీణులను వదిలేసి మిగిలినవారిని శాసించేందుకు స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నారు. ఏమైనా ఎర్రచందనం స్మగ్లర్లను అదుపు చేయకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్కోక తప్పదన్నట్లుంది నేటి పరిస్థితి. దీనిపై ప్రభుత్వం తక్షణం స్పందించకపొతే భవిష్యత్తులో స్మగ్లర్లు కొన్ని ప్రాంతాలను తమ గుప్పెట్లోకి తెచ్చుకునే అవకాశాలూ ఉన్నాయి.
http://www.teluguone.com/news/content/-red-sandalwood-smuggling-24-15028.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





