జగన్ కేసులో ఈడి విచారణ ప్రారంభం, సిబీఐకు 15 రోజుల రెస్ట్
Publish Date:Jun 21, 2012
Advertisement
దేశంలో సంచలనమైన జగన్ అక్రమాస్తుల కేసులో హవాలా నిధుల రాకను తెలుసుకునేందుకు ఇడి విచారణ ప్రారంభించింది. దీంతో అక్రమాస్తుల కేసు, ఎమ్మార్ కేసు, ఓఎంసి కేసుల విచారణలో సిబీఐకు 15 రోజుల పాటు ఊరట లభించింది. ముందు సమాంతరంగా విచారించాలని ఇడి భావించింది. అయితే కోర్టు నేరుగా ఆదేశాలు ఇవ్వటంతో 15 రోజుల విచారణకు ఇడి రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటివరకూ జగన్ కేసులో నిన్డుతులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను విచారించేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఇడి ఈ మూడు కేసులకు సంబంధించి సిబీ దాఖలు చేసిన ఛార్జిషీటు ప్రతులను కూడా కోర్టు నుంచి తీసుకుంది. అక్రమాస్తుల కేసులో న్జిమ్మగడ్డప్రసాద్, బ్రహ్మానందరెడ్డి, ఎమ్మార్ కేసులో సునీల్ రెడ్డి, కోనేరు రాజేంద్రప్రసాద్, బి.పి. ఆచార్య, విజయరాఘవ, ఓఎంసి కేసులో రాజగోపాల్, శ్రీలక్ష్మి, డి.వి. శ్రీనివాస రెడ్డి తదితరులను ఇడి విచారిస్తుంది. కోట్లాది రూపాయల హవాల నిధులు ఎలా జగన్ సంస్థలోకి వచ్చాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఇడి ఈ మూడు కేసులను విచారిస్తోంది. దాని ప్రధానలక్ష్యం మాత్రం హవాలా నిధులు ఎలా రాబట్టగలిగారు? ఈ నిధులు రాబట్టేందుకు అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేశారు? రాష్ట్రప్రభుత్వమేనా ఇంకెవరన్నా జగన్ కు సహకరించారా? ఇప్పటిదాకా సిబీఐ అనుమానించిన వారేనా ఇంకేమైనా కొత్తపాత్రధారులున్నారా? జగన్ కు మాత్రమే ఎందుకు ఈ విధమైన మద్దతు లభిచింది? వంటి పలు అనుమానాలను ఈ నిందితుల ద్వారా తీర్చుకునేందుకు ఇడికి అనుమతి లభించింది. దీంతో ప్రస్తుతం సిబీఐ విచారిస్తున్న జగన్ అక్రమాస్తుల కేసుల్లో 15రోజుల పాటు ఆ సంస్థకు విరామం లభించినట్లే. ఇప్పటిదాకా చేసిన విచారణ తాలూకు ఫైల్స్ క్షుణ్ణంగా పరిశీలించేందుకూ సిబీఐకు ఈ సమయం ఉపయోగపడుతుంది.
http://www.teluguone.com/news/content/-jagan-enforcement-directorate-24-15026.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





